Kodandaram: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా శాసనమండ లి సభ్యులుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరామ్ (Kodandaram), జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్ (Ali Khan)ప్రమాణ స్వీకా రానికి బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యథాతథ స్థితి స్టేట స్కో కొనసాగించాలని ప్రధాన న్యా యమూర్తి నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థు లుగా (As MLC candidates) దాసోజు శ్రవణ్, కుర్రా సత్య నారాయణ పేర్లను సిఫార్సు చేస్తూ అప్పటి ప్రభుత్వం గవర్నర్కు ప్రతి పాదనలు పంపింది.
అయితే 2023 సెప్టెంబర్ 19న అప్పటి గవర్నర్ త మిళిసై సౌందరరాజన్ వాటిని తిర స్కరించారు. అప్పటి గవర్నర్ నిర్ణ యాన్ని సవాల్ చేస్తూ శ్రవణ్, సత్య నారాయణ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(5) ప్రకారం తనకున్న విస్తృత అధికారాల పరంగా ప్రభు త్వ ప్రతిపాదనలను తిరస్కరిస్తున్న ట్లు గవర్నర్ చేసిన ప్రకటనను వారు సవాలు చేశారు. దీంతో ప్రొఫెసర్ కోదండ రామ్, జర్నలిస్ట్ అమీర్ అలీ ఖాన్ ప్రమాణ స్వీకారానికి బ్రేక్ పడటంతో (break) ఈరోజు ముహూర్తం ఖరారైంది. శుక్రవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వ ర్యంలో ఎమ్మె ల్సీలుగా అలీఖాన్, కోదండరామ్ ప్రమాణస్వీకారం చే శారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Next Post