Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

NEET: నీట్ పై గందరగోళం

–పార్లమెంట్ లో నీట్ లొల్లితో లోక్సభ సోమవారానికి వాయిదా

NEET: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ : దేశంలో సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ (NeEt paper leak)వ్యవహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. దీనిపై చర్చ జరపాలన్నా విపక్షాల డిమాండ్ (demand)ను సభాపతులు ఒప్పుకోకపోవడంతో లోక్ సభ, రాజ్యసభలో తీవ్ర గందర గోళ వాతావరణం నెలకొంది. దీంతో ఉభయ సభలూ వాయిదా పడ్డా యి. శుక్రవారం ఉదయం 11 గంట లకు లోక్ సభ ప్రారంభం కాగానే ఇటీవల మృతిచెందిన పలువురు రాజకీయ ప్రముఖులకు సభ సం తాపం ప్రకటించింది. అనంతరం రాష్ట్రపతి (President) ప్రసంగానికి ధన్యవా దాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. దీనిపై స్పీకర్ చర్చను ప్రారంభించగా ప్రతిప క్షాలు నీట్ అం శాన్ని లేవనెత్తాయి.

నీట్ పేపర్ లీక్ (NeEt paper leak) అంశంపై సభలో చర్చ జరపా లని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. ఇందుకు సభాపతి ఓం బిర్లా (Om Birla) ఒప్పుకోకపోవడంతో విపక్షా లు ఆందో ళనకు దిగాయి. దీంతో స్పీకర్ సభను మధ్య సభ తిరిగి సమావేశమైన ఎలాంటి మార్పు లే కపోవడంతో సోమవారానికి వాయి దా పడింది. అటు రాజ్యసభ లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. నీట్ అంశం పై చర్చకు పట్టుబడుతూ విపక్ష సభ్యు లు నినాదాలు చేశారు. ఎంతకీ ఆందోళన విరమించకపో వడంతో ఛైర్మన్ జగ్దీప్ ధన్అడ్ కూడా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా విపక్ష సభ్యు లంతా నీట్ పై చర్చకు పట్టుబ ట్టారు. రాష్ట్రపతికి ప్రసంగానికి దన్యవాదాలు తేలిపే తీర్మానంపై చర్చ మధ్యే సభ్యులు ఆందోళన చేయగా విధి లేని పరిస్థితుల్లో వాయిదా వేయడం అనివార్యమైంది.