–ప్రొఫెసర్ జయశంకర్ సార్ కు కెసిఆర్ ఘన నివాళి
–మలిదశ ఉధ్యమంలో మీరే మా సారథి, మీ అడుగు జాడలలోనే మా అడుగులు
–పుట్టుక మీది, చావు మీది, బతు కంతా తెలంగాణాదoటూ అంజలి
KCR:ప్రజా దీవెన, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ జయంతి( Professor Jayashankar Jayanti) సందర్భంగా తెలంగాణ కోసం ఆయన చేసిన కృ షి, త్యాగాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (kcr) స్మరించుకుంటూ కొనియా డారు. తొలిదశ నుంచి మలి దశ ఉద్యమం దాకా తెలంగాణ సాధన దిశగా ప్రొఫెసర్ జయశంకర్ చేసిన భావజాల వ్యాప్తి, దశాబ్దాలపాటు సాగిన ఉద్యమంలో వారు అందిం చిన పోరాటస్ఫూర్తిని కేసీఆర్ (kcr) కొని యాడారు. వారి అడుగుజాడల్లో తాను మలిదశ ఉద్యమానికి సార థ్యం వహించి, చివరి దాకా శాంతి యుత పద్ధతిలో, పార్లమెంటరీ పం థాలో ప్రజా ఉద్యమాన్ని కొనసాగిం చినట్టు చెప్పారు.చివరకు అరవై ఏండ్ల స్వయంపాలన ఆకాంక్షను నిజం చేసుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. రాష్ట్ర సాధన అనం తరం ప్రజల మద్దతుతో మొట్టమొ దటి ప్రభుత్వాన్ని ప్రొఫెసర్ జయశం కర్ స్ఫూర్తితోనే కొనసాగించామని కేసీఆర్ (kcr)తెలిపారు. ఉద్యమాన్ని నడిపి గమ్యాన్ని చేరుకోవడంలో నూ తదనంతరం పదేండ్ల అనతికా లంలోనే దేశానికే ఆదర్శవంతమైన పాలన అందించడంలోనూ వారి స్ఫూర్తి ఇమిడివున్నదని కేసీఆర్ పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను, సకలజనులను అన్ని రం గాల్లో ముందంజలో నిలిపిన బీఆర్ ఎస్ పాలన స్ఫూర్తిని కొనసాగిస్తూ, తెలంగాణను మరింతగా ప్రగతి పథంలో నడిపేలా కృషి చేయడమే వారికందించే ఘననివాళి అని కేసీ ఆర్ పేర్కొన్నారు.
జీవితాన్ని ధారబోసా రు..లంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ సార్ తన జీవితాన్ని ధారబోసారని కేటీఆర్ అన్నారు. స్వరాష్ట్ర సాధనలో దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమని, స్ఫూర్తి మరచిపోలేనిదని కొని యాడారు. పుట్టుక మీది చావు మీది బతుకంతా తెలంగాణది అని కీర్తించారు.పుట్టుక మీది.. చావు మీది.. బ్రతుకంతా తెలంగాణ దoటూ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని ధారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా మా ఘన నివాళులు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయం. స్వ రాష్ట్ర సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిన వారి కీర్తి అజరామరమై నది,వారి స్ఫూర్తి మరిచిపోలేనిది. సార్ అడుగుజాడల్లోనే తెలంగాణ రాష్ట్ర పోరాటం, తెలంగాణ ప్రగతి ప్రస్థానం. జోహార్ జయశంకర్ సార్ జై తెలంగాణ’’ అని కేటీఆర్ ట్వీట్ (tweet)చేశారు.