Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: డాక్టర్ కావాలన్న ఆ గిరిజన విద్యార్థిని కల నెరవేరనుంది. ఎంబీబీఎస్లో సీటు సాధించినా కాలేజీ ఫీజు కట్టేం దుకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బం దికర పరిస్థితులను ఎదుర్కొంటు న్న సాయి శ్రద్ధకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆర్ధిక సాయం (Financial assistance) అందిం చారు. కుమురంభీం జిల్లా జైనూరు మండలం జెండాగూడ గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థిని సాయి శ్రద్ధ నీట్లో (neet) ఎస్టీ విభాగంలో 103 వ ర్యాంకు సాధించారు. మంచి ర్యాంకుతో సీటు సాధించినా ఫీజు కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొం టు న్న విషయం ముఖ్యమంత్రి దృష్టికి రాగానే వారు వెంటనే స్పందిం చారు.
ఆ విద్యార్థిని కలను నెరవే ర్చే బాధ్యత ప్రజా ప్రభుత్వం తీసు కుంటుందని హామీ ఇచ్చారు. సాయిశ్రద్ధ తల్లిదండ్రులతో కలిసి బుధవారం ముఖ్యమంత్రిని కల వగా, వైద్య విద్యకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. వైద్య విద్య (Medical education) పూర్తి చేయాలన్న కల నెరవేరుతున్నందుకు ఈ సంద ర్భం గా సాయిశ్రద్ధ, కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలి యజేశారు.