Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponguleti Srinivas Reddy: భారీ వర్షాలతో తెలంగాణకు తీవ్ర నష్టం

–కూలిపోయిన, దెబ్బతిన్న వారికి ఇందిరమ్మ ఇండ్లు
–ప్రతి కుటుంబానికి రూ.16,500 ఆర్థిక సహాయం
–మృతుల కుటుంబానికి ఇందిర మ్మ ఇల్లుతో పాటు రూ. 5 లక్షల సహాయం
–వరద ముప్పుకు గురైన ప్రతి ఎక రానికి రూ. 10 వేల ఆర్థిక సహా యం
–తడిచిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం
–యుద్ధప్రతిపాదికన తాత్కాలికం గా రహదారుల మరమత్తులు
–డాక్యుమెంట్స్ కొట్టుకుపోయా యని ఆందోళన చెందొద్దు
–ప్రతి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు ల కోసం ప్రత్యేక కౌంటర్
–భారీ వర్షాలు, వరదలపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం
–చివరి బాధితుని వరకు సహాయం అందిస్తాం
–రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన, హైదరాబాదు: తెలంగాణ వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసం బంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)సోమవారం సచివాల యంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి సలహా దారులు వేం నరేందర్ రెడ్డి, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాం తి కుమారి, విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్, వ్యవ సాయ, పంచాయితీరాజ్, విద్యుత్, విద్యా, రోడ్లు, హౌసింగ్, ఇరిగేషన్ అధికారులు ఈ సమీక్షలో పాల్గొ న్నారు. ఆయా శాఖలకు సంబంధిం చి ఎంత నష్టం జరిగింది, ఎన్ని ని ధులు కావల్సిన అంశాలపై పక డ్బంధిగా అంచనా వేయాలని సూచించారు. కేంద్రానికి (central) పంప వలసిన నివేదికలలో పొందుపర చవలసిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తయారు చేయాలని అధికారులకు సూచించారు. అలా గే వరద ప్రాంతాలలో ఎనుమరేషన్ కూడా పక్కాగా జరగాలని సూచిం చారు. ఆయా శాఖల పరంగా జరి గిన నష్టాన్ని ఈ సందర్భంగా అధి కారులు మంత్రి వివరించారు. వర ద ప్రభావిత ప్రాంతాలలో యుద్ధ ప్రతిపాదికన బాధితులకు సహా యమందించాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బాధితులకు ఈ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చివరి బాధితుని వరకు సహాయం అందిస్తామని ప్రకటించారు.

మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, ఇందిరమ్మ ఇల్లు..
భారీ వర్షాలు, (rains) వరదలకు రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని 33 జిల్లాలను వర్షాప్రభావిత జిల్లాలుగా ప్రకటించామని తెలిపారు. భారీ వర్షాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప టివరకు 33 మంది మృతి చెందా రని ఇందులో ప్రధానంగా ఖమ్మం లో 6 మంది, కొత్తగూడెంలో 5 మం ది, ములుగులో 4 మంది, కామారె డ్డిలో ముగ్గురు, వనపర్తిలో ముగ్గు రు చనిపోయారని అధికారులు మంత్రి వివరించారు.మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రా న్ని కూడా అందచేయాలని అధికా రులను మంత్రి ఆదేశించారు.

ఇండ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇండ్లు:
ఇటీవల కురిసిన వర్షాలు, (rains) వరదల వల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఇండ్లు పూర్తిగా పాక్షికంగా కూలిపోయా యి. వీటిని వెంటనే గుర్తించి బాధి తులకు రూ. 5 లక్షల రూపా యల తో ఉచితంగా ఇందిరమ్మ (indiramma house) ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని కలెక్టర్లను ఆదే శించారు. ఇందుకు సంబంధించి ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సూచించారు.

ప్రతి కుటుంబానికి రూ.16,500:
వర్షాలలో దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.16,500 చొప్పున సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఎలాంటి అవినీతి, అక్రమాలకు ఆస్కారం లేకుండా వరద సహా యం పూర్తిగా ఆన్లైన్ ద్వారానే బాధితుల అక్కౌంట్లోకి జమ చేస్తున్నామని వెల్లడించారు. వరద సమయంలో ముఖ్యమంత్రి వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించి నప్పుడు కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారని, అయితే జరిగిన నష్టాన్ని చూసి మానవతా ధృక్ప థంతో రూ.16,500 కి పెంచినట్టు వెల్లడించారు. ఈ సహాయాన్ని ఈ రోజు నుంచే బాధితులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సహాయం:
రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాల ప్రకారం లక్ష లాది ఎకరాల పంట నష్టం వాటి ల్లినట్లు అధికారులు మంత్రి తెలి పారు. వరద ముప్పుకు గురైన ప్రతి ఎకరానికి రూ.పదివేల ఆర్థిక సహా యం అందిస్తున్నట్లు తెలిపారు.

దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 358 గ్రామాలు వరద ముప్పుకు గురి కాగా, దాదాపు 2 లక్షల మంది ప్రభావితం అయినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం 158 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందస్తు చర్యల వల్ల 2,454 మందిని రక్షించామని తెలిపారు. 13,494 మందిని సురక్షిత ప్రాంతా లకు తరలించామని తెలిపారు.భారీ వర్షాలు, వరదలతో ఆర్&బి, పంచాయితీరాజ్ విభాగాలకు సంబంధించి వేలాది కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, గ్రామీణ మారుమూల ప్రాంతాలలో ఇప్పటికే తాత్కాలిక మరమత్తులు చేపట్టి కొన్ని రోడ్లను పునరుద్ధరిం చామని శాశ్వత ప్రతిపాదికన మర మత్తులు చేపట్టడానికి అవసర మైన కార్యాచరణ ప్రణాళికలను రెండు మూడు రోజుల్లో తయారు చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశిం చారు. అలాగే మేజర్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధిం చిన మరమత్తులను శాశ్వత ప్రతి పాదికన చేపట్టాలని సూచించారు. తాత్కాలిక మరమత్తులతో ఆశిం చిన ప్రయోజనం ఉండకపోవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. అంగ న్వాడీ, ప్రభుత్వ ఆసుపత్రులు, పాటశాలలు, ప్రాథమిక హెల్త్ సెంటర్లు పూర్తిగా, పాక్షికంగా దెబ్బతిన్న వివరాలను 24 గంటల్లో సచివాలయంలోని ఆయా విభా గాలకు పంపించాలని కలెక్టర్లను ఆదేశించారు.భారీ వర్షాలు, వరద లకు చాలా ఇండ్లల్లోకి నీరు చేరి ఇంటి యజమాని భూ పత్రాలు, ఆస్తి పత్రాలు, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, రేషన్ కార్డులతో పాటు విలువైన పత్రాలు తడిచి పోయాయి, కొట్టుకుపో యాయి. ఈ బాధితులందరూ స్థానికంగా ఉన్న పోలీసు స్టేషన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఆ డూప్లి కేట్ పత్రాలను అందిస్తారని ఈ విషయంలో బాధితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.తడిసిన ధాన్యాన్ని పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రతి గింజ ను కనీస మద్ధతు ధరకు కొనుగోలు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఆ నష్టాన్ని వారినుండే వసూలు చేయాలి:
మైన్స్ కు సంబంధించి వ్యర్థాలను ప్రభుత్వ భూముల్లో (lands) పోయడం వల్లనే సూర్యపేట, పాలేరుకు భారీగా నష్టం జరిగింది. ఆ వ్యర్థాలతో వరద నీరు పోవడానికి వీలు లేకుండా పోయింది. జరిగిన నష్టాన్ని ఆ ఏజెన్సీల నుంచే వసూ లు చేయాలని మైనింగ్ అధికారు లను ఆదేశించారు. రెండు ఏజె న్సీలు 18 లక్షల క్యూబిక్ మీటర్ల వ్యర్థాలను పోశారని అధికారులు వివరించారు.