–గణేష్ నవరాత్రి ఉత్సవాల ఏర్పా ట్లపై మంత్రులు పొన్నం, దుద్దిళ్ల సమీక్ష
–ఉత్సవాల భారీ నిర్వహణకు ప్రజ లు సహకారం కావాలి
–నిబంధలను పాటించాలని పోలీస్ కమిషనర్ వినతి
Minister Ponnam Prabhakar: ప్రజా దీవెన, హైదరాబాద్: ముంబై తో సమా నంగా గణేష్ ఉత్సవాలు హైదరాబాద్ లో నిర్వహిస్తున్నామ ని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. వినాయకచవితి నేపథ్యంలో గణేష్ ఉత్సవాలు ఏర్పాట్ల పై ఏంసిఆర్ హెచ్ ఆర్ డిలో మంత్రి సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి, (Ministers Ponnam Prabhakar Goud, Duddilla Sridhar Babu, Mayor Gadwala Vijayalakshmi, Deputy Mayor Mothe Srilata Shobhan Reddy, Hyderabad CP Kota Kota Srinivas Reddy) భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ, బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అనంతరం పొన్నం మాట్లాడుతూ ముంబై తో సమానంగా గణేష్ ఉత్సవాలు మనం జరుపుకుంటా మన్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ఏర్పాట్లు చేస్తాయన్నారు. ఇందుకు ప్రజల సహకారం కూడా చాలా అవసరమని తెలిపారు. ఇప్పటికే పోలీస్ కమిషనర్లు అన్ని రకాల సర్వే లు నిర్వహించారన్నా రు. మా ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది మొదటి గణేష్ పండుగ Ganesh festival)అని తెలి పారు. అందరి సహకారంతో ఈ పండుగ ఘనంగా నిర్వహిస్తామ న్నారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లానే ఈ సారి కూడా గణేష్ ఉత్సవ ప్రిపరేషన్ మీటింగ్ ఏర్పాటు చేశా మన్నారు. హైదరాబాద్ ఇన్చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణ లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇక్కడికి వచ్చిన కమిటీ సభ్యులకు ఎన్నో ఏళ్ల అనుభవం ఉందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కి సంభందిచిన ఈ గణేష్ ఉత్సవాలకు (Ganesh Festivals) మీ సలహా లు తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించామన్నారు. పెద్దలు ఇచ్చే సూచనలు తీసుకుని గణేష్ ఉత్స వాలు జరిపించాలని అధికారులను కోరుతున్నామని తెలిపారు.
హైద రాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి (Kota Kota Srinivas Reddy) మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల బం దోబస్తు ముంబై తో సమానంగానే ఉన్నామన్నారు. గత సంవత్సరం కూడా 50 వేలకు పైగానే విగ్రహాలు వెలిశాయన్నారు. గణేష్ ఉత్సవ బందోబస్తు చాలా పెద్దదే అని, , ఇతర వ్యవస్థలతో కో ఆర్డినేట్ చేసుకుని పోలీస్ శాఖ పనిచే స్తుందన్నారు. నిమజ్జనం సమ యంలో అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. క్రేన్ల ఏర్పాటు కూడా డిఫెక్ట్ లేని వాటిని సెలెక్ట్ చేసుకోవాలన్నారు. క్రేన్ కి ఆల్టర్నేట్ డెవర్లను కూడా అందుబాటులో ఉండేలా చూసుకుంటే. ఆలస్యం జరగకుండా నిమజ్జనం జరుగు తుందని సీపీ తెలిపారు.