–భారత రక్షణ వ్యూహాత్మక అగ్ని మిస్సైల్ రూపకర్త, భారత మిస్సైల్ కార్యక్రమ దిగ్గజం డా. రామ్ నారాయణ్ అగర్వాల్
–ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్ర భుత్వ ప్రధానకార్యదర్శి శాంతి కు మారి
Ram Narayan Aggarwal: ప్రజా దీవెన, హైదరాబాద్: ఆగస్టు 15 వ తేదీన కాలధర్మం చెందిన భారత రక్షణ వ్యూహాత్మక అగ్ని మిస్సైల్ రూపకర్త, భారత మిస్సైల్ కార్యక్రమ దిగ్గజం డా. రామ్ నారా యణ్ అగర్వాల్ (Ram Narayan Aggarwal) అంత్య క్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిం చాలని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ లో ఆగ స్టు 17 వ తేదీ శనివారం వీరి అంత్యక్రియలు (funeral) జరుగనున్నాయి. రక్షణ రంగంలో డా. అగర్వాల్ చేసిన సేవలకు గుర్తింపుగా 1990 లో పద్మశ్రీ, 2000 లో పద్మ భూషణ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది.
1983 లో భారత ప్రభు త్వం ప్రారంభించిన అత్యంత ప్రతి ష్టాత్మక భారత మిస్సైల్ (India’s most ambitious missile)కార్యక్ర మంలో డా. అరుణాచలం, డా. ఏ.పీ.జె. అబ్దుల్ కలాం లతో కలసి డా. ఆర్.ఎం. అగర్వాల్ పనిచే శారు. హైదరాబాద్ లో అడ్వాంసు డ్ సిస్టమ్స్ లాబరేటరీ వ్యవస్థాపక డైరెక్టర్ గా అగర్వాల్ (Aggarwal)పనిచేసారు. 2005 లో డిఫెన్స్ రీసర్చ్, డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ లో విశిష్ట శాస్త్ర వేత్తగా పదవీ విరమణ చేసిన డా. రామ్ నారాయణ్ అగర్వాల్ హైద రాబాద్ లో నివాసం ఏర్పరచుకొని చివరి వరకు రక్షణ రంగానికి సేవ లందించారు. భారత లాంగ్ రేంజ్ మిస్సైల్ టెక్నాలజీ రంగంలో దేశం స్వయం ప్రతిపత్తి సాధించడంలో విశేష సేవలందిం చిన డా. రామ్ నారాయణ్ అగర్వా ల్ అంత్య క్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.