–బస్సులో అవసరమైతే బ్రేక్ డ్యా న్స్, రికార్డింగ్ డ్యాన్స్ చేయండి
— బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ ఆర్ వ్యాఖ్యలు
— సుమోటోగా విచారణకు స్వీకరిం చినట్టు మహిళా కమిషన్ చైర్మన్ వెల్లడి
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలు అల్లం, ఎల్లిపాయ పొట్టు తీయడం తప్పిదాన్ని కూడా వీడియో తీసి తప్పుగా చూపిస్తున్నారoటూ మంత్రి సీతక్క బుధవారం చేసిన వ్యా ఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ (KTR) స్పందించారు. గురువా రం ఉదయం పార్టీ రాష్ట్ర కార్యాల యంలో జాతీయ జెండా (National flag) ఎగురవేసి న అనంతరం ఏర్పాటు చేసిన స మావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘బస్సులో అల్లం ఎల్లిపాయ వలిస్తే తప్పా కుట్లు అల్లికలు చేస్తే తప్పా అని మా సీతక్క అంటున్నరు, త ప్పని మేమెక్కడ అన్నామక్కా తన్నుకుంటున్నారు మంచిగలేదు అని మామూలుగా అన్నం. మని షికో బస్సు పెట్టు మేమెందుకు అం టం. మనిషికో బస్సు పెడితే కుటుం బం అంతాపోయి మంచిగ కుట్లు అల్లికలు, అవసరమైతే, బ్రేక్డ్యాన్స్ లు, రికార్డింగ్ డ్యాన్స్లు ఏం చేస్తరో చెయ్యండి, మేమెందుకు వద్దంటం.
కేసీఆర్ (kcr) సీఎంగా ఉన్నప్పుడు బస్సు ల్లో ఈ రకంగా ఎప్పుడైనా ఆడబి డ్డలు కొట్టుకునే పరిస్థితి ఉండేదా సీ ట్ల కోసం కొట్టుకొనుడు, సిగలు ప ట్టుకొనుడు, గుద్దుకొనుడు, ఎన్నెన్ని చూస్తున్నమని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై మహిళా కమి షన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అభ్యం తరం వ్యక్తం చేశారు. వ్యాఖ్యలు అనుచితమని, వాటిని కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరిం చిందని ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. కేటీఆర్ (KTR)వ్యాఖ్యలు విస్తృతంగా ప్రచారమయ్యాయని, అవి మహి ళలకు అవమానకరంగా, వారిని కించపరిచేవిగా ఉన్నాయన్నారు. దీన్ని గమనించిన కమిషన్ అందు బాటులో ఉన్న ఆధారాల ప్రకారం స్వతంత్ర విచారణను ప్రారంభించి నట్టు తెలిపారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరనగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆయన దిష్టి బొమ్మలు (Dishti toys) దహనం చేసి, నిరసన తెలపాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)పిలుపునిచ్చారు.