Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: విస్తారంగా ఆర్టిఫీషియల్ ఇంటలి జెన్స్ సిటీ

–ఐటి రంగాన్ని ప‌రిచ‌యం చేసేం దుకు ఈ స‌ద‌స్సు
–కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌కు సంపూర్ణ ప్రొ త్సాహం
–హైద‌రాబాద్ ఫోర్త్ సిటీలో అంద‌ రికి అవ‌కాశాలు
–దేశానికే మార్గ‌ద‌ర్శ‌కంగా ఫోర్త్ సిటీ నిర్మాణం
–AI గ్లోబల్ సమ్మిట్ లో రేవంత్‌ రెడ్డి

Revanth Reddy: ప్రజా దీవెన, హైద‌రాబాద్: ఎన్ని కల ముందు డిక్లరేషన్ లో చెప్పిన ట్టే AI కి మొదటి ప్రాధాన్యత ఇస్తు న్నామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)అన్నా రు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో రెండు రోజుల పాటు జ‌రిగే AI గ్లోబల్ సమ్మిట్ ను రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు (IT and Industries Minister Sridhar Babu) తో క‌లిసి ప్రారం భించారు. కాగా ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ అందరికీ అందుబాటు లోకి రావాలనే ఉద్దేశంతో ప్రభు త్వం ఈ సదస్సును నిర్వహిస్తోంది. ప్ర‌పంచం నలుమూలల నుండి వ‌చ్చిన రెండు వేల మందికి పైగా కృత్రి మ మేధస్సు రంగంలో ప్రము ఖులు, వివిధ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రారం భ సంద‌ర్భంగా AI రోడ్ మ్యాప్ ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ, ఐటీ రంగంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించేందుకు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సద స్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌లో నిర్మించనున్న నాలుగో నగరంలో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా ఏఐ సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణ యించినట్లు తెలిపారు. రైల్ ఇంజి న్, ఫోటో కెమెరా మొదలు కొని ఇప్పుడు AI కి వచ్చామన్నారు. క్రమంగా టెక్నాలజీ పెరుగుతోం దన్నారు.ఎన్నికల ముందు డిక్లరే షన్ లో చెప్పినట్టే AI కి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపా రు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ఇతర పరిజ్ఞానం కి చెందిన వారికి అవకా శాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా మన్నారు.

తెలంగాణలో పెట్టుబడు లు పెట్టడానికి అందరికి అవకాశం ఇస్తున్నామని తెలిపారు. సాంకేతిక త, ఆవిష్కరణ (Technology and innovation) లేకుండా సమాజం లో ఏ మార్పు జరగదన్నారు. మొ దటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మా రిందన్నారు. విమానం ఆవిష్కరణ తో ప్రపంచ స్వరూపమే మారిపో యిందన్నారు. ఇదే క్రమంలో కరెం టు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూ టర్ ఇవన్నీ ప్రపంచ గతిని మార్చ డంలో కీలక పాత్ర పోషించాయ న్నారు. టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ (Television, computers, internet, mobile phone) చూడ టం మన తరం చేసుకున్న అదృష్టం అన్నారు. ఇవాళ ప్రపంచ సాంకేతిక రంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవి ష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. కొత్త టెక్నాలజీ వచ్చిన ప్పుడల్లా కొంత భయం నెలకొంటుం దని తెలిపారు.

అది మన జీవి తా న్ని ఎలా మెరుగుపరుస్తుంది అదే సమయంలో ఉద్యోగాలు పోతా యా భయం ఉండటం సహజం అన్నారు రేవంత్. దేశ చరిత్రను పరిశీలిస్తే.. గతంలో వచ్చిన పారి శ్రామిక విప్లవాన్ని (industrial revolution) సరిగ్గా అను సరించలేకపోయామని తెలిపారు. భారతదేశ భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే హైదరాబాద్‌ సిటీ లా మరీ సిటీ పరిశ్రమల ఏర్పాటు కు సంపూర్ణంగా సిద్ధంగా లేద‌న్నా రు.ఇందుకు సంబంధించిన సవా ళ్ళను స్వీకరించడమే కాదు భవి ష్యత్తును సృష్టిస్తామన్నారు. ఆర్టిఫి షియల్ ఇంటెలిజెన్స్ పై త‌మ చిత్త శుద్ధిని శంకించాల్సిన అవసరం లేద న్నారు. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాల నుకుం టున్నామన్నారు. తెలంగాణ AI మిషన్, లేదా NASSCOM భాగ స్వామ్యంతో T-AIM తెలంగాణలో AI ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడం లో త‌మ‌కు సహకరిస్తాయన్నారు ముఖ్య‌మంత్రి. ఇండస్ట్రీ నిపుణుల తో కలిసి ఆవిష్కరణలను ప్రభు త్వం ముందుకు తీసుకెళుతుం దన్నారు. హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనం అన్నారు. సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌కి (City of the Future)మీ అంద రికి స్వాగతం అన్నారు. మనమంద రం కలిసి ఫ్యూచర్ సిటీని ఒక గొ ప్ప AI హబ్ గా తీర్చిదిద్ధే సంక ల్పంతో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.