Bjp KishanReddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలో త్వరలో జరగనున్న ఎమ్మె ల్సీ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థు లను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. తెలంగాణాలో జరు గనున్న రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు అభ్య ర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించా రు.
నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానా నికి పులి సరోత్తం రెడ్డి, కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్కా కొమరయ్య (ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ) కరీంనగర్- నిజామాబా ద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్ర అభ్యర్థిగా సి.అంజిరెడ్డిని అధిష్ఠాన నిర్ణయం మేరకు ఎంపిక చేసి ప్రక టించడం జరుగుతోందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు.