–భారత సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ
NV Ramana: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికం గా తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు (GO) విడుదల చేయడం పట్ల భారత సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు. శనివారం ఆయనొ క ప్రకటన విడుదల చేస్తూతెలుగు భాషలో ప్రభుత్వ ఉత్తర్వులు విడు దల చేయడం ప్రజలందరికీ అర్థమ య్యేలా, అవగాహన కలిగేలా ఉం టుంది. ఇది పరిపాలనా ప్రక్రియలో పారదర్శకత పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది.
ప్రజల భాషలో పరిపాలన జరగడం అనేది ప్రజా స్వామ్యంలో మరింత బలమైన చిహ్నం.ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న ముంద డుగు అభినందనీయమైనది. భవి ష్యత్తులో తెలుగులో కూడా అన్ని డిగ్రీలు, సాంకేతిక , వృత్తి విద్య కోర్స్ లు అందుబాటులోకి తేవ డానికి అవసరమైన చర్యలు తీసు కోవాలని నేను ఆశిస్తున్నాను.తమ మాతృభాషలో విద్యను అభ్యసిం చేందుకు అవకాశం కల్పించడం ద్వారా విద్యార్థులలో సృజనా త్మకత, భావ వ్యక్తీకరణ మరింత పెరుగుతాయి.
సమాజ అభివృద్ధి దిశగా ఇది ఒక గొప్ప మార్గదర్శకం అవుతుంది.”తెలుగు భాషాభిమా నులు, విద్యార్థులు మరియు వి ద్యావేత్తలకు ఏపీ ప్రభుత్వ తా జా నిర్ణయం స్ఫూర్తి గా నిలుస్తుం దని ఆశిస్తున్నామన్నారు.