–ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి తో పాటు పది అంశాల్లో చర్యలు
–సమగ్ర సమాచారం, పూర్తి ఆధా రాలతో రంగం సిద్ధం
–పెద్ద తలకాయలకు శిక్ష తప్పదు, తప్పు చేసింది ఎవరైనా విడిచిపె ట్టం
–దక్షిణ కొరియా పర్యటనలో రెవె న్యూ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు
Ponguleti Srinivas Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో ఒకట్రెండు రోజుల్లో రాజకీయ ప్రకంపనలు జరుగబోతున్నాయని, ప్రధాన నేతలు, పెద్ద తలకాయలకు పెద్ద షాక్ ఇవ్వబోతున్నట్లు రెవె న్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక వాఖ్యలు చేశారు. చెప్పారు. ఫోన్ ట్యాపిం గ్, కాళే శ్వరం, ధరణి వంటి సుమా రు 8 నుంచి 10 ప్రధాన అంశాల్లో చర్య లుఉంటాయన్నారు. ఇందుకు సం బంధించి అన్ని సాక్ష్యాధారాల తో ఫైళ్లు కూడా సిద్ధం చేశామని తెలి పారు. సియోల్ నుంచి హైదరా బా ద్ చేరేలోపే ఈ చర్యలు ప్రారం భమవుతాయన్నారు.
ఇది కక్ష్యసా ధింపు కాదని, పూర్తి ఆధారాలతో సర్కారు చర్యలు తీసుకోబోతోంద ని స్పష్టం చేశారు. తప్పు చేసింది ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని రాష్ట్రంలో దీపావళికి ముం దే రెవె న్యూ మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) రాజకీయ బాంబు పేల్చారు. దక్షిణకొరియా రాజధాని సి యో ల్లో హాన్ నది పునరుజ్జీ వనంపై అధ్యయనానికి వెళ్లిన పొంగులేటి అక్కడ ఓ తెలుగు చానల్కు ఇచ్చి న ఇంటర్వ్యూలో సంచలన వ్యా ఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజె క్టుకు సంబంధించి విచారణ దాదా పు పూర్తయిందని, మొత్తానికి ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ధరణి అంశా లు ట్రాక్లో ఉన్నాయని చెప్పారు.
ప్రభుత్వం ఏర్పడ్డాక ఎలాంటి చర్య లు లేవని ప్రజలు భావించవద్దని, వారు కోరుకునే విధంగా పూర్తి ఆధారాలతో ముందుకు రాబోతు న్నామని వెల్లడించారు. భూహ క్కులపై సామాన్య రైతుల (farmers) నుంచి భూస్వాముల వరకు ఎవరికి అపో హలకు తావు లేకుండా అన్ని సమ స్యలకు చెక్పెట్టేలా కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని తెస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. విలేకరులతో ఆయ న మాట్లాడుతూ కొత్త ఆర్వోఆర్ చట్టం ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. అభద్రతలో ఉన్న లక్షలాది మంది రైతులకు ఇందిర మ్మ ప్రభుత్వం భరోసా కల్పించబో తోందని స్పష్టం చేశారు.
15 దేశాల్లో అమల్లో ఉన్న ఉత్తమ రెవెన్యూ విధానాలను అధ్యయనం చేసి కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని రూపొందించా మన్నారు. అంతేకాకుండా ముసా యిదాపై సామాన్య రైతులు, మేధా వుల నుంచి అభిప్రాయాలు సేక రించి వారి సూచనలు, సలహాలను క్రోడీకరించి చట్టంలో పొందుపర్చా మని వెల్లడించారు. ధరణి లోపాల వల్ల రైతులు అనేక ఇబ్బందులకు గురయ్యారన్నారు. లక్షలాది ఎక రాల భూరికార్డులను విదేశీ సంస్థల చేతిలో పెట్టిన కేసీఆర్.. పోర్టల్ నిర్వహణ పేరుతో రూ.కోట్ల ఖర్చు చేశారని ఆరోపించారు. పార్ట్–బీలో ఉన్న 13 లక్షల ఎకరాలకు సంబం ధించిన సమస్యలు పరిష్కరిం చడంతోపాటు ధరణిలో (dharani) కనిపిం చకుండా ఉన్న భూములను బయ టపెట్టి అర్హులకు, హక్కుదారులకు దక్కేలా చూస్తామని చెప్పారు.
గ తంలో మాన్యువల్గా ఉన్న పహా ణీలో 32 కాలాలు ఉండేవని అవ న్నీ గత ప్రభుత్వం తొలగించి ధరణి ముసుగులో ఒకే కాలం పెట్టి గందర గోళ పరిస్థితిని సృష్టించిందన్నారు. ఇదే కాలంలో మార్పులు చేసి సు మారు 14 కాలాలు ఉండేలా ధరణి పేరు మార్చి కొత్త పోర్టల్ను అందు బాటులోకి తేబోతున్నామన్నారు. ప్రతి రైతుకు (farmers) క్లియర్ టైటిల్తో డాక్యుమెంట్ ఉండబోతోందని వివరించారు.