Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Loan waiver Cheating: కొందరికి మోదం ఖేదం

–రుణమాఫీ అమలులో కొందరి ఆశానిరాశలు
–జాబితాలో పేరున్నా ఖాతాల్లో జమకాని రుణమాఫీ సొమ్ము
–ఫోన్‌కు మెసేజ్‌ రాకపోవడంతో రైతుల ఆందోళన
–నేటితో రూ.లక్షలోపు అందరికీ వస్తాయంటున్న బ్యాంకర్లు

Loan waiver Cheating:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana State Govt)ప్రకటించిన రూ.లక్ష లోపు రుణమాఫీపై క్షేత్ర స్థాయిలో కొంత గందరగోళం నెల కొంది. రుణమాఫీ జాబితాలో పేరు ఉండి మాఫీ సొమ్ము ఖాతాలో పడనివారు కొందరైతే, మాఫీకి అర్హత ఉండి జాబితాలో పేరు రానివారు మరికొందరు గందర గోళానికి గురయ్యారు. లబ్ధిదారుల జాబితాను గ్రామాల్లో ముందుగా వెల్లడించకపోవడమే ఇందుకు కారణమైంది.

ప్రభుత్వ మార్గదర్శకాలకు (Government guidelines) అనుగుణంగా మూడు నాలుగు రోజుల ముందే జాబితాలను వెల్లడించి ఉంటే రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించేందుకు, లోటుపాట్లను సరిదిద్దుకునేందుకు అవకాశం ఉండేది. రూ.లక్ష లోపు రుణం ఉన్న రైతు కుటుంబాలకు ఒకేసారి ఈ నెల 18న మాఫీ చేస్తు న్నట్లు ప్రభుత్వం ప్రకటించడం, లక్ష కు పైగా రుణం ఉన్నవారికి ఈ నెలా ఖరులోగా, రూ.2 లక్షల వరకు రు ణాలను ఆగస్టు 15 నాటికి మొత్తం మాఫీ చేస్తామని చెప్పడం తెలి సిందే. ఈ మేరకు రూ.లక్ష మాఫీని గురువారం ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి ప్రారంభించారు. మాఫీకి అర్హుల జాబితాలను వ్యవసాయ శాఖ బ్యాంకులకు అందజేయగా, వారు రైతుల బ్యాంకు ఖాతాల్లో మాఫీ సొమ్మును జమ చేశారు.

ఈ మేరకు మాఫీ అయిన చాలా మంది రైతుల ఫోన్లకు బ్యాంకుల (Banks to farmers’ phones) నుంచి మెసేజ్‌లు వచ్చాయి. అయితే కొందరికి మాత్రం రుణమాఫీ పొం దేవారి జాబితాలో పేరు ఉండి కూడా మాఫీ అయినట్లుగా మెసేజ్‌ రాలేదు. దీంతో ఆయా రైతులు ఆం దోళనకు గురై వ్యవసాయ శాఖ అధికారుల వద్దకు, బ్యాంకుల వద్ద కు పరుగులు పెట్టారు. అయితే జాబితాలో ఉన్నవారందరికీ మాఫీ వస్తుందని, అందరి ఖాతాల్లో డబ్బు జమ అయ్యేందుకు 48 గంటల సమయం పడుతుందని బ్యాంకు అధికారులు రైతులకు చెప్పి పంపి స్తున్నారు. ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో 83,124 మంది రైతులకు రూ.లక్ష చొప్పున మాఫీకిగాను రూ. 455 కోట్లు మంజూరయ్యాయి. కానీ జాబితాలో పేర్లున్న రైతుల ఖాతాల్లో శుక్రవారం వరకు కూడా డబ్బులు జమ కాలేదు. జనగామ జిల్లాలో 26,496 మందికి రుణ మాఫీ జరగాల్సి ఉండగా 22 వేల మందికి మాత్రమే జమ అయ్యా యి. మరో 4 వేల పైచిలుకు మందికి రాలేదు.

అర్హత ఉన్నా జాబితాలో రాని పేరు మరికొన్ని చోట్ల కుటుం బంలో ఒకరి కన్నా ఎక్కువ మంది పేరిట భూమి ఉన్నా ఒకే బ్యాంకు ఖాతా ఉండి, రూ.లక్ష లోపే రుణం ఉన్నా మాఫీ జాబితాలో వారి పేరు రాలేదు. ఇంకొన్ని చోట్ల కుటుంబం లో ఒకరి కన్నా ఎక్కువ మందికి రుణం ఉండి, అంతా కలిపి రూ.లక్ష లోపు ఉండగా ఒక్కరి పేరుమీద ఉన్న మొత్తం మాత్రమే మాఫీ అయింది. మిగతా వారి పేరిట ఉన్న మొత్తం మాఫీ కాలేదు. ఇలాంటి వారందరికీ సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళన చెందు తున్నా రు. అయితే ఈ మొత్తం గందర గోళానికి జాబితాలను ముందుగా వెల్లడించకపోవడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. రుణమాఫీ అమలుకు ముందే లబ్ధిదారుల జాబితాలను గ్రామాల్లో వెల్లడించి, అందరి ఖాతాల్లో ఒకటి రెండు రోజులు అటు ఇటుగానైనా సొమ్ము జమ అవుతుందన్న విషయాన్ని చెప్పి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని అంటున్నారు.

అయి తే ఆగస్టులో రుణమాఫీ (Loan waiver) చేస్తామని తొలుత ప్రకటించిన ప్రభుత్వం.. ఆ తరువాత వెంటనే అమలుకు ఉప క్రమించింది. తొలుత రూ.లక్ష రు ణం మాఫీ చేస్తామంటూ ఒక్క రోజులోనే మార్గదర్శకాలు విడుదల చేసి ఆ మరుసటిరోజే మాఫీ ప్రా రంభించింది. జాబితాలను నేరుగా బ్యాంకులకు పంపించింది. దీంతో జాబితాలను గ్రామాల్లో వెల్లడించే అవకాశంలేక లబ్ధిదారులెవరో తెలు సుకునే వీలులేకుండా పోయిం ది. మల్లన్నసాగర్‌ నిర్వాసితుల్లో చాలా మందికి రుణమాఫీ జరగలేదు. పంట రుణాలు చెల్లించొద్దని, తా ము మాఫీ చేస్తామని గత బీఆ ర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పడంతో 201 6కు ముందు తీసుకున్న రుణాలను వారు చెల్లించలేదు. అయితే కాంగ్రె స్‌ ప్రభుత్వం రుణమాఫీకి కటాఫ్‌ (cut off) విధించడంతో నిర్వాసితులకు మా ఫీ కాకుండా పోయింది. వీరిలో 17మంది రెన్యువల్‌ చేసుకోవడం తో వారి పేర్లు మాఫీ జాబితాలో వచ్చాయి.