–మృతదేహానికి నివాలులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ భౌతికకాయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (revanth Reddy)నివాళులర్పించారు. ఆదివారం ఉదయం నిజామాబాద్ లోని డీఎస్ (ds house) నివాసానికి వెళ్లి ఆయ న పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్ (dharmapuri aravind), కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. ఈ సందర్భంగా వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం రేవంత్ తోపాటు పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీఎస్ కు నివాళులర్పించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడి న సీఎం రేవంత్ (CM revanth Reddy)డీఎస్ క్రమశిక్షణ కలిగిన నాయకుడన్నారు. కాంగ్రెస్ కు ఆయన చేసిన సేవలు మరవలే రన్నారు. కార్యకర్త స్థాయి నుంచి పీసీసీ చీఫ్ వరకు ఎదిగారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ఆయన ఎంతో కృషి చేశారని కొని యాడారు. డీఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని చెప్పారు.