–సిఎం రేవంత్ కు కేటిఆర్ విజ్ఞప్తి
KTR: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ప్రభుత్వం మాకిచ్చిన హామీల కు కట్టుబడి ఉండకపోతే రాష్ట్రం నుంచి వెళ్లిపోతామని అమర రాజా సంస్థ చెబుతున్నట్లుగా వార్తలు చూ స్తున్నమని, అదే నిజమైతే చాలా దురదృష్టకరమని బీఆర్ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు.ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైఖరేంటో అర్థం కాక చాలా సంస్థలు రాష్ట్రాన్ని వీడు తున్నాయని చెప్పారు. కేన్స్ టెక్నా లజీ (Cannes Technalogy) అనే సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్కు వెళ్లిపోయిందని, కార్నిం గ్ సంస్థ తమ ప్లాంట్ను చెన్నైకి తర లించిందని తెలిపారు. ఇప్పుడు అ మరరాజా కూడా వెళ్లిపోతానని చె బుతున్ననదని, తెలంగాణ బ్రాండ్ కు ఇది తీవ్ర నష్టం చేస్తుందని హె చ్చరించారు.రాజకీయ ప్రయోజనా లకోసం రాష్ట్ర ప్రయోజనాలను తా కట్టు పెట్టటం ఎంతమాత్రం మంచిది కాదని ప్రభుత్వానికి సూచించారు.
ప్రభుత్వ పాలసీలు (Government policy) పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుగుణంగా కొన సాగించాలన్నారు. అమరరాజా సం స్థ తెలంగాణలో రూ.9,500 కోట్ల పెట్టుబడులు పెట్టేలా వాళ్లను ఒ ప్పించేందుకు ఎంతో కష్టపడ్డామని గుర్తుచేశారు. రాష్ట్రానికి పెట్టుబడు లు తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభు త్వం (BRS Govt)పెట్టుబడిదారులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అలా గే కొనసాగిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. నిజానికి తెలంగాణ రా ష్ట్రం దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయంతో రెవెన్యూ సర్ ప్లేస్ స్టేట్గా ఉంది. కానీ స్వయంగా ము ఖ్యమంత్రే రాష్ట్రం అప్పుల్లో కూరు కుపోయిందని, దివాళా తీసిందం టూ ఎయిడ్స్, క్యాన్సర్ పేషెంట్ అని ప్రచారం చేస్తుండటం ఆవేదన కలిగిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర నష్టం చేసే ఇలాంటి ప్రకటనలు సీఎం (cm)చేయ వద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని అమరరాజా సంస్థ ఇతర ప్రాంతాలకు తరలి పోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారికి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కొనసాగించాల న్నారు. లేదంటే మరిన్ని సంస్థలు రాష్ట్రాన్ని వదిలే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.