–రాజకీయ నాయకులు,సామా న్యుల నుంచి మద్దతు
Revanth Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపు తున్న హైడ్రాకు రోజురోజుకూ నైతిక మద్దతు పెరుగుతోంది. ఒకవైపు రాజకీయ నాయకుల పరంగా, ఇటు సామాన్యుల నుంచి మద్దతు పెద్ద ఎత్తున వస్తోంది. ముఖ్యంగా ఎన్ కన్వెన్షన్ కూల్చివేత హైడ్రాకు కావల్సినంత మద్దతును కూడ గట్టింది. అన్ని వర్గాల ప్రజలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాపై సొంత పార్టీలో ఇబ్బందులు వస్తా యని తొలుత సీఎం రేవంత్ రె డ్డి (Revanth Reddy)భావించారు. కానీ ఎమ్మెల్యేలంతా రేవంత్ నిర్ణయానికి మద్దతు పలు కుతున్నారు. హైడ్రాలాంటి వ్యవస్థ ను రాష్ట్రమంతటా విస్తారించాలని రేవంత్కి ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తు న్నారు. హైడ్రాపై అభినందనలు తెలుపుతూ రేవంత్కి (Revanth Reddy) ఎమ్మెల్సీ జీవ న్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్లు లేఖ రాశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా లో హైడ్రా తరహా వ్యవస్థ కోసం సీ ఏం రేవంత్కి ప్రభుత్వ విప్ ఆది శ్రీని వాస్ (Adi Srinivas)లేఖ రాశారు.వేములవాడ ని యోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌజ్ కట్టాడని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు. హైడ్రాను తమ నియోజకవర్గంలో కూడా విస్తరిం చాలని సీఎం రేవంత్ రెడ్డికి షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రిక్వె స్ట్ చేశారు. నకిరేకల్ నియోజకవ ర్గంలో కూడా ఆక్రమణకు గురైన భూములను కాపాడాలని వేముల వీరే శం లేఖ రాశారు.
ఆలేరు నియో జకవర్గంలో ఆక్రమణకు గురైన భూ ములు, అక్రమ కట్టడాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని సీఎంకి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య లేఖ రాశా రు. తమ నియోజకవర్గంలో హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకు రావాలని మానుకొండూర్ కవ్వంపల్లి సత్య నారాయణ, ఎమ్మెల్యే కాలే యాద య్య, తదితరులు రేవంత్కి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ అధికార (Congress party in power)ప్ర తినిధి జ్ఞాన సుందర్ సోమవారం గాంధీ భవన్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి హైట్ కొలవగలరేమో కానీ ఆయన ఆత్మవిశ్వాసాన్ని కొలవలేరని కొనియాడారు. పేద వాడిని కొట్టడం తప్పా, పెద్ద వాళ్ళకి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం పోలేద న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎవరికీ భయపడకుండా ముందుకి పోతోందన్నారు. హైడ్రాకి ప్రజల మ ద్దతు ఉందన్నారు. తెలంగాణ అం తటా హైడ్రా లాంటి వ్యవస్థను విస్త రించాలని కోరారు. రేవంత్ ఆలో చనకి ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతోందన్నారు. గత ప్రభు త్వంలో అధికారులు బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు విన్నారని.. అందుకే ఫేక్ పట్టాలు పొందగలి గారని జ్ఞాన సుందర్ పేర్కొన్నారు. అయితే నగరంలో హైడ్రా మాత్రం నాన్ స్టాప్గా కూల్చివేతలు నిర్వ హిస్తోంది. శేర్లింగంపల్లి మండలం రాయదుర్గంలో ప్రభుత్వ భూముల్లో వెలిసిన అక్రమ నిర్మాణాలను (Illegal structures) కూ ల్చివేస్తోంది. రాయదుర్గం సర్వేనెం బర్ 72లో ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా జీహెచ్ఎం సీ టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చి వేతలు చేపట్టారు. భారీగా పోలీసు ల మోహరించారు. కూల్చివేతలను స్థానికులు అడ్డుకుంటున్నారు.