Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkat Reddy: మూసీకి అడ్డుపడితే కేసిఆర్, కేటీ ఆర్, హరీష్ రావు ఫాంహౌజ్ లను మట్టడిస్తం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

–మూసీకి అడ్డుపడితే మీకే మూ డుకుంటుoది,మరో ప్రజా పోరాటం
–నల్లగొండ అంటేనే పోరాటాల గడ్డ కాని రెచ్చగొడితే రెచ్చిపోరు –మూసీ నీళ్లతో కేన్సర్, గుండె, కిడ్నీ, కాలేయం, ఊపిరితిత్తుల, అలెర్జీ వంటి తీవ్రమైన జబ్బులు
–16 ఎంపీ స్థానాల్లో ఇంటికి పంపి నా బీఆర్ఎస్ నాయకులకు సిగ్గు రాలేదు
–పదేండ్ల కింద్ర కూలీపోయిన కాళే శ్వరం డీపీఆర్ కు 33 కోట్లు చెల్లిం చారు
–మూసీ డీపిఆర్ చేసిన మెయిన్ హార్డ్ టీ కంపెనీపై కేటీఆర్ వి అస త్య ఆరోపణలు
–కాళేశ్వరం డీపీఆర్ చేసిన వ్యా ప్కోస్ ను ఒరిస్సా, గుజరాత్ బ్లాక్ లిస్ట్ లో పెట్టాయి
–కేటీఆర్ స్నేహితుని కంపెనీ గ్లోబరీ నాతో పదుల సంఖ్యలో విద్యార్ధుల మరణాలు
–పదేండ్లు ఎస్సెల్బీసీ సొరంగం ప డావుపెట్టి నల్గొండను నాశనం చే సిన కేసిఆర్
–ఎస్సెల్బీసీ కోసం ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేస్తానని ఆనాడే వైయస్ కు చెప్పాను
–ఎస్సెల్బీసీ బేరింగ్ కోసం సీఎం, నే ను అమెరికాకు పోయి రాబిన్స్ టన్నెల్ సీఈఓ లాక్ హంను కలిశాం
–మిషన్ భగీరథ, మిషన్ కాకతీ య, కాళేశ్వరంలో లక్షల కోట్లు దోచుకున్నారు.
–డబ్బుందనే అహంకారంతో ప్రధా ని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ రెచ్చిపోతున్నాడు
–మూసీ నిర్వాసితులకు నష్టపరి హారంతోపాటు, డబుల్ బెడ్ రూం ఇండ్లు
–కేటీఆర్ వైఖరి చూస్తుంటే నల్గొండ ప్రజల రక్తం మరుగుతోంది
–నల్గొండ ప్రజలు కేటీఆర్ మాట లతో కుమిలిపోతున్నారు
–ఇక మాకు పోరాటమే శరణ్య మంటూ రాజకార్లను తరిమి కొట్టినట్టు తరుముతాo
–మూసీ శుద్ధీకరణకు పూనుకున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలి పిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని దాదాపు కోటిమంది ప్రజల జీవితాలతో ముడిపడ్డ మూసీ (A tangled mousse) శుద్ధీకరణను అడ్డుకుంటే ఆనాటి రజాకార్లపై తిరుగుబాటు, తెలంగాణ తొలిదశ, మలిదశ ఉ ద్యమం మళ్లీ పునరావృతమవు తాయని రోడ్లు భవనాలు, సినిమా టోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) హెచ్చరించారు. శనివారం తెలంగాణ సచివాలయంలో ఏర్పా టుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు.మూసీ కాలు ష్యంతో తీవ్రంగా ఇబ్బందులు పడు తున్న నల్గొండ జిల్లా ప్రజలను వివ రిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోన య్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్యాయం జరిగిందనే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకుంటే.. గడిచిన పదేండ్లలో నల్గొండ జిల్లా కు తీరని అన్యాయం చేశారని ఆయన మండిపడ్డారు. నల్గొండ ప్రజల్ని నాయకులు రెచ్చగొడుతు న్నారని చెబుతున్న కేటీఆర్ మాట లు పూర్తిగా సత్యదూరమని చెప్పి న ఆయన నల్గొండ ప్రజలు రెచ్చ గొడితే రెచ్చిపోయేంత అమాయకు లు కాదని, స్వతహాగా పౌరుషం ఉ న్న వ్యక్తులమని ఆయన అన్నారు.

నల్గొండ ప్రజలకు పోరాటాలు కొత్త కాదని ఇలాగే మూసీకి అడ్డంపడితే మీ ఇండ్ల ముందు శాంతియుతం గా లక్షలమంది నల్గొండ బిడ్డలతో కలిసి ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. మూసీకి అడ్డుపడే ప్రతీ రాజకీయ పార్టీని నల్గొండ, రంగా రెడ్డి, హైదరాబాద్ (Nalgonda, Ranga Reddy, Hyderabad) లో ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని ఆయన హెచ్చరించారు. మూసీ కాలుష్యంతో ప్రజలు క్యాన్సర్, న రాల జబ్బులు, గుండె, కిడ్నీలు పాడై పోవడం, పిల్లల్లో పెరుగుదల లోపించడం, కంటి సమస్యలు, చర్మ వ్యాధులతో నానా అవస్థలు పడుతున్నారని, ఇంకా వాళ్లు అలా గే చచ్చిపోవాలని కేటీఆర్ కోరుకుం టున్నారా అంటూ ఆయన ప్రశ్నిం చారు. కేసీఆర్ మోసాలకు ఇప్ప టికే నల్గొండ నరకయాతన పడు తున్నదని, ఇప్పుడు ఆయన కొడు కు మోపయ్యిండని ఆక్షేపించారు. ఎవ్వరు అడ్డువచ్చిన మూసీ విష యంలో వెనకడుగువేసే పరిస్థితే లేదని తేల్చిచెప్పారు. మూసీ డీపిఆర్ చేసిన మెయిన్ హార్డ్ టీ కంపెనీ 29 దేశాల్లో అద్భుతమైన కట్టడాలను కట్టిందని ఎక్కడో పాకిస్థాన్ లో కేసు అయ్యిందని.. మూసీపై అవినీతి బురదజల్లడం దారుణమని ఆయన మండిప డ్డారు. కేసిఆర్ మానసపుత్రిక కాళేశ్వరం డీపీఆర్ ను తయారు చేసిన వ్యాప్కోస్ ను ఒరిస్సా గవర్నమెంట్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. గుజరాత్ లో నిషేధించిందని చెప్పిన మంత్రి కేటీఆర్ బంధువుల సంస్థ గ్లోబరిన పదుల సంఖ్యలో విద్యార్ధుల ప్రాణాలను బలిగొన్న విషయాన్ని కేటీఆర్ ప్రజలకు ఎందుకు పవర్ పాయింట్ ప్రజెం టేషన్ (Power point presentation)వేసి చెప్పలేదని ప్రశ్నించా రు. కాళేశ్వరం డీపీఆర్ కు 2015 లోనే 33 కోట్లు చెల్లించారని.. ఇప్పుడు 140 కోట్లు చెల్లిస్తుంటే గగ్గోలు పెడుతున్నరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడ టం వచ్చని అబద్ధాలు చెప్పి ప్రజల్ని నమ్మించాలనుకుంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని.. కేసిఆర్ కుటుంబ మోసాల్ని ప్రజలు పసిగట్టిన్రు కనుకనే 16 కు 16 స్థానాల్లో గుణపాఠం చెప్పారని ఎద్దేవా చేశారు. అసలు మూసీ డీపిఆర్ పూర్తికాకముందే ఎందుకు లక్షల కోట్లని ఎగిరెగిరి పడుతున్నరని ప్రశ్నించిన ఆయన.. కేటీఆర్, హరీష్ రావు (KTR, Harish Rao)అమెరికాకు పోయి ప్రభాకర్ రావును ఇండియాకు రాకుండా ఎందుకు అడ్డుపడుతున్నారో ముందు చెప్పాలని సవాల్ చేశారు.

మిషన్ భగీరథలో (Mission Bhagiratha) 5 వేల కోట్ల రూపాయలను దోచుకున్న కేసిఆర్ కుటుంబం అవినీతి వల్ల ఇప్పటికి అనేక గ్రామాల ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లే తాగుతున్నారని ఆయన ఆరోపించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను మార్చుకున్న వాళ్లకు ప్రతీది ఏటీఎం లలాగే కనిపిస్తున్నాయని చురకలు అంటించారు. ఆ దోపిడి యావ నుంచి బయటికి రాలేకనే అన్నిట్లో అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 2 వేల కోట్లు పెట్టి 9 కిలోమీటర్ల ఎస్.ఎల్.బీ.సీ సొరంగం పని పూర్తి చేస్తే ఇవ్వాల నాలుగు లక్షల ఎకరాల నల్గొండ భూములు బంగారు మాగాణంగా మారేవని, ఫ్లోరైడ్ ఇబ్బందులు తప్పేవని.. కేవలం నాకు పేరొస్తుందనే ఎస్.ఎల్.బీ.సీ సొరంగాన్ని పదేండ్లు పక్కన పెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్.ఎల్.బీ.సీ సొరంగం పూర్తియితే శ్రీశైలంలో డెడ్ స్టోరీజీ (Dead Story in Srisailam) ఉన్నా నల్గొండకు నీటి కొరత ఉండేది కాదని ఆయన అన్నారు. అంతేకాదు, పులిచింతకు నీళ్లను సీమాంధ్రకు తరలిస్తుంటే అక్కడి మోటర్లను తగులబెట్టానని.. ఆ విషయం అందరికి తెలుసన్న మంత్రి.. ఎస్.ఎల్.బీ.సీ సొరంగం మంజూరీ చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వై.యస్. రాజశేఖర్ రెడ్డికి తెల్చిచెప్పినట్టు గుర్తు చేసుకున్నారు. ఆనాడు పోరాడి ప్రాజెక్టును మంజూరీ చేయించి 80 శాతం పనులు పూర్తి చేస్తే.. కేవలం 11 కిలోమీటర్ల పనుల పూర్తి చేసేందుకు పదేండ్లు సరిపోకపోవడం అంటే.. నల్గొండపై వారికున్న సవతితల్లి ప్రేమకు నిదర్శనమని ఆరోపించారు. బ్రహ్మణవెల్లంల, శివన్నగూడెం, పూర్తిచేస్తే మరింతగా రైతులకు ఉపయోగం అవుతుందన్న మంత్రి నల్గొండలో బోర్ వేస్తే నీరు పసుపు రంగులో వస్తున్న విషయం ప్రపంచమంతా తెలుసుని చెప్పారు. ఆగష్టులో కేంద్ర పర్యావరణ సంస్థ మూసీలో ప్రమాదకరస్థాయిలో హెవీ మెటల్స్ ఉన్నాయని చెప్పిన సంగతి కేటీఆర్ కు తెలియదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) రాగానే మేం మంత్రులం అందరం కలిసి ముఖ్యమంత్రితో చర్చించి మూసీకి పరిష్కారం చూపెట్టాలని కోరామని తెలిపిన మంత్రి.. కోటిమంది తెలంగాణ బిడ్డల బతుకులు బాగు చేసేందుకే మూసీ శుద్ధీకరణను తీసుకున్నామని ఆయన వివరించారు. కేసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మూసీలో ఫ్లోరిన్ తో పాటు, ఇతర హెవీ మెటల్స్ పెరిగాయని కేంద్రప్రభుత్వ సంస్థలు తేల్చిన విషయం కేటీఆర్ కు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఎస్టీపీల ద్వారా రెండుమూడు దశల్లో ట్రీట్మెంట్ చేసినప్పటికి వందశాతం హెవీమెటల్స్ ను తీసివేయలేమని ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు చెప్తుంటే ఎస్టీపీ ద్వారా నల్గొండకు స్వచ్ఛమైన నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నించామని చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

కేటీఆర్ కు (ktr) అధికారం పోయినా అహంకారం తగ్గలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేదంటే దేశప్రధానికి జూమ్లా పీఎం – రాష్ట్రముఖ్యమంత్రిని హౌలా సీఎం అని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. మీకు డబ్బుంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వధినేతలు కనిపించరా అంటూ ఆగ్రహవవ్యక్తంచేశారు. ఆయన అధికారం పోవడంతో మానసికంగా ఇబ్బందులు పడ్డట్టు కనిపిస్తుందని.. డాక్టర్ కు చూపించుకోవాలని కేటీఆర్ కు సలహా ఇచ్చారు.

కేసిఆర్ (kcr)కొడుకు కాకుంటే కేటీఆర్ ను ఎవరు గుర్తుకూడా పట్టరని.. అట్లాంటిది కష్టపడి పైకొచ్చిన మా ముఖ్యమంత్రిపై, మాపై అవాకులు చెవాకులు పేలుతున్నాడని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రెజువేనేషన్ స్పెల్లింగ్ రాదని.. కండ్లు నెత్తికెక్కి మాట్లాడిన కేటీఆర్ మాటలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేవిధంగా ఉన్నాయని మండిపడ్డారు. మేం ZP స్కూళ్లో చదివినప్పటికి మేం సంస్కారవంతంగా మాట్లాడతామని చెప్పిన మంత్రి.. అమెరికాకు పోయి చదువుకొని కోట్లమంది ప్రజల ప్రాణాలను బలితీసుకోవాలని చూడటం బాధాకరమని ఆయన అన్నారు. ఆయన ఏదో పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినట్టు చెప్తారని..కానీ ఆయన చేసిన అద్భుతం మురికి కూపం దుర్గం చెరువుమీద తీగల బ్రిడ్జ్, టీహబ్ బిల్డింగ్ తప్పా కేటీఆర్ చేసింది ఏముందని ఆయన ప్రశ్నించారు. 80 వేల పుస్తకాలు చదివిన ప్రపంచ మేథావి కేసిఆర్ ఫాంహౌజు నుంచి బయటికు వచ్చి మూసీ వల్ల మూడు జిల్లాల ప్రజలు పడుతున్న సమస్యలపై మాట్లాడాలని మంత్రి సూచించారు.

నల్గొండలో పుట్టిన చిట్టి నాయుడు ఒకరు మొన్నటి ఎన్నికల్లో 3 వేల ఓట్లతో గెలిచినప్పటికి ఆయనకు నల్గొండ సమస్యలు పట్టవని అన్నారు.. బస్సు కిరాయిలు లేనోడికి ఇప్పుడు 80 ఎకరాల ఫామ్ హౌజ్ ఉందని.. ఉప్పల్ లో వాటర్ ప్లాంట్ పెట్టి నడిపిన వ్యక్తి.. కేసీఆర్ కు ఉన్నంత ఫామ్ హౌజ్ ఎట్లా వచ్చిందని ప్రశ్నించారు. అధికారం అడ్డం పెట్టుకొని పది వేల కోట్లు దోచుకున్న ఆ చిట్టినాయుడు.. ఎప్పుడు నల్గొండ బిడ్డల బాగుకోసం పనిచేయలేదని ఆరోపించారు.. మొన్నటి ఎన్నికల్లో మా అభ్యర్ధి దామోదర్ రెడ్డికి మోకాలి ఆపరేషన్ కావడంతో చిట్టి నాయుడు (Chitti Naidu)బతికిబయటపడ్డడని లేదంటే యాభైవేల మెజార్టీతో ఇంటికి పంపేవాళ్లమని తేల్చిచెప్పారు.