–రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా జరపాలని పిసిసి నిర్ణయం
— టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
ప్రజా దీవెన, హైదరాబాద్:సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బిఆర్ఎస్ పదేళ్లలో ఇచ్చిన ఉద్యో గాలు కాంగ్రెస్ ఏడా దిలో ఇచ్చింది అధికారం కోల్పోయి న కేటీఆర్ లో అహంకారం తగ్గలే దని, బిఆర్ఎస్లో కేసీఆర్, కేటీఆర్ మాత్రమే మిగిలే పరిస్థితి కిషన్ రెడ్డి కిస్మత్ రెడ్డి లా మారిపోయారని, కిషన్ రెడ్డి తెలంగాణ కు చేసిన మేలు ఏంటని ఆయన ప్రశ్నించా రు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ జన్మదినొత్సవాన్ని డిసెంబర్ 9 వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరపాలని నిర్ణయిం చినట్లు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మాజీ సీఎం కెసిఆర్ ను ఉత్సవాలకు ఆహ్వాని స్తున్నట్లు తెలిపారు. ఇది రాష్ట్ర ప్రజల పండుగని ఇందులో ప్రతి ఒక్కరు పాల్గొనాలని పిలుపుని చ్చారు.సోనియా గాంధీ లేనిదే తెలంగాణ లేదని అన్నారు.
శుక్ర వారం మహేష్ గౌడ్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. రాజీవ్ గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది. కేటీ ఆర్ తెలంగాణ కోసం ఏం త్యాగం చేశారు. సీఎం రేవంత్ నాయకత్వం లో తెలంగాణ అన్ని రంగాల్లో అభి వృద్ధి చెందుతుంది. బిఆర్ఎస్ పదే ళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్ ఏడాది లో ఇచ్చిందన్నారు. అధికా రం కోల్పోయిన కేటీఆర్ లో ఏమా త్రం అహంకారం తగ్గలేదని మహేష్ గౌడ్ మండిపడ్డారు. ఇప్పటికైన కేటీ ఆర్ పగటికలలు కనడం మానేయా లని హితువు పలికారు. బిఆర్ఎస్ హయంలో లక్షల కోట్లు దోపిడీ జరి గింది ఇక ఆపార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని తేల్చిచెప్పా రు.కాంగ్రెస్ పార్టీ పెడుతున్న విగ్ర హం తెలంగాణ ను ప్రతిబింబించే విధంగా ఉందని, ఆనాడు బిఆర్ ఎస్ పెట్టిన విగ్రహం దొరకు ప్రతిబిం భంగా ఉందని ఎద్దేవ చేశారు.దేశం లో అతి తక్కువ సమయంలో ఎక్కువ దోచుకుంది కెసిఆర్ కు టుంబం మాత్రమేనని అన్నారు.
సీఎం రేవంత్ పాలనలో ఎలాంటి నిర్భంధం లేదని, ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ గా నిరసన తెలుపుకునే అవకాశం ఉందన్నారు. శాంతి భద్ర తలకు భంగం వాటిల్లి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. బిఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుతో తండ్రి కొడుకు లు తప్ప ఎవరు ఆపార్టీలో మిగిలే పరిస్థితి లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కౌశి క్ రెడ్డి వాడిన భాష సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని, చట్టం ఎవరికి చుట్టం కాదని టీపీసీ సీ చీఫ్ వెల్లడించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కిషన్ రెడ్డి కిస్మ త్ రెడ్డి లా మారిపోయారని మహే ష్ గౌడ్ పేర్కొన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిన మేలు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశా రు. మూసి గురించి మాట్లాడే బీ జేపీ నేతలు సభర్మతి గురించి ఎం దుకు మాట్లాడటం లేదని అక్కడ పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. పేదలకు గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని మహేష్ గౌడ్ స్పష్టం చేశా రు.