Ponnam Prabhakar:ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణరాష్ట్ర వ్యాప్తంగా చెరువులు నిండుకుండలా మారాయని తెలం గాణ జిల్లాల్లోని అన్ని చెరువుల్లో చేపల పంపిణీ కార్యక్రమం చేపట్టా లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar)విజ్ఞప్తి చేశారు. దీంతో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ నెల 3 వ తేదీ నుండి చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేప ట్టాలని ఆదేశించారు. అన్ని జిల్లా ల్లో తెలంగాణ మత్యశాఖ తరు పున చేపల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
జిల్లాలో మంత్రులు ,విప్ లు , ఎమ్మేల్యే లు,ఎమ్మెల్సీలు ,ఎంపిలు (WHIPs, MLAs, MLCs, MPs)కార్పో రేషన్ చైర్మన్ లు , ప్రభుత్వ సలహా దారులు మత్స్య కార్మిక కుటుం బాలకు అండగా ఉండే విధంగా చేపల పంపిణీ కార్యక్రమం లో పాల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వంలో వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో వెలుగులు నింపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అందులో భాగంగానే రాష్ట్ర వ్యా ప్తంగా చెరువుల్లో చేప పిల్లల పంపి ణీ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెల్లడించారు. చెరువుల్లో వేసే దానిలో నాణ్యమై న చేప పిల్లల పంపిణీ చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారుల ను ఆదేశించారు. చేప పిల్లల పంపి ణీ గ్రామాల్లో ఒక పండగ వాతావ రణంలో జరగాలని సూచించారు. అన్ని చెరువులు , ప్రాజెక్ట్ లు జల కళ సంతరించుకోవడంతో చేప పిల్లల పంపిణీ భవిష్యత్ లో మ త్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ఫిషరీస్ కార్పో రేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమా ర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సబ్యసాచి ఘోష్ తో పాటు , డైరెక్టర్ ప్రియాంక అలా చేప పిల్లల పంపిణీ కార్యక్రమంకి సంబంధించిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.