Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Sitakka: బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క సీరియస్

Minister Sitakka: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ జనం చస్తున్నా పాపం కనికరం లేదా, వరదల్లోనూ బురద రాజ కీయాలేనా, ప్రజలు కష్టాల్లో, కేసీ ఆర్ ఫాం హౌజ్ లో, కేటీఆర్ అమె రికాలో జల్సాలు, కష్టకాలం లో చేయూతనివ్వాల్సింది పోయి కెటి ఆర్, హరీష్ రావులు రాజకీయాలు చేస్తున్నారని క్షేత్రం లో ఉండి ప్రజల కష్టాలను తెలుసు కోలేని, సర్కారు సహాయ చర్యల ను చూడలేని కబోదులు బీఆర్ఎస్ నేత‌లు అని బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క (Minister Sitakka) సీరియస్ అయ్యా రు. గడిచిన 48 గంటల నుండి ప్ర భుత్వం కంటిమీద కునుకు లేకుం డా పనిచేస్తుంది.

సీఎం రేవంత్ రెడ్డి నిన్నటి నుండి అత్యవసర సమీక్ష లు నిర్వహించారు. జిల్లాల్లో మం త్రులతో, కలెక్టర్లతో క్షేత్ర స్థాయి లో అధికారులతో మాట్లాడి అప్రమ త్తం చేసారు. కష్టాల్లో ఉన్న ప్రజల ను ఓదార్చేందుకు 48 గంటలు క్షే త్రంలోనే ఉండి పర్యవేక్షిస్తు న్నారు. వరదల్లో (floods)మరణించిన కుటుంబా లకు దైర్యం కల్పించారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల వరద ప్రాంతాల్లో సీఎం పర్యటన బరోసా నిస్తోంది. రూ.5 లక్షల తక్షణ సహాయం ప్రకటిస్తే బీఆర్ఎస్ నేత లు వరదల్లో బురద రాజకీయం చేస్తున్నారు.ప్రజల కష్టాలు నష్టాలు వాటి విలువలు కెసిఆర్ (kcr) కుటుం బానికి తెలియదు. అధికారంలో ఉన్నప్పుడు వానలు, వరదలపై తక్షణ సమీక్షలు చేసారా, కనీసం బాదితులను ఓదార్చారా, కొండగ ట్టులో 63 మంది బస్సు ప్రమాదం లో చనిపోతే కనీసం సంతాపం లేదని విమర్శించారు. రైతులు చనిపోతే పైసా పరిహారం ఇవ్వ లేదని, నిరుద్యోగ అభ్యర్థులు చని పోతే కనీసం ఓదార్పు లేదని, ఇప్పుడెమో శవరాజకీయా లు వరదల్లోనూ కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావులు (KCR, KTR, Harish Rao)తమ నైజాన్ని బయట పెట్టుకుంటున్నారు.

కెటిఆర్ కేవలం సోషల్ మీడియా (ssocial media)లో పోస్ట్ లు పెట్టి పబ్బం గడుపుతు న్నారు. రోజూ ట్విట్టర్ లో పోస్ట్ లు పెట్టి బరుద చల్లుతున్నారు. కోట లు దాటే మాటలు చేతగాని పను లలో కెసిఆర్, కెటిఆర్ సిద్దహస్తులు బాద్యతారాహిత్యంగా వ్యవహరి స్తున్న బిఆర్ఎస్ కు ప్ర‌జ‌లే బుద్ది చెబుతారు.వరదల్లో మృతి చెందిన వారికి రూ.5లక్షలు ప్రభుత్వం ప్రక టించింది. గతంలో రూ.4 లక్షలకు అదనంగా మరో లక్ష కలిపి ఐదు లక్షలు ఇస్తున్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఇదే వరద బాదితు లకు రూ.25లక్షలు ఎందు కివ్వలేద ని ప్రశ్నించారు. పదేండ్లు అధికారం లో ఉండి పైసా పరిహారం ఇవ్వని నేతలు ఏ మోహం పెట్టుకుని విష ప్రచారం (Poison propaganda)చేస్తున్నారని ధ్వజమెత్తా రు.

హైదరాబాద్ (hyderabad)లో నీట మునిగి న కుటుంబాలకు పది వేలు ఇస్తాన ని బిఆర్ఎస్ లీడర్లే పంచుకుతిన లేదా, తెలంగాణ సొమ్మును పొరు గు రాష్ట్రాలలో పప్పు బెల్లంల్లా పం చిన కెసిఆర్ సర్కారు తెలంగాణ రైతు లకు, వరద బాదితులకు ఎందుకు ఇవ్వలేదు, రాష్ట్రంలో ఇంత విపత్తు సంభవిస్తే ఏ ఒక్క బిఆర్ఎస్ కీల‌క నేత క్షేత్రంలో లేరు. కాని మానవీయ విలువలకు తిలో దకాలిచ్చి శవ రాజకీయాలు చేయ డం వారే దిట్ట.సోషల్ మీడియా రాజకీయాల పైనే బతుకడం మాని ఇప్పటికే క్షేత్ర స్థాయిలో తిరగండి. లేక పోతే తెలంగాణ స‌మాజం మీమ్మ‌ల్ని క్ష‌మించ‌దని వ్యాఖ్యానించారు.