–టీజీపీఎస్సీ చైర్మన్ ఎం. మహేం దర్ రెడ్డిని కలిసిన ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ
Manda Krishna Madiga: ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్ లోని నాంపల్లిలో గల తె లంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయo లో టిజిపిఎస్ సి చైర్మన్ ఎం మహేందర్ రెడ్డి (Mahender Reddy) ఎమ్మా ర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ (Manda Krishna Madiga) నేతృత్వంలో ప్రతినిధి బృందం కలిసింది.ఆగష్టు 1 వ తేదీన ఎస్సీ వర్గీకరణకు సాను కూలంగా సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చి న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం లో భర్తీ చేయబోయే ఉద్యోగ ని యామకాలన్ని ఎస్సీ వర్గీకరణ ప్రకారమే చేపట్టాలని, ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ లకు ,అలాగే ఇవ్వబోయే నోటిఫికేషన్ లకు అన్ని టికీ ఎస్సీ వర్గీకరణను వర్తింపజే యాలని మంద కృష్ణ మాదిగ మ హేందర్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం భర్తీ కాబోతున్న ఉద్యోగ నియామకాల మీద మాదిగ విద్యార్థులు ,నిరుద్యోగులు(Students, unemployed) ఎంతో ఆశ పెట్టుకొని వేచి చూస్తున్నారని , వారికి తగిన న్యాయం జరగాలంటే ఎస్సీ వర్గీకరణ ప్రకారమే నియా మకాలు ఉండాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన వెనువెంటనే తెలం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉం టుందని , ఇప్పటి ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణను వర్తింప చేస్తామని అసెంబ్లీలో ప్రక టించిన విషయాన్ని మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఎస్సీ వర్గీకరణ అమలులో లేకపోవడం వల్ల తెలంగాణ రా ష్ట్రంలో గత పది ఏళ్లలో జరిగిన ప్రతి ఉద్యోగ నియామకాలలో మాదిగ బిడ్డలకు అన్యాయం జరిగిందని తెలిపారు. సుప్రీం కోర్టు తీర్పు తరువాత కూడా ఎస్సీ వర్గీకరణ (Classification of SC)అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ అయితే మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని , ఆ అన్యాయం జరగకుండా టీజీపీఎస్సీ చూడాలని విజ్ఞప్తి చేశారు.గతంలో ఎస్సీ వర్గీ కరణ అమలు అవుతున్న క్రమంలో జరిగిన ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కొన్ని విషయాలను మహేందర్ రెడ్డి దృష్టికి మంద కృష్ణ మాదిగ తీసుకెళ్ళారు.
ఈ విషయా లను పరిగణలోకి తీసుకుని మాది గలకు న్యాయం జరిగేలా తగిన నిర్ణయాలు ద్వారా ఉద్యోగ నియా మకాలు జరిగేలా చూడాలని మం ద కృష్ణ మాదిగ మహేందర్ రెడ్డి (Mahender Reddy)విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ జాతీయ అధ్యక్షులు చిప్పలపల్లి సోమశేఖర్ మాదిగ, ఎంఎస్పి జాతీయ నాయకులు తిప్పరపు లక్ష్మణ్ మాదిగ, ,ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు బుంజూరు విజయ్ మాదిగ ఎంఎస్పి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు టీవీ నరసింహ మాదిగ,ఎమ్మెస్ ఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కొమ్ము శేఖర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామరపు శ్రీనివాస్ మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ జాతీయ కార్యదర్శి పల్లెర్ల సుధాకర్ మాదిగ, ఎమ్మెస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భైరపోగు శివ కుమార్ మాదిగ, MSP రాష్ట్ర నాయకులు మునరతి అరుణ్, హైదారాబాద్ జిల్లా MSP ప్రధాన కార్యదర్శి పూజలొల్ల రవి మాదిగ,MRPS రాష్ట్ర కార్యదర్శి దుపల్లిఅనిల్ మాదిగ, MSF జిల్లా అధ్యక్షులు జంపాల మహేష్ మాదిగ,హైదారాబాద్ జిల్లా నాయకులు శివ మాదిగ, Sk శ్రీనివాస్, లక్ష్మణ్ , నరసింహా తదితరులు పాల్గొన్నారు.