Komati Reddy Raj Gopal Reddy: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని కలిసిన రీజినల్ రింగ్ రోడ్డు బాధితులు… ఆయా నియోజకవర్గ వాసుల మొర
Komati Reddy Raj Gopal Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) మూలంగా భూములు కోల్పో తున్న చౌటుప్పల్ మండలం లోని పలు గ్రామాల ప్రజలు, భువ నగిరి నియోజకవర్గం లోని రాయ గిరి ప్రజలు, గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు, బాధితులు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి (Komati Reddy Raj Gopal Reddy) ని కలిశారు. ఈ రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్నామని ప్రభుత్వంతో మాట్లాడి అలైన్మెంట్ మార్పించాలని లేదా బహిరంగ మార్కెట్ విలువ ద్వారా పరిహా రమైన చెల్లించాలని రాజగోపాల్ రెడ్డి ఎదుట తమ గోడు వెళ్ళబో సుకున్నారు.
రీజినల్ రింగ్ రోడ్డు దక్షిణభాగం ఔటర్ రింగ్ రోడ్డు నుం డి 40 కిలోమీటర్ల మేర తీసుకు న్నారని, ఉత్తరభాగానికి వచ్చేసరికి ఔటర్ రింగ్ రోడ్డు నుండి 28 కిలో మీటర్ల దూరం మాత్రమే తీసుకు న్నారని శాసనసభ్యులు దృష్టికి తీసుకువచ్చారు. కాగా ఉత్తరభా గం దక్షిణ భాగం జంక్షన్ చౌటుప్పల్ వద్ద వస్తున్న నేపథ్యంలో భూము లు ఎక్కువగా కోల్పోవాల్సి వస్తుం దని వీలైతే అలైన్ మెంట్ (Alignment)లో మా ర్పులు తీసుకురావాలని, అది సాధ్యం కానీ ఎడల భూములు కోల్పోతున్న మాకు ప్రస్తుతం బహి రంగ మార్కెట్లో ఎంత ధర అయితే ఉందో అంత ధర చెల్లించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి చర్చించా లని వేడుకున్నారు. ఈ సమస్య తన దృష్టిలో ఉందని త్వరితగతిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యను చర్చిస్తా నని రీజినల్ రింగ్ రోడ్డు బాధితు లకు హామీ ఇచ్చారు.