Rain Alert: భారీ వర్షాలతో స్కూళ్ళ కు వరుస సెలవులు..తెలంగాణలోని ఆ జిల్లా లో అన్ని విద్యాసంస్థలకు సెలవు..
Rain Alert: ప్రజా దీవెన, హైదరాబాద్: దసరా, బతుకమ్మ పండుగ (Dasara and Bathukamma festival)సందర్భంగా మొన్నటివరకు తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు భారీగా సెలవులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో.. విద్యార్థులంతా పండుగను బాగా ఎంజాయ్ చేశారు. సోమవారం (అక్టోబర్ 14న) వరకు సెలవులను ఆస్వాధించిన.. విద్యార్థులు మంగళవారం (అక్టోబర్ 15న) రోజున తిరిగి బడి బాట పట్టారు. ఇలా స్కూళ్లకు వచ్చారో లేదో.. రేపు కాకుండా ఎల్లుండే మళ్లీ సెలవును ప్రకటిస్తూ.. ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే.. ఈ సెలవు అనేది.. తెలంగాణలో ఉన్న అన్ని విద్యాసంస్థలకు కాదండోయ్.. కేవలం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలకు మాత్రమే ఈ బంపర్ ఆఫర్ అయితే.. ఎల్లుండి అంటే గురువారం అక్టోబర్ 17న రోజున ఆదివాసీ పోరాటయోధుడు కొమురం భీమ్ (Komuram Bheem)84వ వద్ధంతి. దీంతో ఆ రోజును కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు దినం గా ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని పేర్కొంటూ కలెక్టర్ వెంకటేష్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే.. అక్టోబర్ 17న ఇస్తున్న సెలవుకు బదువులుగా వచ్చే నెల (నవంబర్) 9న రెండో శనివారం వస్తుండగా.. ఆరోజును వర్కింగ్ డేగా (Working day)నిర్ణయించారు. ఈ విష యాన్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఆంద్రప్రదేశ్ లో ఆయా జిల్లాల్లో… ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటిం చేశారు. బంగళాఖాతంలో (Bay of Bengal) అల్ప పీడనం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4 రోజుల పాటూ ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే.. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ వరుణ ప్రభావం ఎక్కు వగా ఉంటుందని వాతావరణ శాఖ (Department of Meteorology)సూచించటంతో ఆ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లకు అక్టోబర్ 14న సెలవు ప్రకటించారు. అలాగే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూళ్లకు కూడా సెలవులు ప్రక టించారు. కాగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా స్కూళ్లకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించి నట్టు సమాచారం. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తమిళనాడులో నూ భారీ వర్ష ప్రభావం ఉండటంతో ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూ డా విద్యాసంస్థలకు సెలవులు ప్రక టించారు. ఈ మేరకు ఆయా జిల్లా ల కలెక్టర్లు ఉత్తర్వులు కూడా జారీ చేశారు.