— బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్
ప్రజా దీవెన, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా దేశానికి వారందించిన సేవలు చిరస్మరణీ యమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. దేశ స్వా తంత్ర్య అనంతరకాలంలో ప్రపం చానికే ఆదర్శవంతమైన స్వయం పాలన కోసం రాజ్యాంగాన్ని అందిం చారని. ఆర్థిక సామాజిక రాజకీయ సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమాన వాటా సమన్యాయం దక్కేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో బాబాసాహెబ్ కనబరిచిన దార్శ నికత మహోన్నతమైనదని కేసీఆర్ కొనియాడారు. దేశంలో రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా అంబేద్కర్ పొందుపరిచిన ఆర్టికల్ 3, ఈ దిశగా వారి దార్శనికత, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం చూపింద ని అన్నారు.
వారి విశేష కృషిని, వారు అందించిన స్ఫూర్తిని చాటేం దుకు ప్రపంచంలోనే అత్యంత మ హోన్నతమైన రీతిలో వారి స్ఫుర ద్రూపాన్ని తెలంగాణాలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా నిలుపుకు న్నామన్నారు. దేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన బీఆర్ అంబేద్కర్ ఘనమైన కీర్తిని చాటేందుకు దేశ చరిత్రలోనే ము నుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ పాలనా భవనానికి ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ స్టేట్ సెక్రటే రియట్’ అని పేరు పెట్టుకున్నామని తెలిపారు.