–దేశానికి ఆదర్శంగా ఉండేలా కొత్త రెవెన్యూ చట్టం
–రెవెన్యూను కంటికి రెప్పలా కాపా డుకుంటాం
–కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదా చర్చాగోష్టిలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: గత బీఆ ర్ఎస్ ప్రభుత్వంలో ఒక పెద్దమనిషి ఒక ఉన్నతాధికారి కలిసి కుట్రపూరి తంగా రాత్రికి రాత్రి తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజ లు అనుభవిస్తున్న కష్టాలకు, బాధ లకు త్వరలోనే చరమగీతం పాడ బోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) స్పష్టం చేశారు. రైతులకు ఏ భూమి చిక్కులు కూడా లేకుండా చేసే ఆదర్శవంతమైన నూతన రెవెన్యూ చట్టం – 2024ను తీసుకువస్తున్నా మని ప్రకటించారు. ఇందిరమ్మ రాజ్యంలో (Kingdom of Indiramma) రైతు సుభిక్షంగా ఉండా లన్నదే మా ప్రభుత్వం లక్ష్యమన్నా రు. నూతన రెవెన్యూ చట్టం ముసా యిదాపై సోమవారం నాడు టూరి జం ప్లాజాలో తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేష న్ (ట్రెసా) ఏర్పాటు చేసిన చర్చావే దిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. చట్టాలు సరిగ్గా చేయకపోతే, వాటి ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వం తీసుకువచ్చిన 2020 రెవెన్యూ చట్టమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. గతంలో మాదిరిగా జర గకుండా ఉండడానికి ఒక రోజు ఆల స్యం అయినా కూడా ఉన్న సమ స్యలను పరిష్కరించడంతో పాటు భవిష్యత్తు తరాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా చట్టాన్ని రూపొందిస్తున్నాం.
సామాన్యుని నుంచి మేధావి వరకు అన్నీ వర్గాల అభిప్రాయాలను తీస్కోవడానికి ముసాయిదా చట్టాన్ని పబ్లిక్ డొమైన్ (Public domain)లో పెట్టడంతో పాటు ఇటువంటి చర్చావేదికలను కూడా ఏర్పాటు చేస్తున్నాం. మార్పు కావాలని తెలంగాణ ప్రజానీకం కోరుకున్నారో ఆ మార్పుకు ధరణి నాంది పలికింది. మనం భౌతికంగా ఉన్నా లేకున్నా అధికారంలో ఉన్నా లేకున్నా మనం తీసుకొచ్చిన చట్టాలు పదిమందికి ఉపయోగపడేలా శాశ్వతంగా ఉండేలా రూపొందించాలి. ఆ దిశగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎలాంటి ప్రత్యామ్నాయం ఆలోచన చేయకుండా దొరగారికి నచ్చలేదనే ఉద్ధేశ్యంతో గత ప్రభు త్వం వీఆర్ఓ, వీఏఓ వ్యవస్థను ఉన్నపళంగా రద్దు చేసి మొత్తంగా గ్రామ స్థాయిలో రెవెన్యూ భూ పరిపాలన చూసే యంత్రాంగం లేకుండా చేసింది. రైతులకు, ప్రజలకు రెవెన్యూ (Revenue for farmers and people)అందుబాటులో లేకుండా పోయాయి. అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ ను బంగాళా ఖాతంలో కలుపుతామని ఆనాడు పీసీసీ అధ్యక్షుని హోదాలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. మేము ఇచ్చి న హామీని విశ్వసించి తెలంగాణ ప్రజానీకం మాకు అధికారం అప్ప గించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా కొత్త రెవె న్యూ చట్టాన్ని తీసుకువచ్చి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం.
సమాజ ప్రగతిని నిర్దేశించే ప్రధాన అంశాలలో అన్నీ వర్గాల ఆలోచన లను అభిప్రాయాలను పెద్దల సల హాలను సూచనలను పరిగణ నలోకి తీసుకోకపోతే ఎటువంటి సంస్కరణ అయినా శూన్యగతికే చేరుకుంటుందన్నదానికి నిలువెత్తు నిదర్శనం ధరణి.రెవెన్యూ వ్యవస్థ ను కంటికి రెప్పలా కాపాడే విష యంలో మాకు స్పష్టత ఉంది. రెవె న్యూ గ్రామాల్లో (revenue villages) రెవెన్యూ వ్యవస్థను తీసుకువస్తామని అలాగే రెవెన్యూ కోర్టులను కూడా ఏర్పాటు చేస్తాం. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తాం. అలాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో సానుకూలంగా వ్యహరిస్తాము. త్వరలోనే రెవెన్యూ ఉద్యోగ సం ఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్న ముఖ్యమంత్రి గారు, రెవెన్యూ మంత్రి ఇద్దరే పని చేస్తే సాధ్యం కాదు, రెవెన్యూ ఉద్యో గులందరూ సమిష్టిగా నిబద్ధతతో జవాబుదారీతనంతో పనిచేస్తేనే సాధ్యమవుతుందని అన్నారు.