Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ponguleti Srinivasa Reddy: విదేశీ నుంచి స్వ‌దేశీ చేతుల్లోకి ధ‌ర‌ణి

–ధ‌ర‌ణి నిర్వ‌హణ‌ను ఎన్‌.ఐ.సికి అప్ప‌గిస్తూ ఉత్వ‌ర్వులు
–త్వ‌ర‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల‌నుంచి పూర్తిగా మిముక్తి క‌ల్పిస్తాం
–రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొం గులేటి శ్రీ‌నివాస‌రెడ్డి

Ponguleti Srinivasa Reddy: ప్రజా దీవెన, హైద‌రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివ‌ర‌ కు విదేశీ సంస్ధ టెర్రాసిస్ చేతిలో ఉన్న ధ‌ర‌ణి నిర్వ‌హ‌ణా బాధ్య‌ త‌ను స్వ‌దేశీ సంస్ధ ఎన్ఐసికి అప్ప‌ గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ని రాష్ట్ర రెవె న్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీ‌నివాస‌రెడ్డి (Ponguleti Srinivasa Reddy) వెల్ల‌డించారు. డిసెంబ‌ర్ 1 వ‌తేదీ నుంచి తెలంగా ణలో భూ రికార్డుల నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌ను జాతీయ స‌మాచార సంస్ధ (ఎన్ఐసి ) నిర్వ‌హిస్తుంద‌ని ఈ మేర‌కు ఉత్వ‌ర్వులు జారీ చే య‌డం జ‌రిగింద‌ని తెలిపారు. మం గ‌ళ‌వారం ఆయన విడుద‌ల చేసిన ఒక ప్ర‌క‌ట‌న‌లో ఈ మేరకు వెల్ల‌డిం చారు. త్వ‌ర‌లో ధ‌ర‌ణి స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల‌కు పూర్తి విముక్తి క‌ల్పిస్తామ‌ని వెల్ల‌డించారు.

ఆనాటి బిఆర్ఎస్ ప్ర‌భుత్వం (BRS Govt) లోని పెద్ద‌లు ఎలాంటి ముందు చూపు లేకుండా హ‌డావుడిగా తొంద‌ర‌పాటు నిర్ణ‌ యాల‌తో తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ వ‌ల్ల తెలంగాణ రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంద‌ని మంత్రి పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) ఆరోపించారు. అప్ప‌ట్లో బిఆర్ఎస్ ప్ర‌భుత్వ పెద్ద‌లు తెలం గాణ‌కు చెందిన 1.56 కోట్ల ఎక‌రాల భూమిని టెర్రాసిస్ అనే విదేశీ కంపె నీకి తాక‌ట్టు పెట్టార‌ని, ఒరిస్సా రాష్ట్రంలో ఈ సంస్ధ ప‌నిచేసి విఫ‌ల‌ మైందని ఇటువంటి సంస్ధ‌కు కేవ‌ లం త‌మ స్వార్ధ ప్ర‌యోజ‌నాల కోసం బిఆర్ఎస్ పెద్ద‌లు క‌ట్ట‌బెట్టి న‌ట్లు మంత్రి పొంగులేటి (Ponguleti Srinivasa Reddy) దుయ్య‌ బ‌ట్టారు. లక్షలాది రైతుల లకు చెందిన కోట్లాది ఎకరాల వ్యవ సాయ భూములను లక్షలాది ఎక రాల ప్రభుత్వ భూములను గత బారాస ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రెవిన్యూ శాఖ మంత్రి అయినా కేసీఆర్ ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన కేటీఆర్ (ktr) ఏకపక్షంగా యదే చ్చగా విదేశీ కంపెనీలకు అప్పగిం చగా ఐదేళ్లపాటు ధరణి పోర్టల్ రైతులను నానా ఇబ్బందులు పెట్టింది ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం ధరణి పోర్టల్ విదేశీ కంపెనీల చేతుల్లో నుంచి ప్రభుత్వం చేతిలోకి తీసుకుంటుందని కాంగ్రెస్ (Congress) చెప్పిన ప్రకారం కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి ఇవ్వడం అయినది తద్వారా 71, 00,000 ఖాతాల రైతుల భూములకు పూర్తి రక్షణ లభించినట్లయింది.

ప్ర‌జ‌ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో ధ‌ర‌ణి పోర్ట‌ల్ (Dharani Portal) ప్ర‌క్షాళ‌న చేప‌డ‌తామ‌ని ప్ర‌క‌టించి ప్ర‌జ‌ల అభిమానాన్ని చూర‌గొన్నామ‌ని తెలిపారు. ఇచ్చిన మాట మేర‌కు విదేశీ కంపెనీ చేతుల్లో ఉన్న తెలంగాణ భూముల‌ను కాపాడుకోవ‌డానికి , ఆ కంపెనీ ర‌ద్దుకు నిర్ణ‌యించామ‌ని మంత్రి తెలిపారు. ధ‌ర‌ణి నిర్వ‌ హ‌ణా బాధ్య‌త‌ను మార్చ‌డం వ‌ల‌ న రాష్ట్రంలోని ల‌క్ష‌లాది కుటం బాలు స‌మ‌స్య‌లు ,ఇబ్బందుల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని , అంద‌రి భూ స‌మ‌స్య‌ల‌కు చ‌క్క‌ని ప‌రిష్కారాలు త్వ‌ర‌లో ల‌భిస్తాయ‌ని మంత్రి పొంగులేటి వివ‌రించారు.

2020 అక్టోబ‌ర్ లో తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ (Dharani Portal) దారిత‌ప్పి లోప‌భూ యిష్టంగా మారి ప్ర‌జానీకానికి శాపంగా మారింద‌న్నారు. ధ‌ర‌ణి పేరుతో జ‌రిగినా ద‌గా వ‌ల్ల తెలంగా ణా స‌మాజం తీవ్రంగా న‌ష్ట‌పోయిం ద‌ని మంత్రి ఆవేద‌న వ్య‌క్తం చేశా రు. గ‌త ప‌ది సంవ‌త్స‌రాల‌లో బిఆ ర్ఎస్ ప్ర‌భుత్వం (brs) తెలంగాణ ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌ను స‌మాధి చేసిం ద‌ని మంత్రి ఆరోపించారు. ఆ నా టి ప్ర‌భుత్వ పెద్ద‌ల దాష్టీకానికి ప్ర‌జ‌లు అనుభ‌వించిన బాధ‌లు అన్నీ ఇన్నీకావ‌ని, కాంగ్రెస్ ప్ర‌భు త్వం వీటికి చ‌ర‌మ‌గీతం పాడు తుంద‌ని మంత్రి పొంగులేటి స్ప‌ష్టం చేశారు.