Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy ruling: కోడ్ క్లోజ్ పాలనకు పరుగులు

తెలంగా ణ రాష్ట్రం లో ఎన్నికల కోడ్ ముగి సింది. ఎన్నికల క్రతువు పూర్తయి పాలనకు వేళయింది.

ఎన్నికల కోడ్ ముగియడంతో
ప్రభుత్వ పాలనకు తొలగిన అడ్డంకి –త్వరలోనే భారీ ఎత్తున బదిలీలు, పదోన్నతులు
పాలనలో కాంగ్రెస్ మార్కుకు సీఎం రేవంత్ కసరత్తు
శరవేగంగా సంక్షేమ పథకాల అమ లుకు కార్యాచరణ

ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రం లో ఎన్నికల కోడ్(Election Code)ముగి సింది. ఎన్నికల క్రతువు పూర్తయి పాలనకు వేళయింది. గతేడాది అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు దాదాపు ఏడు నెలల్లో మూ డు నెలల పాటు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉండటంతో పెద్దగా ప్రభుత్వ కార్యకలాపాలు సాగలేదు. సంక్షేమ పథకాలూ ఆశిం చిన స్థాయిలో అమలు కాలేదు. గురువారంతో కోడ్ ముగియడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలనపై దృష్టి కేంద్రీకరించారు. తొలుత క్షేత్ర స్థాయి ఉద్యోగులు మొదలు ఐఏ ఎస్ ల వరకు పెద్ద ఎత్తున బదిలీలు చేపట్టనున్నారు. బదిలీల అనంత రం అధికారులందరికీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాల అమలుకు తీసుకోబోయే చర్యల పై దిశా నిర్దే శం చేయనున్నారు.

ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల పంపకం వివాదాల పైనా అధికారులతో చర్చించనున్నారు. మొత్తం మీద రాష్ట్రంలో కాంగ్రెస్ మార్క్(Congress mark)పాలన కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు.డిసెంబరులో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చింది. మార్చిలో లోక్ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో శాసనసభ ఎన్నికల హామీ లను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అవకాశం లేకపో యిం ది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్, మంత్రులు ఎన్నికలు ప్రచారంలో చెప్పారు. గురువారంతో ఎన్నికల కోడ్ ముగియడంతో సీఎం బదిలీ లపై దృష్టి సారించారు. ఆరు మసా ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ప్పటి నుంచి పెద్దగా అధికారులు బదిలీలు చేయలేదు. ఈసారి భారీ గానే బదిలీలు ఉంటాయని భావిస్తు న్నారు.

సీఎంవోలోనూ మార్పులు ఉండవచ్చని సమాచారం. వివిధ ప్రాంతాలు, పలు విభాగాల్లో ఒక్కొ క్కరినీ తీసుకొచ్చి సీఎంవోలో ఓఎ స్టీలు, సెక్రటరీలుగా నియమించి, పలు శాఖల బాధ్యతలను అప్పగిం చారు. సీఎం ఆశించినస్థాయిలో వారి పనితీరు లేదని, ముఖ్యమంత్రి చెబితే తప్ప ఫైలు కదలని పరిస్థితి ఉందనే ప్రచారం సచివాలయ వర్గా ల్లో విస్తృతంగా సాగుతోంది. ముఖ్య మంత్రి ప్రజా సంబంధాలను పర్యవే క్షించే విభాగంలోనూ కీలక మార్పు లు ఉండే అవకాశం ఉన్నదని సమా చారం. కేంద్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం జూన్ చివరివారంలో పూ ర్తి స్థాయి బడ్జెట్(Budget)ప్రవేశపెట్టే అవకా శం ఉంది. అందులో రాష్ట్రానికి వచ్చే గ్రాంట్లు, నిధులు పరిశీలించిన తర్వాత జూలై రెండు లేదా మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి పూర్తి స్థాయి రాష్ట్రబడ్జెట్ ను ప్రవేశ పెట్టాలనే యో చనలో రేవంత్ ఉన్నట్లు సమా చారం.

అర్హులైన వారికి పథకాలు అందించాలని భావిస్తున్నారు. ధరణి పోర్టల్ లో(Dharani Portal)తలెత్తిన సమస్య లనూ త్వరితగతిన పరిష్కరించా లని సీఎం భావిస్తున్నారు. మూసీ నది సుందరీకరణ, రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించేలా అధికారులకు సీఎం సూచనలిస్తున్నారు. సంక్షేమ పథకాల అమలు, పలు ప్రాజెక్టుల నిర్మాణాలకు అవసరమైన బడ్జెట్ పైనా ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. ఆగష్టు 15 లోగా రూ.2 లక్షల మేర రుణ మాఫీ చేస్తా మని హామీనిచ్చిన నేపథ్యంలో నిధుల సమీకరణపై దృష్టి సారిం చారు.ఉమ్మడి ఆస్తులు, భూములపై నిర్ణయం … గడిచిన పదేళ్లుగా ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరా బాద్ జూన్ 2 నుంచి కేవలం తెలం గాణ రాజధానిగా మారిపోయింది. ఉమ్మడి ఆస్తుల విభజన మాత్రం పూర్తి కాలేదు.

విభజన చట్టం షెడ్యూల్ 9, 10లో చేర్చిన ఆస్తులు, భూముల పంపకాలపై ఇరు రాష్ట్రా లు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. హౌసింగ్ బోర్డు, డెక్కన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ల్యాండ్ హెూల్డింగ్ లిమిటె డ్ పరిధిలోని విలువైన భూములు షెడ్యూల్ 9, 10లో ఉన్నాయి. వీటి పైనా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభు త్వానికి నిధులపరంగా వెసులు బాటు వస్తుంది.కేంద్ర ఎన్నికల సం ఘం ఆధీనంలోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాల యంలో పని చేస్తున్న ముగ్గురు రాష్ట్ర కేడర్ ఐఏఎసలలో కనీసం ఇద్దరిని తిరిగి ప్రభుత్వంలోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపుతోంది. ముగ్గురికీ సిన్సియర్ అధికారులుగా పేరు ఉండడమే కాకుండా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎలాంటి మచ్చ పడకపోవడంతో వారిని ప్రభు త్వంలోకి తీసుకుని, కీలక బాధ్య తలు అప్పగించాలని యోచిస్తోంది.

పార్లమెంటు ఎన్నికలు(Parliament Elections)ముగి య డం, ఇప్పట్లో కీలక ఎన్నికలు లేక పోవడంతో ఆ ఐఏఎస్ లను తిరిగి ప్రధాన స్రవంతిలోకి తీసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా అను మతిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావి స్తోంది. సీఈవో వికాసరాజ్ కు మళ్లీ ప్రభుత్వంలోకి తీసుకొని, ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించవచ్చన్న చర్చ జరుగుతోంది. సీఈఓ కార్యాల యంలో 2003 బ్యాచ్ కు చెందిన డీఎస్ లోకేషకుమార్(DS Lokesh Kumar)అదనపు సీ ఈఓగా, 2009 బ్యాచ్ కు చెందిన సర్ఫరాజ్ అహ్మద్ జాయింట్ సీఈ ఓగా పని చేస్తున్నారు. వీరిద్దరినీ తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోం ది. లూప్ లైన్లో ఉన్న అధికారుల్లో ఒకరిని సీఈవోగా నియమించే అవకాశం ఉంది.

Revanth reddy concentrate on ruling