Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Damodara: ఆసుపత్రుల అంతస్తులు కాదు అందుతున్న సేవలు ముఖ్యం

–24 అంత‌స్టుల కంటే నాణ్య‌తా ప్రామాణాల సేవ‌లే ప్రధానం
–నిబంధనల మేరకు 11 అంత‌స్థుల హాస్పిట‌ల్స్ నిర్మాణాల‌కు ప్రాధాన్య‌ త
–డాక్ట‌ర్స్ డే సంద‌ర్బంగా వైద్యుల‌కు మంత్రి దామోద‌ర శుభాకాంక్ష‌లు

Minister Damodara: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో ఆస్పత్రులను 24 అంతస్తులు కట్టడం ముఖ్యం కాదని రోగులకు అందుతున్న సేవలు ఎలా అందు తున్నాయదే ముఖ్యమని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర రాజ‌న‌ర‌సింహ (Minister Damodara) పేర్కొన్నారు. టిమ్స్ హాస్పిటల్స్ (Tim’s Hospitals) నిర్మాణాలు కొనసా గుతాయన్నారు. 13 అంతస్తులు అనేది నిబంధన ఉంది, అందుకు త‌మ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దాని ప్రకారం ముందుకు వెళ్తా మన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉస్మా నియా హాస్టల్ బిల్డింగ్ లేదని 10 రోజుల్లోనే ఉస్మానియా, గాంధీ, కాకతీయ హాస్టల్స్ భవనాలకు శంకుస్థాపన చేస్తామ‌ని చెప్పారు. నేషనల్‌ డాక్టర్స్‌ డే (Doctor’s Day) సందర్భంగా రాష్ట్ర ఆయ‌న వైద్యు ల‌కు ట్విట్ట‌ర్ (twitter)ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రెండేళ్లలో హాస్టల్స్ నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. మౌలి క సదుపాయాలతో పాటు హెచ్‌ఆ ర్ కూడా ముఖ్య మన్నారు. ప్రస్తు తం హెచ్‌ఆర్‌లో ఇన్‌బ్యాలెన్స్ (Imbalance in HR) కొన సాగుతోందన్నారు.

దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రక్షాళన చేస్తామన్నారు.అదనపు సదుపాయాలతో పాటు క్వాలిటీ మెయింటైన్‌ చేయాలని ప్రజలు ఇది నా ఆసుపత్రి (hospital)అని చెప్పుకునే విధం గా తీర్చిదిద్దాలన్నారు. ఫుడ్, క్లినిక ల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అమలు వేగ వంతంగా చేస్తున్నామని మంత్రి తెలిపారు. నిలోఫర్, ఎంఎన్‌జేలకు ఒక ప్రత్యేకత ఉందని, అలాగే మిగ తా వాటికి కూడా ప్రత్యేకత ఉండాల న్నారు. ఇప్పటికే హెచ్ఓడీల ప్రక్షాళ న జరుగుతుందన్నారు. హెచ్‌ఓడీల తో సరిగ్గా పని చేయిస్తామని, సీని యారిటీని పరిగణనలోకి తీసుకుం టామన్నారు. ఉస్మానియాను (Osmania) పరిశీ లించేందుకు సెక్రటరీని పంపామన్నా రు. హెచ్‌ఓడీ పోస్టులు అసలు లేనే లేవన్నారు. వారి స్థానంలో ఇంచా ర్జీలు పని చేస్తున్నారని తెలిపారు. కేంద్రం నిర్వహించే ఏ పరీక్ష అయి నా తాము నిర్వహించుకునే శక్తి ఉందని అన్ని రాష్ట్రాలు అడుగుతు న్నాయని అంటూ ఇది కోర్టులో ఉందన్నారు. నీట్‌ను రద్దు చేయా లా, కేంద్రం నిర్వహించాలా, రాష్ట్రా లకు ఇవ్వాలా అనేదానిపై చర్చ జరగాలన్నారు. కొత్త మెడికల్ కాలేజీల కోసం అప్లై చేశామని, మరిన్ని వస్తాయన్నారు. జూడాల సమ్మె సమయంలో వారి సమస్య లు 80శాతం పరిష్కరించామని మంత్రి తెలిపారు.