Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponguleti Srinivas Reddy: బడ్జెట్లో ఇందిరమ్మ ఇండ్లకు పెద్దపీట

–అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు
–రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: పేదవాడికి ఆకలి తీర్చడం ఎంత ముఖ్యమో తలదాచుకోవడానికి నీడ అంతకన్నా ముఖ్యమని రెవెన్యూ. హౌసింగ్. సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy)అన్నారు. సోమవారం నాడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) సచివాలయంలో హౌసింగ్ పై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల పథకానికి (Indiramma Indla Scheme)అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని. అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ పథకాని భద్రాచలం రాములవారి సన్నిధిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారని అయితే ఆ తర్వాత వారం రోజులకే పార్లమెంట్ ఎన్నికల ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఆలస్యం జరిగిందని,అయితే ఇప్పుడు ఈ పథక అమలుకు అవసరమైన కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు.ఈ ఏడాది పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతు న్నామని ఇందుకు అనుగుణంగా వచ్చే బడ్జెట్లో నిధుల కేటాయిం పులు కూడా జరుపుతున్నామని వెల్లడించారు.

వచ్చే ఐదు సంవ త్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను (indiramma houses) నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, మొదటి దశలో ఈ ఏడాది నియో జకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున 4, 16,500 ఇండ్లు, రిజర్వ్ కోట కింద 33,500 ఇండ్లు నిర్మించాలని నిర్ణయించామని ఇందుకు అవస రమైన 22,500 కోట్ల రూపా యలను బడ్జెట్లో కేటాయించాలని సోమవారం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క దగ్గర జరిగిన సమావే శంలో విజ్ఞప్తి చేయడం జరిగిందని మంత్రి (Ponguleti Srinivas Reddy)వెల్లడించారు. గడచిన పది సంవత్సరాలలో సొంత ఇంటి సాకా రం అనేది పేదవారికి అందని ద్రాక్షలా మారిందని ఆవేదం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో నిర్మించి న ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికి కనిపిస్తున్నాయని అన్నారు. పేదలు ఆత్మగౌరంతో బతకాలన్న ఆలోచనతో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి శ్రీకారం చుట్టామని, రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి పనిచేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పనిచేయాలి అన్నారు.గడిచిన 10 సంవత్స రాలలో బిఆర్ఎస్ (brs) ప్రభుత్వం లో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు, ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు,b ఎన్ని నిర్మాణ దశలో ఉన్నాయి జిహెచ్ ఎంసి పరిధిలో ఎన్ని ఇండ్లు నిర్మించి, లబ్ధిదారులకు ఎన్ని ఇచ్చారు వంటి వివరాలతో పూర్తిస్థాయి సమాచారంతో రావాలని అధికారం ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ శాఖ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాష్ ఇతర అధికారులు పాల్గొన్నారు.