— ప్రొఫెసర్ కోదండరాం
Professor Kodandaram: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా మారిన విద్యా విధానాన్ని (Education policy) పటిష్టమై న పద్ధతిలో నడిపించడానికి రాష్ట్ర విద్యా కమిషన్ ఏర్పాటు అయింద ని శాసనమండలి సభ్యుడు ప్రొఫె సర్ కోదండరాం (Professor Kodandaram)తెలిపారు. విద్యా కమిషన్ సభ్యులుగా తెలంగాణ జన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు నియమితులైన సందర్భంగా ఆయనకు పార్టీ కార్యాలయంలో ఘనంగా అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పిఎల్ విశ్వేశ్వరరావు నియమాకంతో విద్యా కమిషన్కి గౌరవం వచ్చిం దని అన్నారు. రాష్ట్రంలో ప్రాథమిక విద్య నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు సమూల మార్పులు చేపట్టి పేద, బడుగు, బలహీన వర్గాల(Poor, poor and weak communities) వారందరికీ సముచిత న్యాయం కల్పించే లక్ష్యంతో విద్యా కమిషన్ పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా విద్యా కమిషన్ (Education Commission)సభ్యులుగా నియమితులైన పిఎల్ విశ్వేశ్వరరావు మాట్లాడుతూ వి ద్యారంగంలో తనకున్న 40 సంవ త్సరాల అనుభవాన్ని ఉపయో గించి ఉన్నత విద్యలో సంస్కరణ లు తీసుకువస్తామని అన్నారు. తెలంగాణ జన సమితి పార్టీ ఏర్పడిన నాటి నుండి విద్యారంగ సమస్యల (Educational problems) పరిష్కారానికి కోదండరాం నేతృత్వంలో అనేక ఉద్యమాలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి విద్యారంగ సమస్యల పరిష్కారానికి కోదం డరాం కృషి చేస్తున్నారని, విద్యా కమిషన్ ఏర్పాటులో కోదండరాం కీలక పాత్ర పోషించారని తెలుపు తూ కోదండరాం కృతజ్ఞతలు తెలి పారు.
గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad) తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఎం. నరసయ్య (Narasiah) అధ్యక్షతన జరిగిన ఈ అభినందన సభలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బైరి రమేష్, గోపగాని శంకర్రావు, పల్లె వినయ్ గౌడ్, ఆశప్ప, రమేష్ ముదిరాజ్, మహిళ విభాగం అధ్యక్షురాలు లక్ష్మి, రాష్ట్ర నాయకులు మారం లక్ష్మారెడ్డి, సర్దార్ వినోద్ కుమార్, యువజన విభాగం అధ్యక్షుడు సలీం పాషా, విద్యార్థి విభాగం అధ్యక్షుడు మాసంపల్లి అరుణ్ కుమార్, నగర ప్రధాన కార్యదర్శి బట్టల రామచందర్, బీసీ సెల్ అధ్యక్షుడు ఎస్. జస్వంత్ కుమార్, ఆఫీస్ ఇంచార్జ్ హనుమంత్ రెడ్డి, నగర ఉపాధ్యక్షులు జేపాల్ రెడ్డి, లక్ష్మణ్, నగర నాయకులు రాజు, కాకునూరి సుధాకర్, హనుమంతు గౌడ్, ఇస్మాయిల్, రసూల్, పుష్పలీల, రేఖ తదితరులు పి.ఎల్ విశ్వేశ్వరరావు సత్కరించి అభినందించారు.