Komati Reddy Venkat Reddy: రాష్ట్ర ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు
ప్రజాదీవెన, హైదరాబాద్ : నూతన సంవత్సరం-2025 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. 2024 సంవత్సరంలో రాష్ట్రంలో 6 గ్యారెంటీల అమలు, కులగణన, రీజినల్ రింగ్ రోడ్డు, రైతురుణమాఫీ, సన్నాలకు బోనస్ అమలుతో పాటు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని.. రాబోయే రోజుల్లో మరింత శ్రమించి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.
ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలంతా పాడిపంటలు, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో సుభిక్షంగ ఉండాలని ఆయన ఆకాంక్షించారు.యువత నూతన సంవత్సర సంబరాల్లో సంయమనం పాటించాలని, వేగంగా బైకులు నడపడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని కోరారు.