— మాజీ మంత్రి కేటీఆర్
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరా బాద్ అంబర్పేట లోని సాయిబాబా కాలనీలో (Sai Baba Colony) హత్యకు గురైన రిటైర్ బ్యాంక్ మేనేజర్ లింగారెడ్డి దంపతుల ఇంటికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.అంబర్ పేట్ లోని సాయినగర్ కాలనీలో లింగారెడ్డి, ఉర్మిళ అనే 80 ఏళ్ల పై బడ్డ వృద్ధ దంపతులను పట్టపగలు వారి ఇంటిపై దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. ఈ జంట హత్యల ఘటన హైదరాబాద్ లోని ప్రతి మనిషిని, మనసు కలిచివేసింది.
లింగారెడ్డి గారి ముగ్గురు కుమార్తె లు అమెరికాలో ఉన్నారు. హైద రాబాద్ లాంటి ప్రశాంతమైన నగ రంలో ఇలాంటి సంఘటన జరగ టంతో వారంతా షాక్ లో ఉన్నారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పేం దుకే స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంక టేష్ (MLA Kaleru Venkatesh)గారితో కలిసి వచ్చాను. కేసీఆ ర్ అధికారంలో ఉన్నప్పుడు హైద రాబాద్ లో 10 లక్షల సీసీ కెమెరా లు ఏర్పాటు చేశారు.ఏ బస్తీకి ఆ బస్తీ, ఏ గల్లీకి ఆ గల్లీ, ఏ కమ్యూ నిటికీ ఆ కమ్యూనిటీ లో సీసీ కెమెరాలు (CC cameras)ఏర్పాటు చేశాం. సిటిజ న్ పోలీసింగ్ కూడా ఏర్పాటు చేశాం.పోలీస్ లకు సరైన వ్యవస్థ, స్వేచ్ఛను ఇచ్చి వారి పని వారిని చేయానిస్తే శాంతి భద్రతలు అదు పులో ఉంటాయి. ఈ జంట హత్య కేసులో ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు.ఈ రాష్ట్రంలో శాం తి భద్రతలు అదుపు లేవు, దారు ణమైన పరిస్థితులు ఉన్నాయం టూ స్వయంగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి (Jeevan Reddy) చెబుతున్నారు.
నిన్న జగిత్యాలలో జీవన్ రెడ్డి (Jeevan Reddy) అనుచరుడిని హత్య చేశారు. ఇక్కడ హైదరాబాద్ లో వృద్ద జంటను కిరాతకంగా హత్య చేశారు. జంట హత్యలు జరగటం తో హైదరాబాద్ లో ప్రజలు భయం తో ఉన్నారు. సాయిబాబా కాలనీ లో సీసీ కెమెరాలు పనిచేయటం లేదని స్థానికులు చెబుతున్నారు. నేను హైదరాబాద్ సీపీ గారిని, పోలీసులను నగరంలో శాంతి, భద్రతలు (Peace and security) అదుపులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతు న్నా. జంట హత్యలకు పాల్పడిన నిందితులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేయాలని, ఈ హత్య కేసులో నిందితులను ప్రజల ముందుంచాలని కోరుతున్నానని వ్యాఖ్యానించారు.