Konda Surekha: ప్రజా దీవెన, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (ktr) తనపై నిరాధార ఆరోప ణలు, వ్యక్తిగత దాడులు చేసే వారిపై పోరాటం చేస్తానని తెలి పారు. సోషల్ మీడియా ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్ (ktr)తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక పోస్ట్ చేశారు.
“నా పాత్రపై వ్యక్తిగత దాడులు, నిరాధార ఆరోపణలు చేసేవారిపై తప్పకుండా పోరాటం చేస్తాను. న్యాయ వ్యవస్థపై నాకు నమ్మకం ఉంది. తప్పకుండా నిజం గెలు స్తుందనే విశ్వాసం కూడా ఉంది. మంత్రి కొండా సురేఖ (Konda Surekha) దురుద్దేశ పూరితమైన, చౌకబారు వ్యాఖ్య లకు గాను ఆమెపై రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేశాను. చాలా కాలంగా నిరాధార ఆరోపణలకు అడ్డూ అదుపూ లేకుండా పోయాయి. కొంతకా లంగా సోషల్ మీడియా (Social media) ద్వారా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక నుంచి అలాంటి ఆరోపణలు చేయకుండా కట్టడి చేయాలి. నేను ఎల్లప్పుడూ వ్యక్తిగత విమర్శల కంటే ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తాను. రాజకీయ విమర్శల పేరుతో చౌకబారు ఆరోపణలు చేసేవారికి ఈ వ్యాజ్యం ఒక గుణపాఠం అవుతుందని అనుకుంటున్నాను” అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.