Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkat Reddy: రాష్ట్రo లో ప్రగతికి అడ్డుపడే రాజకీయాలు

–రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komati Reddy Venkat Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: సుదీర్ఘ ప్రాచుర్యం కలిగిన మూసీని ప్రక్షా ళన చేస్తమని జైకా నుంచి వెయ్యి కోట్లు రుణం తీసుకున్న బీఆర్ఎస్ నాయకులు, అధికారం పోగానే మూసీ ప్రక్షాళన వద్దని గగ్గోలు పెడు తున్నారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy). మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే.. రాజకీయాలు తగ దని ఆయన ప్రతిపక్షాలకు సూచిం చారు. శుక్రవారం అసోచాం ఆధ్వ ర్యంలో (auspices of Assocham) హెచ్ఐసీసీ నోవాటెల్ లో జరిగిన “అర్భన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ 2024” కు ముఖ్య అతి థిగా హాజరైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ప్రతిపక్ష పార్టీల ద్వం ద్వ విధానాలపై మండిపడ్డారు.

స్థిరమైన మౌళిక వసతుల నిర్మా ణం, రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం ప్రగతిశీలక నిర్ణయాలు తీసుకుంటు న్నామని.. గత పదేండ్ల తెలంగాణ విధ్వంసాన్ని సరిదిద్దేందుకు అహ ర్నిశలు శ్రమిస్తూ సమ్మిళిత, సుస్థి రాభివృద్ధి లక్ష్యాలవైపు సాగుతు న్నామని చెప్పారు. ప్రపంచవ్యా ప్తంగా వేగంగా విస్తరిస్తున్న అర్భన్ కల్చర్ కు అనుగుణంగా తెలంగాణ లో కూడా పట్టణీకరణ జరగవలసి న ఆవశ్యకత ఉందని ఈ సంద ర్భంగా మంత్రి తెలిపారు. అందు కోసం కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం భవి ష్యత్తు సవాళ్ళను ఎదుర్కొనేం దుకు మరియు అభివృద్ధికి బల మైన పునాదులు వేయడంతో పాటు రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చే సేందుకు అనేక మౌళిక సదుపా యాలను నిర్మిస్తున్నదని ఆయన వివరించారు.హైదరాబాద్ దశా- దిశను మార్చేందుకు మా ప్రభు త్వం కంకణం కట్టుకుందని చెప్పిన మంత్రి. అందులో భాగంగానే రోడ్లు, ఆర్ఓబీలు, ఆర్.యూ.బీలు, కొత్త లింక్ రోడ్లు (roads)నిర్మించడం వంటి కీల కమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నదని చెప్పారు. అంతే కాకుండా అర్భన్ ఏరియాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ సవాల్ తో కూ డుకున్నదని చెప్పిన మంత్రి అందు కోసం STPs నిర్మించి మెరుగైన మురుగునీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.ప్రస్తుతం ఓఆర్ఆర్ పరిధిలో దాదాపు 40% జనాభా నివసిస్తుందని, ఇది 2028 నాటికి 50% దాటే అవకాశం ఉం దని, అందుకు అనుగుణంగా హైద రాబాద్ లో పట్టణ విస్తరణ, మౌళిక వసతులను కల్పించేందుకు నిరంత రం కృషి చేస్తున్నామని చెప్పారు.

దేశంలో పరిమితమైన ప్రాంతంలో అపరిమితమైన ఫ్లోర్ స్పెస్ అందిం చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని చెప్పిన మంత్రి అందు కు అనుగుణంగా అగ్ని మాపక వ్య వస్థ, ట్రాఫిక్ నియంత్రణ, మౌళిక వసతులు, సౌకర్యాల (Fire fighting system, traffic control, basic facilities, facilities etc) కల్పనవంటి అంశాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుం టున్నట్లు తెలిపారు.ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు, మా మంత్రుల బృంద మంతా కలిసి మౌళిక సదుపా యాల కల్పనను వేగవంతం చేసేం దుకు స్పీడ్ స్మార్ట్, ప్రొయా క్టివ్, ఎఫీషీయంట్,ఎఫెక్టివ్ డెలివరీ) వంటి ప్రణాళికలతో 19 ప్రాజెక్టు లను వేగవంతంగా పూర్తిచేసేం దుకు ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే, ముసి రివర్‌ఫ్రంట్ అభివృద్ధి, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, శాటి లైట్ టౌన్స్ ఏర్పాటు, మెట్రో విస్తరణ, జి హెచ్ ఎం సీ పునర్వ్య వ స్థీకరణ, సికింద్రాబాద్ మరియు ఇతర నగరాల్లో ఎలివేటెడ్ కారి డార్లు, రీజినల్ రింగ్ రోడ్ (RRR), హైకోర్ట్ భవన నిర్మాణం, ఇంటిగ్రే టెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్‌ మరియు ఉస్మానియా నూతన భవన నిర్మాణం వంటి ప్రాజెక్టులను వేగవంతం చేస్తున్నామని తెలి పారు.

అంతేకాదు, హైకోర్టు భవ నంలో పీపీపీ మోడల్ లో పార్కింగ్ (Parking in PPP model) నిర్మించే అంశంపై ఆలోచన చేస్తు న్నట్లు ఆయన చెప్పారు. హైదరా బాద్ అభివృద్ధి కోసం మా ప్రభు త్వం ఇప్పటికే బడ్జెట్ లో రూ.10,0 00 కోట్లు కేటాయించడమే కాకుం డా ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన నగరంగా మార్చడా నికి అనేక ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. రా ష్ట్రంలో పర్యావరణ సుస్థిరతను మెరుగుపరచడమే లక్ష్యంగామా ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్‌తో కలిసి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యంగా కృషి చేయడంతో పాటు యువ తను స్కిల్డ్ మ్యాన్ పవర్ (Skilled Man Power)గా మా ర్చేం దుకు రాష్ట్రవ్యాప్తంగా స్కిల్ సెంట ర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల అభి వృద్ధికి కట్టు బడి ఉందని, మౌలిక సదుపాయా ల కల్పన అనేది రాష్ట్ర ఉజ్వల భవి ష్యత్తుకు పునాది వేస్తుందని, మేం గతంలో అధికారం లో ఉన్నప్పుడు ప్రస్తుతం ఎప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలను మెరు గుపర్చడానికి అహర్నిశలు శ్రమి స్తున్న విషయా న్ని ప్రజలు గమనించారని ఆయన చెప్పారు. ప్రజలు, మరియు వివిధ సంస్థల భాగస్వా మ్యంతో సమిష్టి గా శ్రమించి తెలంగాణను ప్రగతి పథం లో నడిపిస్తామని ఆయన చెప్పారు. ఈ కార్య క్రమంలో అమె రికన్ కాన్సుల్ జనరల్ (ఛీఫ్ పొలి టికల్ & ఎకా నమిక్ సెక్షన్), హైద రాబాద్ ఫ్రాంక్ పి టల్లూటో, ఫోనిక్స్ గ్రూప్ ఛైర్మన్ సురేష్ చుక్కపల్లి, అలార్డ్ యూని వర్సిటీ వీసీ డాక్టర్ పూనమ్ కశ్యప్, రాంబాబు బూరు గు, అసోచాం రాష్ట్ర ప్రతినిధి దినేష్ తో పాటు తదితరులు పాల్గొ న్నారు.