Ponnam Prabhakar: ప్రజా దీవెన, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో సీవరేజ్ పైపులైన్ల క్లీనింగ్ (Cleaning of sewerage pipelines), విని యోగదారుల ప్రాంగణాల్లో ఇంకు డు గుంతల నిర్మాణం చేపట్టడమే లక్ష్యంగా జలమండలి నిర్వహిం చనున్న 90 రోజుల స్పెషల్ డ్రైవ్ ను మెహెదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రి ప్రాంగణంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ప్రారంభిం చారు. కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి,రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్,స్థానిక ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ , జల మండలి ఎండీ అశోక్ రెడ్డి, హైద రాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి తదితరులు ఉన్నారు. నేటి 2 నుంచి డిసెంబర్ 31 వరకు ఇంకు డు గుంతల నిర్వహణ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. నిత్యం మురుగు పొంగే మ్యాన్ హోళ్ల గుర్తింపు, భూగర్భ డ్రైనేజీ పైపు లైన్ల (Drainage pipe lines) స్థితి సామర్థ్యం పరిశీలన, పైపులైన్ ల కెపాసిటి పెంపునకు చర్యలు చేపట్టేందుకు క్షేత్రస్థాయి లో పర్యటించనున్నారు. కాలం చెల్లిన పైపులైన్ ల మార్పునకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ప్రతిరోజు రంగంలోకి ఎయిర్ టెక్ మిషన్లతో (Air Tech Missions) ప్రత్యేక సీవరేజి టీంలు క్షేత్ర స్థాయి పనులపై జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ చేయ నున్నారు. మూడు నెలల్లో సీవరేజి సమస్య 30 శాతానికి తగ్గించా లన్నదే టార్గెట్ గా ముందుకు సాగనున్నారు.గాంధీ జయంతి నుంచి సీవరేజి స్పెషల్ డ్రైవ్ అమ లుకు శ్రీకారం చుట్టారు. సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ” లక్ష్యంగా సీఎం ఆదేశంతో ప్రత్యేక కార్యాచరణకు జలమండలి సిద్ధమైoది. ఈ సంద ర్భంగా హైదరాబాద్ ఇన్చార్జ్ మం త్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ (Ponnam Prabhakar) మా ట్లాడు తూ ఈ స్పెషల్ డ్రైవ్ ను నేటి నుం చి డిసెంబర్ 31 వరకు నిర్వహిం చనున్నారని తెలిపారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భూగర్భ డ్రైనేజీ పైపులైన్ల స్థితి, సామర్థ్యం పరిశీలిన, అవసర మైతే వాటి సామర్థ్యం పెంచడం, కా లం చెల్లిన పైపు లైన్ల మార్పు, ని త్యం పొంగే మ్యాన్ హోళ్లను గుర్తిం చి, ఆ సమస్యను శాశ్వతంగా పరి ష్కరించడం లాంటివి చేస్తారని చెప్పారు. ఎయిర్ టెక్ మిషన్లతో ప్రత్యేక సీవరేజ్ బృందాలు రోజూ రంగంలోకి దిగి క్షేత్ర స్థాయిలో పనిచేస్తాయని వెల్లడించారు.
ఈ పనులను జీపీఎస్ ట్రాకింగ్ (GPS tracking) ద్వారా పర్యవేక్షించనున్నారని, రాబోయే రెండేళ్లలో సీవరేజి ఓవర్ ఫ్లో ఫ్రీ సీటి హైదరాబాద్ గా గుర్తిం పు తీసుకురావాలన్న ముఖ్య మం త్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆలోచనలో భాగం గా మొదటి మూడు నెలల్లో సీవరే జీ ఓవర్ ఫ్లో ను 30 శాతానికి తగ్గిం చేందుకు కార్యచరణ అమలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు తెలిపారు.సేవరేజ్ ఓవర్ ఫ్లో, ఇంకుడు గుంతల నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ (Special focus)పెడతామని స్పష్టం చేశారు. గాంధీ జయంతి సందర్భం గా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలో వర్షం నీరు వృథాగా పోతున్నాయి వాటిని భూగర్భ జలాలు గా మార్చు కోవాలని ఉద్దేశ్యానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. వర్షం నీరు బయటికి పోకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవా లని, అపార్ట్మెంట్స్, కాలనీలు అం దరూ పాటించాలని కోరారు. మూడు నెలల్లో సేవరేజి సమస్య 30 శాతానికి తగ్గించాలన్నదే మా ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. జీపీ ఎస్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని, 1950 ప్రాంతాల్లో రోజు మురుగు నీరు వస్తుందని, వాటిని ఎస్ టి పి ద్వారా శుభ్రత అయ్యే విధంగా ఏర్పాటు చేస్తు న్నామని తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
