Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy: రీజినల్ రింగ్ రోడ్డుపై రోజువారీ సమీక్ష

–ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలో భూసే కరణ వేగం పెంచండి
— రైతులకు న్యాయం జరిగేలా పారదర్శకత పాటించండి
–భవిష్యత్ అవసరాలకు అనుగు ణంగానే అలైన్‌మెంట్ ఉండాలి
—ఆర్ ఆర్ ఆర్ ప్రగతిపై ఉన్నతస్థా యి సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regi onal Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచా లని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకర ణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచి వాలయంలో ఉన్నతస్థాయి సమా వేశంలో సమీక్షించారు.భూములిచ్చే రైతులకు న్యాయం చేస్తూ RRR భూసేకరణ పూర్తి పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి ఆదేశిం చారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణ పనుల్లో పురోగతిపై సంబంధిత కలెక్టర్లు ఇక పై రోజూవారిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించాలని సీఎం పేర్కొన్నారు.అర్బన్ తెలంగాణ, రూ రల్ తెలంగాణ సమగ్రాభివృద్ధి ల క్ష్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR), రీజినల్ రింగ్ రోడ్డు (RRR) మధ్య అనుసంధానానికి అనువుగా రహ దారుల ప్రణాళికలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పా రు.

ప్రధాన రహదారులకు అను సంధానం చేసే ప్రదేశాలను ముందు గానే గుర్తించి నిరంతరం సాఫీగా ప్రయాణాలు సాగేందుకు వీలుగా నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నా రు. భవిష్యత్తు అవసరాలే ప్రాతిప దికగా RRR అలైన్‌మెంట్ ఉండా లని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పా టు కానున్న వివిధ రకాల పరిశ్రమ లు, సంస్థలకు ఉపయోగకరంగా ఈ రోడ్ల ప్రణాళికలు ఉండాలని స్పష్టం చేశారు. ఆర్ఆర్ఆర్ కింద ఉత్తర భాగం సంగారెడ్డి, భువనగిరి, చౌటు ప్పల్ మార్గంలో భూసేకరణ దాదా పుగా పూర్తి కాగా, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగంలోని (చౌటుప్ప‌ల్- ఆమ‌న్‌గ‌ల్‌ -షాద్ న‌గ‌ర్‌ -సంగారెడ్డి (189.20 కి.మీ.) (Chautuppal- Amangal – Shad Nagar – Sangareddy)మార్గానికి సంబం ధించి భూ సేక‌ర‌ణ,అలైన్‌మెంట్‌ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ సూచనలకు అనుగు ణంగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమగ్ర నివేదిక తయారు చేసి త్వర గా అందజేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆర్ఆర్ఆర్ విషయంలో ఏవైనా సాంకేతిక సమ స్యలుంటే వెంటనే కేంద్ర ప్రభుత్వం తో చర్చించాలని సీఎం చెప్పారు.

ఈ సమీక్షా సమావేశంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి సమావే శంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరె డ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, నల్గొండ ఎంపీ కుం దూరు రఘువీర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నా రు.