–మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కొండా సురేఖ
Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రప్రగతికి జీవనా డులైన రహదారుల నిర్మాణం, అట వీ అనుమతులు లేక ఆగిపోతే అది రాష్ట్ర ప్రజల అభివృద్ధికి, జీవ న ప్రమాణాల పెంపుకు ఆటంకంగా మారుతుందని రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ఆవేదన వ్యక్తం చేశారు శనివారం డా.బీ.ఆర్.అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఛాంబర్ లో అటవీశాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ (Konda Surekha) తో కలిసి అటవీ అనుమతులపై రివ్యూ నిర్వహించిన మంత్రి, అటవీ అనుమతుల సాధనలో ఆలస్యంపై ఇద్దరు మంత్రులు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 5 సంవత్స రాలుగా 7 రోడ్డు ప్రాజెక్టు పనులు, 4 సంవత్సరాలుగా 1 ప్రాజెక్టు, 3 సంవత్సరాలుగా 20 ప్రాజెక్టులు, గత సంవత్సర కాలంగా 31 ప్రాజెక్టులు అటవీ అనుమతులు లేక ఆగిపోయా యని, ప్రజల దైనందిన జీవితాల ను ప్రభావితం చేసే ఇలాంటి రహ దారులు అటవీ అనుమతులు (forest permits)లేక ఆగిపోవడం బాధాకరమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.
ఐదేండ్లుగా ఇన్ని అనుమతులు పెండింగ్ లో ఉంటే ఇరు శాఖల అధికారులు ఏం చేస్తు న్నారని ప్రశ్నించారు.గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి రాష్ట్ర ప్రగతికి ప్రతి బంధకంగా మారడం దారుణమని ఇద్దరు మంత్రులు అన్నారు. జరిగిం దేదో జరిగిందని, ఇక నుంచైనా మరింత కృషి చేసి అటవీ అనుమ తులు సాధించాలని తెలిపారు. అంతేకాదు, అటవీ అనుమతుల సాధనను పర్యవేక్షించేందుకు ఆర్ అండ్ బీ శాఖ పరిధిలో ఎస్ఈ స్థాయి (SE level)అధికారిని ప్రత్యేకంగా నియమిస్తామని మంత్రి కొండా సురేఖకు (Konda Surekha) తెలిపారు. కేంద్రం నుంచి అనేక రోడ్లకు అనుమతులు సాధించినప్పటికి అటవీ అనుమతులు లేక ఆగిపోవడంతో.. కొత్త రోడ్ల మంజూరీ గురించి ఆడగడం ఇబ్బందిగా మారిందని.. రాష్ట్రానికి మరిన్ని జాతీయ రహదారులను మంజూరీ చేయించాలంటే ముందు మంజూరీ అయిన రోడ్లను నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ (Konda Surekha).. డిఎఫ్ఓల స్థాయిలో ఉన్న 11 అటవీ అనుమతుల ఫైళ్ల ఆలస్యంపై అధికారులను ప్రశ్నించిన మంత్రి.. అటవీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సంబంధించిన ఫైళ్ల క్లియరెన్స్ లో అనవసర ఆలస్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి హామి ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు తనకున్న పరిచయాలతో రాష్ట్రానికి అనేక రోడ్లను మంజూరీ చేయిస్తున్నారని.. అందుకు అనుగుణంగా అటవీ శాఖ నుంచి మరింత సహకారం అందించాల్సిన బాధ్యత మన భుజాలపైనే ఉందని అటవీ అధికారులకు ఆమే సూచించారు.
కేంద్రం నుంచి ఏ శాఖకు రానన్ని నిధులు ఆర్ & బీ శాఖకు మంజూరీ అవుతున్నాయంటే అది కేవలం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారి కృషే కారణం అని తెలిపిన మంత్రి కొండా సురేఖ.. అందుకు అనుగుణంగా.. అటవీ అనుమతులను వేగంగా సాధించేందుకు ఉమ్మడి జిల్లాల వారిగా పర్యవేక్షణాధికారులను నియమించాలని ప్రిన్సిపల్ సెక్రెటరీ అహ్మద్ నదీమ్ (Principal Secretary Ahmed Nadeem), పీసీసీఎఫ్ డోబ్రియల్ కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బీ అటవీ అనుమతులను కోఆర్డినేట్ చేసేందుకు అటవీ శాఖ నుంచి ఒక ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు..ఫైళ్ళ క్లియరెన్స్ ఆలస్యం కావడానికి గల కారణాలను డిఎఫ్ఓ ల నుంచి వివరణ తీసుకోవాలని పిసిసిఎఫ్ డోబ్రియాల్ ను ఆదేశించారు. తన కార్యాలయంలో పెండింగ్ లో ఉన్న 4 రోడ్డు ప్రాజెక్టు పనులకు సంబంధించిన అటవీశాఖ అనుమతుల ఫైళ్లను ఈ రోజే క్లియర్ (Clear) చేస్తానని ఆమే తెలిపారు.
రాష్ట్రానికి సంబంధించిన రోడ్డు ప్రాజెక్టుల (Road projects) అటవీ అనుమతులను పర్యవేక్షించే కేంద్ర ప్రభుత్వ (Central Govt) పర్యావరణ మరియు అటవీ శాఖ రీజినల్ ఆఫీసర్ త్రినాథరావు రాష్ట్రానికి సంబంధించిన అటవీ అనుమతుల ఫైళ్లను చిన్న చిన్న అంశాలపై వివరణలు అడుగుతూ కావాలని కాలయాపన చేయడం పట్ల సమావేశంలో ఇరువురు మంత్రులు ఆవేదనవ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి జరుగుతుంటే అండగా నిలబడాల్సిందిపోయి.. ఇలా చిన్న చిన్న సాంకేతిక కారణాలతో ఫైళ్లను జాప్యం చేయడం తగదని అన్నారు. అంతకు ముందు ఉప్పల్ ఎలివేటేడ్ కారిడార్ పై జరిగిన సమీక్షలో డిసెంబర్ చివరికల్లా ఒక స్లాబ్ ను పూర్తి చేయాలని మోర్త్ ఆర్ ఓ కృష్ణప్రసాద్, ఎస్ఈ ధర్మారెడ్డికి సూచించారు. సమావేశంలో పాల్గొన్న గాయత్రి యాజమాన్యం కూడా మంత్రి ఆదేశాలను పాటిస్తామని తెలిపారు.
ఈ సమీక్షలో ఆర్ &బీ శాఖ (R&B department) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, అటవీశాఖ ప్రధాన కార్యదర్శి అహ్మద్ నదీమ్, ఆర్ &బీ శాఖ ప్రత్యేక కార్యదర్శి దాసరి హరిచందన, ప్రత్యేక కార్యదర్శి రెవెన్యూ (డిజాస్టర్ మెనేజ్ మెంట్) హరీష్, పీసీసీఎఫ్ డోబ్రియాల్, ఈఎన్సీ, సీఈ లతో పాటు మోర్త్ ఆర్ఓ కృష్ణప్రసాద్, ఇతర అటవీ, ఆర్ &బీ, ఎన్.హెచ్.ఏ.ఐ అధికారులు పాల్గొన్నారు.