Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

PV Narasimha Rao: సర్వం పీవీ స్మరణం

–రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా మాజీ ప్రధాని జయంతి వేడుకలు
–నివాళులు అర్పించిన మంత్రులు, రాజకీయ ప్రముఖులు

PV Narasimha Rao:హైదరాబాద్: భారతరత్న, మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimha Rao)జయంతి వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని పీవీ ఘాట్ వద్ద మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy), ఎమ్మె ల్సీ వాణిదేవి (MLC Vanidevi)ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించా రు. హనుమకొండ జిల్లా భీమదే వరపల్లి మండలం వంగర గ్రామం లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పీవీని గుర్తుచేసుకున్నారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ (ktr) తెలంగాణ భవన్లో పీవీ చిత్రపటానికి నివాళులర్పించారు. పీవీ నర సిం హారావు అసామాన్య వ్యక్తి, బహు భాషా కోవిదుడని, తన మేధో సంప త్తితో ప్రపంచాన్నే ఆకర్షించారని ఆయా కార్యక్రమాల్లో వక్తలు పేర్కొ న్నారు. ఆర్థిక పతనం సమయంలో దేశ ప్రధానిగా బా ధ్యతలు తీసుకు న్నారు.బిఫోర్ పీవీ, ఆఫ్టర్ పీవీ అనే పరిస్థితి ఇప్పుడు ఉంది. దేశమే ఆశ్చర్యపో యే విధంగా భూ సంస్క రణలో భాగంగా 800 ఎకరాలను సొంత భూమి ధారాదత్తం చేశారని కొనియాడారు.

పీవీ పాలన భవిష్యత్ కు పునాదులు: సీఎం రేవంత్, భట్టి

భవిష్యత్ తరాల పాలనకు పీవీ పునాదులు వేశారని సీఎం రేవంత్(cm revanth reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ( deputy CM Bhatti Vikramarka) అన్నారు. మాజీ ప్రధాని పీవీ నర సింహారావు జయంతి సందర్భంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమా లవేసి నివాళులర్పించారు.

ఆర్థిక పరమైన సంస్క రణలు తెచ్చి ప్రపంచ పోటీలో భారతదేశాన్ని నిలిపారన్నారు. భారతదేశ పాలనలో తెలు గువారి ముద్రవేసి గర్వపడేలా చేశారని కొనియాడా రు. రాష్ట్రప్రభుత్వం పీవీ మార్గాన్ని అవలంబిస్తుందని, ఆయన ఆలో చనలు ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. వారి వెంట మంత్రి ఉత్త మ్ (uttam), ఎమ్మెల్యే పద్మావతి ఉన్నారు. ఇదిలా ఉండగా దివంగత ప్రధాని పీవీ నరసింహారావు దేశానికి చేసిన సేవలను తెలుగు జాతి ఎప్పటికీ గు ర్తుంచుకుంటుందని మంత్రి కోమ టిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన కాంగ్రెస్‌ పార్టీ నేత అని చెప్పుకో వడాన్ని గర్వంగా భావిస్తున్నామని చెప్పారు. పీవీ జయంతి సందర్భం గా హైదరాబాద్‌లోని పీవీ ఘాట్‌లో మంత్రి సహా పలువురు ప్రముఖులు ఘాట్ పై పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

పీవీ నరసింహారావు (PV Narasimha Rao) సంస్కర ణలు అమలు చేయకపోయుంటే దేశం ఈ రోజు ఈ స్థితిలో ఉండేది కాదని, ఆయన మేధావి కాబట్టే అద్భుతమైన పాలన అందించారని, తెలుగుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావుకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని కోమటిరెడ్డి తెలిపా రు.భూసంస్కరణలు అమలు చే యాలని ఇందిరా గాంధీకి పీవీ చెప్పారని సినియర్ నాయకుడు వీహెచ్‌ గుర్తు చేశారు. కాంగ్రెస్‌ సీని యర్‌ నేత సోష లిస్టు భావాలు కలి గిన నేత పీవీ. ఆయన అమలు చేసి న భూసం స్కరణలు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ మౌలిక స్వభావాన్నే మార్చేశాయని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు.

పీవీ ((PV Narasimha Rao))ఆర్థిక సంస్కరణ ల స్ఫూర్తిని తరువాత వచ్చిన ప్రధా నులు కొనసాగించారని కాంగ్రెస్‌ సీని యర్‌ నేత జానారెడ్డి,తొలి తెలుగు ప్రధాని పీవీ అని ఇవాళ మనం రాసుకుంటున్నామని, మైనారిటీ ప్రభుత్వాన్ని చక్కగా పాలిస్తూ దేశాన్ని తీర్చిదిద్దారని, ఆర్థిక సంస్క రణలు అమలు చేశారని పీవీ కు మార్తె, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి (Surabhi Vanidevi) వ్యాఖ్యానించారు.