–బడ్జెట్ అనంతరం కాళేశ్వరం పర్యటనకు వెళ్ళనున్న కెసిఆర్
KCR: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ర్టo లో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ (KCR) తొలి సారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ (KCR)తొలిసారిగా సభలో అడుగు పెట్టారు. మొద టిసారి ప్రతిపక్ష నేత హోదాలో (Leader of the Opposition) లీడ ర్ ఆఫ్ అపోజిషన్ చైర్లో కూర్చుకు న్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS)పరాజయం చవిచూడగా కేసీఆర్ ను పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. అనా రోగ్య కారణాలతో ఆయన కొన్ని రోజుల తర్వాత స్పీకర్ చాంబర్లో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశా రు. అనంతరం జరిగిన అసెంబ్లీ సమావేశాలకు (Assembly meetings) కేసీఆర్ గైర్హాజర య్యారు. కాగా నేడు వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా అసెం బ్లీకి వచ్చారు. సభలో ఆయన ఏం మాట్లాడుతారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే బడ్జెట్ పూర్తయిన అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు.