PD Act: బ్లాక్ మార్కెట్ పై పిడి చట్టం ప్రయోగం
రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్ మార్కెట్లకు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కలెక్టర్లను ఆదేశిం చారు.
గతేడాదికన్నా మించి అందుబాటులో విత్తనాలు
కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగా ణ అవతరణోత్సవాలు
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతికుమారి
ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రంలో విత్తనాలను బ్లాక్ మార్కెట్లకు తరలించి, కృత్రిమ కొరతను సృష్టించే వ్యాపారులపై పీడీ చట్టం కేసులను నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి(Shanti Kumari)కలెక్టర్లను ఆదేశిం చారు. రాష్ట్రంలో వానాకాలం పంటలకు విత్తనాల సరఫరా, జూన్ 2వ తేదీన జరిపే రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్ట ర్లతో గురువారం టెలీ కాన్ఫరెన్స్(Teleconference)నిర్వహించారు. ప్రస్తుత వానాకాలం సీజన్ కు సంబంధించి గత సంవ త్సరం కన్నా అధిక మొత్తంలో వివిధ రకాల పంట విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని సీఎస్ శాంతికుమారి తెలిపా రు.
విత్తనాల(Seeds) పంపిణీలో ఏవిధమైన ఆందోళన చెందవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లో అధిక డిమాండ్ ఉన్న పత్తి, సోయా, మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాలు సరిపడా ఉన్నాయని తెలిపారు. వీటితోపాటు జీలుగ విత్తనాలు కూడా కావాల్సినంతగా అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులచే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విత్తన వ్యాపారులు గోదాములు, దుకా ణాలను తనిఖీ చేయించాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. గోదాములు, విత్తన విక్రయ కేంద్రాల వద్ద పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను అక్కడే నియమిం చాలని సూచించారు. జూన్ మాసాంతం వరకు విత్తన విక్రయా లు కొనసాగే అవకాశం ఉన్నందున, జిల్లా కలెక్టర్లు ప్రతి రోజూ విత్తన పంపిణీలపై సమీక్షించడంతోపాటు విధిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిం చి స్టాక్ రిజిస్టర్లు, పంపిణీ విధా నాన్ని పరిశీలించాలని ఆదేశిం చారు.
రైతులతో(Farmers) సమావేశమై, సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారిలో విశ్వాసం కల్పించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి రైతులు వచ్చి ఇక్కడి విత్తనాలు కొనుగోలు చేయకుండా నివారించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. విత్తనాల లభ్యత సమాచారాన్ని రైతులకు ఎప్పటికప్పుడు తెలియ చేయాలన్నారు. తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన రాష్ట్ర సాధన కోసం అమరులైన వారికి నివా ళులు అర్పించిన అనంతరం జాతీ య పతాకావిష్కరణ చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల్లో నిర్వహించే ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు, ఇతర ప్రముఖులు, జిల్లా అధికా రులను ఆహ్వానించాలని సూచిం చారు. రాష్ట్ర స్థాయిలో పరేడ్ గ్రౌండ్స్ లో(Parade Grounds) జరిగే కార్యక్రమానికి తెలంగాణ ఉద్యమంలో అమర వీరులైన వారి కుటుంబ సభ్యులకు, ఉద్యమకారులకు జిల్లా కలెక్టర్ల ద్వారా ఆహ్వానం పంపుతున్నట్లు తెలియజేశారు.
PD act punsishment on black market