Phone tapping: ఫోన్ ట్యాపింగ్ సీబీఐకి అప్పగించాల్సిందే
దేశంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు.
సీఎం రేవంత్కు ఏమాత్రం చిత్తశు ద్ధి ఉన్నా కేసీఆర్పై చర్యలు తీసుకోవాల్సిందే
పోలీసు అధికారుల వాంగ్మూలం లో వెలుగుచూసిన వాస్తవాలపై చర్యలేవి
ఇందిరా పార్కు వద్ద బీజేపీ ధర్నా లో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్
ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్(Phone tapping)కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆరోపించారు. మాజీ సీఎం కేసిఆర్ వల్లే తాను జైలుకు వెళ్లాల్సి వచ్చిందని పదే పదే చెప్పిన సీఎం రేవంత్కు(CM Revanth) ఏ మాత్రం చిత్తశుద్ధి ఉ న్నా ట్యాపింగ్ కేసును వెంటనే సీబీ ఐ(CBI)కి అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఇందిరాపార్కు వద్ద బీజేపీ శుక్రవారం నిర్వహించిన ధర్నాలో లక్ష్మణ్ మాట్లాడారు.ఈ కేసులో కేసీఆర్, హరీశ్ రావుల పాత్రను జైల్లో ఉన్న పోలీసు అధికారులు తమ వాంగ్మూలంలో బట్టబయలు చేసినా ఎందుకు చర్య లు తీసుకో వడం లేదని ప్రశ్నించారు.మీ అధినా యకత్వం నుంచి ఒత్తిడి ఉందా, లేక మీ నాయకత్వం కేసీఆర్తో లోపాయికారీ ఒప్పందం చేసుకుం దా అని నిలదీశారు.
కేసీఆర్(KCR)పై చర్య తీసుకోకపోవడానికి కారణ మేమిటని ప్రజలకు రేవంత్ సమా ధానం చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని, దానిని కక్కిస్తామని ఎన్నికల ముం దు చెప్పిన రేవంత్ ఇప్పుడు ఎందు కు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరి స్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్తో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత దిగజారుడు రాజకీయాలకు పాల్పడిందో జైల్లో ఉన్న పోలీసు అధికారుల నేరాంగీకార పత్రాలను పరిశీలిస్తే అర్థమవుతోందని లక్ష్మణ్ అన్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వే శ్వర్రెడ్డి(Konda Visveswar Reddy) మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్తో వ్యాపారులను పీల్చి పిప్పి చేసి హింసించి డబ్బులు వసూలు చేశారని అన్నారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లా డుతూ ఫోన్ ట్యాపింగ్ సూత్రధా రులపై కఠిన చర్యలు తీసుకోవాల ని, బీఎల్ సంతోష్పై పెట్టిన కేసుల ను పరిశీలించాలని డిమాండ్ చేశారు.
Phone tapping handed over to CBI