— కాంగ్రెస్ కు అందుబాటులో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
–కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే ము ఖంలేదు, అవినీతిపై నిలదీస్తారనే
— ప్రభుత్వంపై బురదజల్లడమే కేటీఆర్, హరీష్ పని
— రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాజీ సీఎం కేసీఆర్ కు టచ్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మె ల్యేలు కేసీఆర్ కు టచ్ లోకి వెళ్లడం కాదు, 20 మంది బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ పార్టీకి అందుబాటులో ఉన్నారని, కానీ తామే వద్దంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.బుధవారం ఆయన గాంధీ భవన్ వద్ద మీడి యాతో మాట్లాడారు. గత బీఆర్ ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి, అక్రమాలపై నిలదీస్తామన్న భయం తోనే కేసీఆర్ బయటకు రావటం లేదని అన్నారు. ఇప్పటి వరకు మూడు సార్లు అసెంబ్లీ జరిగితే ఒక్కసారి కూడా ఆయన సభకు రాలేదని ఆక్షేపించారు. అధికారం లో ఉన్నప్పుడు కొడుకు, కూతురు, అల్లుడు గురించే పట్టించుకున్నడే తప్ప.. ప్రజా సమస్యలు పరిష్కరిం చలేదని మంత్రి కోమటిరెడ్డి వి మ ర్శించారు.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ (Ten years of BRS Govt) పాలనలో చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. యువ తకు ఉద్యోగాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వలేదని విమ ర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి, సంక్షే మమే ధ్యేయంగా దూసుకెళ్తున్నా మని చెప్పారు.ప్రభుత్వాన్ని విమ ర్శించడమే వారి పని, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావుకు రైతు రుణమాఫీ గురించి మాట్లాడే కనీస అర్హత లేదని మం డిపడ్డారు. ఏడాది తర్వాత బీఆర్ ఎస్ పార్టీ ఉండదని కోమటిరెడ్డి జో స్యం చెప్పారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పని తీరే ఇందుకు కారణమన్నారు.
కేసీఆర్ (KCR)పేరు ఇప్పుడు తెలంగాణలో ఎక్కడా వినపడడం లేదన్నారు. గతంలో తమ పార్టీ ఎమ్మెల్యేలను లాక్కున్న సమయంలో ప్రతి పక్షనేతగా ఉన్న భట్టి విక్రమార్క ఐదుగురు ఎమ్మె ల్యేలతో పోరాటం చేశారని గుర్తు చేసారు. అసలు కేసీఆర్ ఫామ్ హౌజ్లో ఉన్నాడా, లేడా అన్న అను మానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే ముఖం లేదని అన్నారు. కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్య క్తం చేశారు.వెనుకబడిన కులాలు అంటే కేసీఆర్, హరీష్, కేటీఆర్లకు చిన్న చూపు అంటూ మండిప డ్డారు. బలహీన వర్గాలకు చెందిన మహేష్ గౌడ్ (Mahesh Goud) పీసీసీ అధ్యక్షుడు అయ్యారని, దళితుడు భట్టి విక్ర మార్క డిప్యూటీ సీఎం అయ్యారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ (Congress party) అంటే ఇచ్చిన మాటకు కట్టుబడే పార్టీ అని వెల్లడించారు. ఫామ్ హౌస్లో లిక్కర్, డ్రగ్స్ అడ్డంగా దొరికి పోయి దీపావళి పండుగ దావత్ చేస్తే త ప్పేంది అంటున్నారని మంత్రి విమ ర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక దేశంలో మొదటి సారి బీసీకు లగణన ఏర్పా టుకు కేబినెట్ తీర్మా నం చేశామన్నారు. వెనుకబడిన కులాల మీద వాళ్లకు ప్రేమ లేదన్నా రు. పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనాలన్నారు. కేసీఆర్ ఫాంహౌ స్ నుంచి బీసీ కులగణనపై ప్రెస్ నో ట్ అయినా విడుదల చేయాలన్నా రు. లేదంటే మీ పార్టీ కనుమరుగు అవుతుందన్నారు.