Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Komati Reddy Venkat Reddy: భారీ విస్తరణకు అడుగులు..!

–హైదరాబాద్ లో 10 లక్షల చదర పు అడుగుల్లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్
–మరో 15 వేల మందికి పెరగనున్న ఉద్యోగ అవకాశాలు
–న్యూజెర్సీ కార్యాలయంలో సీఈ వోతో సీఎం రేవంత్ భేటీ
–ఇప్పటికే హైదరాబాద్ లో 5 ఆఫీ సులు, 18 వేల ఉద్యోగులు
— తెలంగాణ స్టార్టప్ లలో వాల్స్ కర్రా రూ.839 కోట్ల పెట్టుబడులు –సీఎం సమక్షంలో ప్రభుత్వంతో ఒ ప్పందం కుదుర్చుకున్న సంస్థ
–రేవంత్ కు ఘనస్వాగతం పలికిన తెలంగాణ ప్రవాసులు
–అమెరికాకు పయనమైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

Komati Reddy Venkat Reddy:ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ మహానగరంలో ఐటీ పరిశ్రమ మరింత విస్తరణకు మార్గం సుగమమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) అమెరికా పర్యటనలో భారీ ఎత్తున విస్తరణకు అడుగులు ముందుకుపడ్డాయి. తొలిరోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కం పెనీ కాగ్నిజెంట్ (Penny Cognizant)శుభవార్త అందిం చింది. నగరంలో భారీ విస్తరణ ప్ర ణాళికను ప్రకటించింది. హైదరా బాద్ లో దాదాపు 15 వేల మంది ఉ ద్యోగులకు పని కల్పించేలా కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్లు సోమ వారం ప్రకటించింది. 20 వేల మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలి గి ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నెలకొ ల్పుతామని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ ప్రకటించారు. 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో తొలి కార్యాలయం ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలో ఐదు కార్యాలయాలు, 18 వేల మంది ఉద్యోగులను కలిగి ఉంది. కొత్త సాంకేతిక పరిజ్ఞానంలో మరింత విస్తరించాలన్న కంపెనీ లక్ష్యానికి అనుగుణంగా హైదరాబా ద్ లో కొత్త క్యాంపస్ నెలకొల్పనున్న ట్టు సీఈవో రవికుమార్ వెల్లడించా రు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మె షిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ (Artificial Intelligence, Machine Learning, Digital Engineering, Cloud Solutions సహా వివిధ ఆధు నాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు. సోమవారం సీఎం రేవంత్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం న్యూజెర్సీలోని కాగ్నిజెంట్ ప్రధాన కార్యాలయంలోమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ పరస్పర అవగాహన ఒప్పం దం కుదుర్చుకుంది.

ఐటీకి మరింత అనుకూల వాతావరణం.. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావర ణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కాగ్నిజెంట్ ఎంవోయూ (Cognizant MOU) సందర్భంగా సీఎం రేవంత్రెడ్డి అన్నారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ను తమ ప్రధాన గమ్య స్థానంగా ఎంచుకుంటాయని అభి ప్రాయపడ్డారు. కంపెనీకి ప్రభు త్వపరంగా పూర్తి సహకారం అం దిస్తామని, ఈ విస్తరణతో రాష్ట్రంలో వేలాది మంది యువతకు ఉద్యో గాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవ స్థపై సానుకూల ప్రభావం ఉంటుం దని తెలిపారు. హైదరాబాద్ పాటు తెలంగాణలోని ద్వితీయ శ్రేణి (Second tier) నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి మరింతగా దోహదపడుతుం దని ఐటీ శాఖ మంత్రి శ్రీధరాబాబు అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికు మారి, ఆర్థిక శాఖ, ఐటీ, పరిశ్రమల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రామకృష్ణారావు, జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు. అనం తరం ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేం జ్ ను సందర్శించింది.

హైదరాబాద్ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను, భవిష్యత్తు ప్రణా ళికలను ప్రత్యేకంగా ప్రశం సించారు. తెలంగాణలో పెట్టుబడు లు పెట్టాలనే ప్రచారంలో ప్రభుత్వం తో కలిసి పాల్గొంటామని హామీ ఇచ్చా రు. అంతకుముందు తెలం గాణ సంస్కృతిని చాటిచెప్పే పాటలు, నృత్యాలు (Songs and dances) విశేషంగా ఆకట్టుకు న్నాయి. ఎన్నారైలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఘనంగా సన్మానించా రు. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అధ్యక్షుడు మొహిందర్ సింగ్ గీల్డియాన్ పాల్గొ న్నారు. ఇదిలా ఉండగా అమెరికా కు చెందిన వాల్ష్ కర్రా హోల్డింగ్స్ రాబోయే ఐదేళ్లలో తెలంగాణలో నెలకొల్పే స్టార్ద్పలలో దాదాపు రూ.839 కోట్ల (వంద మిలియన్ డాలర్ల) పెట్టుబడి పెట్టేందుకు సిద్ధం గా ఉ న్నట్లు ప్రకటించింది. అలాగే మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు నెలకొల్పిన వి-హబ్లో రూ.42 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి సమక్షంలో వాల్ష్ కర్రా కంపెనీకి చెందిన ఫణి కర్రా, గ్రేగ్ వాల్ష్, వి-హబ్ సీఈవో సీతా పల్లచోళ్ల ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

జయశంకర్ సార్ ను మరువం: సీఎం రేవంత్ (cm revanth) …ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా జీవితాంతం గడిపిన ప్రొఫెసర్ జయ శంకర్ ను తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవల ను సీఎం గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయ డాన్ని జయశంకర్ వ్యతిరేకిం చార ని, అదే సమయంలో ఆంధ్రప్ర దేశ్ లో విలీనంతో తెలంగాణ ప్రాంతం, ప్రజలు ఏ విధంగా నష్టపోయారో గణాంకాలతో సహా ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలు సజీవం గా ఉంచిన ఘనత జయశంకర్ దేనని కొనియాడారు. ఆయన ఉద్య మ స్ఫూర్తిని కొనసాగిస్తామ ని, ఆయన ఆశయ సాధనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని రేవంత్ తెలిపారు.

అమెరికాకు కోమటిరెడ్డి పయనం..
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) సోమవారం అమెరికా వెళ్లారు. అక్కడి పలు కంపెనీల సీఈవోలతో ఆయన భేటీ కానున్నారు. నల్లగొండలోని ఎస్ఎ ల్బీసీ టన్నెల్ తవ్వకం బేరింగ్, ఇత ర మరమ్మతుల కారణంగా ఏళ్ల తర బడి ఆలస్యనువుతున్న నేపథ్యం లో ఆ తవ్వకాన్ని వేగవంతం చేసేం దుకు అవసరమైన అధునాతన బేరింగ్ యంత్రాలను సమకూర్చే కంపెనీలు ప్రతినిధులతో మంత్రి స మావేశం కానున్నారు. ఇందులో భాగంగానే ఆగస్టు 12న ఓహియో లోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మెషినరీ ఉత్పత్తి కంపెనీ సీఈవో లాక్హెూమ్ తో భేటీ కానున్నారు. కాగా, 7న అమెరికాలోని ప్రవాస భారతీయ నేతలతో నిర్వహించే ‘మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో సీఎం రేవంత్ తో కలిసి కోమటిరెడ్డి
పాల్గొననున్నారు.