–వేగంగా 70 అడుగుల మట్టి వినాయకుడు పనులు
–తుది దశకు చేరుకున్న మహా గణపయ్య రూపు
— సప్తముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనం
Maha Ganapati:ప్రజా దీవెన, హైదరాబాద్: ఖైరతాబాద్లో మహా గణపతి (Maha Ganapati) ప్రతిష్ఠాపన కార్యక్రమాలు చక చక చురుగ్గా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 70అడుగుల మట్టి వినా యకుడు సప్త ముఖ మహా శక్తి గణపతిగా భక్తులకు దర్శనమి వ్వనున్నాడు.ఏడు ముఖాలు, ఏడు సర్పాలు, 24 చేతులతో (With seven faces, seven serpents, and 24 arms) గణపతిని తీర్చిదిద్దుతున్నట్లు గణేశ్ ఉత్సవ కమిటీ పేర్కొంది. లంబోద రుడికి కుడి వైపున శ్రీనివాస కల్యా ణం, ఎడమ వైపున శివ పార్వతుల కల్యాణంతో పాటు అయోధ్య బాల రాముడి ప్రతిమను కూడా ఏర్పాటు చేయనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.ఒడిశా కళాకారులతో తయారీ ఒడిశాకు చెందిన కళాకా రుడు జోగారావుకు ఈసారి మహా గణపతి రూపకల్పన (Designed by Maha Ganapati) బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. శోభా యాత్ర సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని విగ్రహ నిర్మాణంలో అవసరమైన మార్పులు చేస్తున్నట్లు జోగారావు తెలిపారు.
జూన్ లోనే పనులు ప్రారంభించామని, విగ్రహ నిర్మాణం (Statue construction) లో 22 టన్నుల పైచిలుకు ఐరన్ ను వినియోగిస్తున్నామని చెప్పారు. పెద్ద ఎత్తున తరలిరానున్న భక్తులు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పేరొందిన ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకు నేందుకు పెద్ద సంఖ్యలో జనం తర లి వస్తుంటారు. రాష్ట్రం నలుమూల ల నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు వివరించారు. గతే డాది మహా గణపతిని 35 లక్షల పైచిలుకు భక్తులు దర్శించుకున్నా రని, ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని చెప్పారు.