Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Phone tapping hard disk: మూసారంబాగ్ మూసిలో ముంచేశా

దేశంలోనే పెను సంచలనం సృష్టిం చిన ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం రోజురోజుకు రంజుమీదకొస్తుంది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తాజాగా ప్రణీతరావు వాంగ్మూ లంలో సంచలన విషయాలు వెల్లడించారు.

ఫోన్ ట్యాపింగ్ హార్డ్ డిస్క్‌లను మూసిలో వేశాo
1200 మంది అధికార, అనధికార ఫోన్ లను ట్యాప్ చేశాం
జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతి పక్ష నేతలు, మీడియా తదితరులు
సెల్‌‌ఫోన్లు, పెన్‌డ్రైవ్‌లను బేగం పేట నాలాలో పడేశాం
ప్రభాకర్ రావు సాయంతో ట్యాపింగ్ చేశాం
ట్యాపింగ్ లో రెండు లాగర్ రూమ్ లలో పని చేసిన 56మంది సిబ్బంది

ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలోనే పెను సంచలనం సృష్టిం చిన ఫోన్ ట్యాపింగ్‌(Phone tapping) వ్యవహారం రోజురోజుకు రంజుమీదకొస్తుంది. ఫోన్ టాపింగ్ వ్యవహారంలో తాజాగా ప్రణీతరావు వాంగ్మూ లంలో సంచలన విషయాలు వెల్లడించారు.1200 మంది ఫోన్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు పేర్కొ న్నారు. జడ్జిలు, రాజకీయ నేతలు, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులు, మీడియా పెద్దలు, జర్నలిస్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యాపా రవేత్తలు, ప్రతిపక్షాలకు ఆర్థిక సహాయం చేస్తున్న వారి ఫోన్లను ట్యాప్ చేసినట్టు వెల్లడించారు. 8 ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు సిబ్బందితో టచ్‌లో ఉన్నట్టు ప్రణీత రావు తెలిపారు.

అధికారికంగా మూడు ఫోన్లు కేటాయించిగా అనధికా రికంగా ఐదు ఫోన్లతో ఎప్పటిక ప్పుడు మానిటరింగ్(Monitoring)చేసినట్టు వెల్లడించారు. ప్రతిపక్షా లకు ఆర్థిక సహాయం చేస్తున్న వాళ్ళ డబ్బులు ఎప్పటికప్పుడు పట్టుకున్నా మన్నారు. పట్టుకున్న డబ్బు మొత్తాన్ని కూడా ఎవరికీ అనుమా నం రాకుండా హవాలా నగదు అంటూ రికార్డుల్లో చూపిం చామని ప్రణీత్ రావు(Praneet Rao)తెలిపారు. ఫోన్ టాపింగ్‌ల కోసం కన్వర్జెన్సీ ఇన్నోవేషన్ ల్యాబ్ సహాయం తీసు కున్నామన్నారు. ఈ ల్యాబ్‌కు సంబంధించిన శ్రీనివాస్, అనంతలో సహాయంతో ట్యాపింగ్‌ని విస్తృతం చేశామన్నారు. ప్రభాకర్ రావు సహా యంతో 17 సిస్టంల ద్వారా ట్యాపిం గ్‌కు పాల్పడినట్టు వెల్లడించారు.

రెండు లాగర్ రూమ్ లో 56 మంది సిబ్బందిని ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశామన్నారు. ఎన్నికలు(Elections) ముగిసిన మరుసటి రోజు నుంచి ట్యాపింగ్‌ని ఆఫ్ చేశామని ప్రణీత్ రావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ట్యాపింగ్ మొత్తాన్ని ఆపివేయాలని ప్రభాకర్ రావు చెప్పారని ప్రణీత్ రావు వెల్లడించారు. ప్రభాకర్ రావు రాజీనామా చేసి వెళ్ళిపోతూ టైపిం గ్ సంబంధించిన సమాచారం ధ్వం సం చేయాలని ఆదేశించారని తెలి పారు. ప్రభాకర్ రావు ఆదేశాలతో 50 కొత్త హార్డ్ డిస్క్‌లను తీసుకువ చ్చామన్నారు. పాత వాటిలో కొత్త హార్డ్ డిస్క్‌లు ఫిక్స్ చేశామన్నారు. 17 హార్డ్ డిస్క్‌లలో అత్యంత కీలకమైన సమాచారం ఉందన్నా రు.

17 హార్డ్ డిస్క్(Hard disk) లను కట్టర్‌తో కట్ చేసి ధ్వంసం చేశామన్నారు. పెద్ద ఎత్తున ఉన్న సీడీఆర్‌తో ఐడీపీఆర్ డాటా మొత్తాన్ని కూడా కాల్చివేసినట్టు ప్రణీత్ రావు వెల్ల డించారు. పెన్ డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్స్, ఇతర ఎల క్ట్రానిక్ వస్తువుల్లో ఉన్న డాటా మొత్తాన్ని ఫార్మాట్ చేశామన్నారు. ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్‌ల న్నింటి నీ కూడా నాగోల్ మూసారంబాగ్ మూసిలో పడవేసినట్టు తెలిపారు. ఫార్మాట్ చేసిన సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్లు అన్నిటిని కూడా బేగంపేట నాలాలో పడేసినట్టు ప్రణీత్ రావు తెలిపారు.

Phone tapping hard disk felt into musi river