–అత్యవసర పనులకు మొదటి ప్రాధాన్యత
–నియోజకవర్గంలో ఎక్కడ కూడా లో వోల్టేజి సమస్య ఉండొద్దు
–నాణ్యమైన, భద్రతతో కూడిన విద్యుత్ అందించడమే ప్రధాన కర్తవ్యం
–యాదాద్రి జిల్లా విద్యుత్ అధికా రులతో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
Komati Reddy Raj Gopal Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: గ్రామాలలో విద్యుత్ సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం నుండి మునుగోడు నియోజ కవర్గానికి రూ. 57 కోట్ల నిధులు మంజూరు చేయించారు మును గోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (Komati Reddy Raj Gopal Reddy). మంజూరైన వాటిలో నల్లగొండ జిల్లా పరిధిలోని చండూరు, చండూరు ము న్సిపాలి టీ, గట్టుప్పల్, మర్రిగూడెం, నాం పల్లి, మునుగోడు మండలాలకు 37 కోట్ల రూపాయలు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధి లోని నారా యణపూర్, చౌటుప్పల్, చౌటుప్ప ల్ మున్సిపాలిటీ లకు 20 కోట్ల రూపాయల నిధులు మంజూ ర య్యాయి.
మంజూరైన నిధులను అత్యవసర విద్యుత్ పనులకు (For electrical works) మొదటగా కేటాయించాలని గ్రామా ల వారిగా ఏ ఏ విద్యుత్ అవస రాలు ఉన్నాయనే అం శాలను గ్రామస్తులతో చర్చించి నివేదిక రూపొందించాలని ఆ నివే దిక ప్రకారం ప్రాధాన్యత క్రమంలో విద్యుత్ పనులు మొదలుపెట్టా లని విద్యుత్ అధికారులకు (For electricity authorities) సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో లో వోల్టేజ్ సమస్య (Voltage problem) ఉండకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల పైన ఉందని గుర్తు చేశారు. కొత్త ట్రాన్స్ఫార్మర్లు, కొత్త లైన్లు, సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంపు ను చేపట్టి విద్యుత్ సమస్యలు రాకుండా చూడాలన్నారు. విద్యుత్ షాక్ వల్ల ఈ ఒక్క రైతు, ఏ ఒక్క వ్యక్తి ప్రాణం పోకుండా భద్రతతో కూడిన నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని సూచించారు. విడతల వారీగా మరిన్ని నిధులు తీసుకొచ్చి నియోజకవర్గంలో విద్యుత్ సమస్యలు లేకుండా చేస్తానని తెలిపారు. ఈ సమావే శంలో ఇటీవల నూతనంగా విధు ల్లో చేరిన యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్ ఈ. సుధీర్ కుమార్, చౌటుప్పల్ డి ఈ. విజయ భాస్కర్ రెడ్డి లు పాల్గొన్నారు.