Ramoji Rao: అక్షర యోధుడు ‘ రామోజీ ‘ అస్తమయం
తెలుగు మీడియా దిగ్గజం, అక్షర యోధుడు, ఈనాడు మీడియా అధి పతి, సినీ నిర్మాత, వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు (88) తెల్ల వారుజామున అస్తమించాడు.
అనారోగ్యంతో ఆసుపత్రిలోచికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన రామోజీరావు
ఆసుపత్రిలోనే ఈ రోజు తెల్లవారు జామున కన్నుమూత
తీవ్ర అనారోగ్య సమస్యలతో ఆ యన రామోజీ ఫిల్మ్ సిటీకే పరిమి తం
మీడియా, ఫిలిం సిటీ అధిపతిగా జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి
రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు ఘన నివాళులు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలుగు మీడియా దిగ్గజం, అక్షర యోధుడు, ఈనాడు మీడియా అధి పతి, సినీ నిర్మాత, వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు(Cherukuri Ramoji Rao)(88) తెల్ల వారుజామున అస్తమించాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఊపిరి తిత్తుల సమస్యతో(Lung problem)బాధపడుతు న్న ఆయనకు చివరి గంటల్లో వెంటి లేటర్ పై చికిత్స అందించారు. అదే సందర్భంలో గుండె సంబంధిత సమస్యలతో కూడా బాధపడుతు న్న ఆయనకు వైద్యులు ఇటీవలే స్టంట్(Stunt) అమర్చారు. ఓ వైపు అనా రోగ్యం, మరోవైపు వృద్ధాప్య సమ స్యలతో బాధపడుతున్న ఆయన చాలాకాలంగా ఇంటికి పరిమితమ య్యారు.
రామోజీ ఫిల్మ్ సిటీ దాటి బయటికి వచ్చిన సందర్భాలు లే వు. ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), కేంద్ర మంత్రి అమిత్ షా, పలువురు బీజే పీ నేతలు, కొత్తగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవం త్ రెడ్డి తదితరులంతా స్వయంగా అక్కడికే వెళ్లి ఆయనను కలుసుకు న్నారు. 2016లో కేంద్ర ప్రభుత్వం ఆయనను పద్మవి భూషణ్ తో(Padmavi Bhushan)సత్కరించిన విషయం తెలిసిందే.యాభై ఏళ్ళ యాదిలో… ఐదు పదుల సంవత్సరాల క్రితం వివిధ రకాల వ్యాపారాలు ప్రారంభించిన ఆయన తన పేరు మీదనే రామోజీ గ్రూపును ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్ నగరం శివారు ప్రాం తంలో సుమారు 1,600 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రామో జీ ఫిల్స్ సిటీని నెలకొల్పారు.
ఈవెం ట్లతో పాటు సినిమా, సీరియల్ షూటింగులకు అది కేరాఫ్ అడ్రస్ గా రామోజీ ఫిలిం సిటీ(Ramoji Film City)ప్రపంచ వ్యాప్త ప్రాచుర్యాన్ని పొందింది. ఆరంభంలో ప్రియా పచ్చళ్లు, మార్గ దర్శి చిట్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారం భించిన ఆయన ఈనాడు దినప త్రికతో పత్రికారంగంలోకి అడుగు పెట్టారు. ఉషాకిరణ్ మూవీస్ పేరు తో చలనచిత్ర రంగంలోకి ప్రవేశిం చారు. అప్పటికే డాల్ఫిన్స్ హోటల్స్ ను(Dolphins Hotels) స్థాపించిన ఆయన కళాంజలి, మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పేరుతో విభిన్న మైన వ్యాపారాలు ప్రారంభించారు. సంతాప సూచకంగా రేపు సినీ పరిశ్రమ బంద్… అక్షర యోధు డు రామోజీరావు మృతిపై తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం తీసు కున్నది. ఆయన మరణానికి సంతా పం తెలియజేస్తూ ఆదివారం సినీ ఇండస్ట్రీ బంద్ కు పిలుపుని చ్చిన ట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది.
మీడియా రంగంలో తనదైన ముద్ర… ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజి టల్ మీడియా రంగంలో కొత్తదనం తీసుకురావాలంటే అది రామోజీకే సాధ్యమని నానుడి. 1974వ సంవ త్సరంలో ఈనాడు తెలుగు దినపత్రి కను విశాఖపట్నంలో స్థాపించిన రామోజీ రావు పత్రికను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు, ఆంధ్రప్ర భ, ఆంధ్రజ్యోతి నుంచి ఉన్న పోటీని తట్టుకోడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముచ్చ టగా మూడేళ్లలోనే ఇబ్బందులను అధిగమించిన ఈనాడు ఒక్క సంవ త్సరంలోనే హైదరాబాద్ ఎడిషన్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. 48 వేల కాపీలతో ఏబీసీ జాబితాలోకి ఎక్కి పాపులర్ దినపత్రికగా(Daily newspaper)అవతరిం చడం గమనార్హం.
ఆ తర్వాత సినీ రంగంలోకి…
రైతుల కోసం అన్నదాత, కథల కోసం విపుల, చతుర లాంటి పత్రి కలను కూడా స్థాపించి 1980వ దశకంలోనే జిల్లాలకు ప్రత్యేకంగా జిల్లా ఎడిషన్ లను పరిచయం చేయడంలో రామోజీరావు సరికొత్త ఒరవడి సృష్టించారు. అందుబాటు లోకి టెక్నాలజీని వినియో గించుకుని ఎడిషన్ కేంద్రాలను పెం చుకుని ఆల్ కలర్ పేజీలో పత్రికను తీర్చిదిద్దారు. జర్నలిజం స్కూల్ ను ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చి పత్రిక అవసరాలను సొంతంగా తీర్చు కోవడంపై నాటి నుంచే దృష్టి కేంద్రీకరించారు.
సాగుపై అభిమానంతో ‘అన్నదాత’ కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి గ్రామంలో 1936 నవంబర్ 16న వ్యవసాయ కుటుం బంలో జన్మించిన ఆయనకు వ్యవ సాయం మీద ఉన్న అభిమానంతో అన్నదాత’ పేరుతో మాసపత్రి కను ప్రారంభించారు. టీవీ చానల్లో సైతం అదే పేరుతో ప్రత్యేకంగా అడగంట కార్యకమానికి రూపకల్పన చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. చి న్న కుమారుడు చెరుకూరి సుమన్ పన్నెండేళ్ల క్రితం చనిపోయారు. పెద్ద కుమారుడు చెరుకూర్ కిరణ్, సుమన్ భార్య చెరుకూరి విజయే శ్వరి ప్రస్తుతం రామోజీ గ్రూపులో వాటాదారులుగా ఉన్నారు.
1980వ దశకం ప్రారంభంలో సినీ రంగంలోకి ప్రవేశించిన రామో జీరావు ‘ప్రేమలేఖ’ చిత్రాన్ని 198 4లో నిర్మించారు. దాదాపు 60 సిని మాలకు నిర్మాతగా, డిస్ట్రిబ్యూ టర్ ఉన్న ఆయన 2000 సంవత్సరంలో విడుదలైంది ‘నువ్వేకావాలి’ చిత్రా నికి జాతీయ అవార్డు(National Award)దక్కించుకు న్నారు. ఆ క్రమంలోనే 1985లో విడుదలైన ‘ప్రతిఘటన’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విజ యశాంతి నటించిన ఈ చిత్రానికి ఫిల్మ్స్ పేర్ ఆవార్డు లభించింది. దానికి కొనసాగింపుగా మయూరి, కాంచనగంగ, నువ్వేకావాలి, మౌన పోరాటం, అశ్విని, తేజ తదితర చిత్రాలకు నంది ఆవార్డులు కూడా వచ్చాయి.
Ramoji rao passed away