Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Justice Pinaki Chandraghosh: అవసరమైతే అందరినీ విచారిస్తాం

కాళేశ్వరం బ్యారేజీల్లో తలెత్తిన సమస్యలపై జరుగుతున్న విచారణలో భాగంగా అవసరం మేరకు అందరినీ విచారణకు పిలుస్తామని కాళేశ్వరం విచారణ కమీషన్ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌ పేర్కొన్నారు.

కాళేశ్వరంపై నిఘా సంస్థల నివేదికలను పరిశీలిస్తాం
కాళేశ్వరం విచారణ కమీషన్ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌
ప్రజా దీవెన, హైదరాబాద్: కాళేశ్వరం బ్యారేజీల్లో(Kaleshwaram Barrage) తలెత్తిన సమస్యలపై జరుగుతున్న విచారణలో భాగంగా అవసరం మేరకు అందరినీ విచారణకు పిలుస్తామని కాళేశ్వరం విచారణ కమీషన్ జస్టిస్‌ పినాకి చంద్రఘోష్‌(Justice Pinaki Chandraghosh )పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారిలో ఎవరిని ప్రశ్నించాల్సి వచ్చినా పిలుస్తామని స్పష్టం చేశారు. అవసరమైతే కేసిఆర్(KCR) ను సైతం విచారణకు పిలుస్తారా అని విలేకరులు ప్రశ్నించగా అవసరమై తే తప్పకుండా అని జస్టిస్‌ చంద్ర ఘోష్‌ వ్యాఖ్యానించారు.

కాళేశ్వ రం బ్యారేజీల వైఫల్యాలపై విచార ణ కోసం జస్టిస్‌ చంద్రఘోష్‌ను కమి షన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీగా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. దీంతో ఇటీవల హైదరాబాద్‌కు విచ్చేసిన ఆయన విచారణ అనంత రం గురువారం విలేకర్లతో మాట్లా డారు. త్వరలోనే బ్యారేజీలను సందర్శిస్తానని, కాళేశ్వరం ప్రాజెక్టు పై విచారణ జరిపిన కాగ్‌, ఎన్‌డీ ఎస్‌ఏ నుంచి పూర్తిస్థాయి నివేది కలు తెప్పించుకుంటామని చెప్పా రు. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెం ట్‌ ఇప్పటికే మధ్యంతర నివేదిక ఇచ్చిందని, వీటన్నింటినీ పరిశీలి స్తామని తెలిపారు.

విచారణ లో భాగంగా ఐఐటీ నిపుణుల సహకా రం కూడా తీసుకుంటామని వెల్లడిం చారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత త్వరగా నివేదికను సమర్పిస్తామ న్నారు. బ్యారేజీల వైఫల్యాలకు గల కారణాలపై ఎన్‌డీఎస్‌ఏకు(NDS) లేఖ రాస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నిర్మాణ, నాణ్యత, నిర్వహణపరమైన లోపాలకు సంబంధించి సమాచారం అందించాల్సింగా ప్రజలను జస్టిస్‌ చంద్రఘోష్‌ కోరారు.

లోపాలను వెలికితీయడం, బాధ్యులను గుర్తించటం, నిధుల దుర్వినియోగం తదితర అంశాలకు సంబంధించి ఎవరి వద్ద తగిన సమాచారం ఉన్నా తమకు అందించాలని పేర్కొన్నారు. ఈ మేరకు విచారణ కమిషన్‌ తరఫున నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా గురువారం ఒక ప్రకటన వెలువరించారు. ఫిర్యాదులు, నివేదికలు, సాక్ష్యాధారాలను నోటరీ ద్వారా అఫిడవిట్ల రూపంలో సమ ర్పించాలని తెలిపారు.

సీల్డ్‌ కవర్‌లో వివరాలు భద్రపరిచి, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంట లలోపు కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ, 8వ అంతస్తు, బూర్గుల రామకృష్ణా రావు భవన్‌, డీ బ్లాక్‌, హైదరాబాద్‌(Hyderabad) చిరునామాలో ఉన్న బాక్సుల్లో మే31వ తేదీలోపు వేయాలని సూచించారు.తగిన సాక్ష్యాధారాలు లేని, నోటరీల సంతకం లేని పత్రాలు తిరస్కరిస్తామని జస్టిస్‌ చంద్రఘోష్‌ స్పష్టం చేశారు. అనంతరం బ్యారే జీల నిర్మాణంతో సంబంధం ఉన్న వారికి నోటీసులు,సమన్లు జారీ చేయనున్నారు.

Justice Pinaki Chandraghose inquiry on Kaleshwaram