Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

KTR: రుణమాపీ పేరుతో రేవంత్ వి అన్నీ అబద్దాలే

–మంత్రి తుమ్మల ప్రకటనపై కెటిఆర్ ట్విట్

KTR: ప్రజా దీవెన, హైదరాబాద్‌: 20 లక్షల మందికి రుణమాఫీ (Loan waiver) కానే కాలేదన్న వ్యవసాయ మంత్రి ప్రక టనతో సీఎం బండారం మరోసారి బట్టబయలైందని బీఆర్‌ఎస్‌ వర్కిం గ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) తెలిపారు.ఈ మేరకు కేటీఆర్‌ శుక్రవారం ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్టు చేశారు. ‘వందశాతం రుణమాఫీ పూర్తి చేశామని విర్రవీగిన ముఖ్య మంత్రివన్నీ డొల్లమాటలేనని ఇంకోసారి తేలిపోయింది.ఓవైపు డిసెంబర్ 9న ఏకకాలంలో చేస్తా మని దగా చేశారు.మరోవైపు 10 నెలలైనా 20 లక్షల మందికి మోసం చేశారు.రూ.2 లక్షల రుణమాఫీ పూర్తయిపోయిందన్న సన్నాసి మాటలు నయవంచన కాక మరేం టి అధికారిక లెక్కల (Official accounts)ప్రకారమే.. 20 లక్షల మంది అన్నదాతలకు అన్యాయం జరిగితే అనధికారికం గా రుణమాఫీ కాని రైతులందరో రేవంత్ చేతకానితనం అన్నదాత లకు కోలుకోని శాపంగా మారిందని కేటీఆర్‌ (ktr) ట్వీట్‌లో పేర్కొన్నారు.