Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Revanth Reddy- Harish Rao: దొంగే దొంగ అన్న చందంగా సర్కారు సక్కదనం…!

–రుణమాఫీ ఎగనామం పెట్టి ఫోజు లతో పెట్రెగిపోతున్నారు
–పాక్షికంగా అమలు చేశారే తప్ప పూర్తిగా చేయనేలేదు
–ఎన్కటికి ఎవడో పంచపాండవులు అంటే మంచం కోళ్లవలె ఉంది
–ముచ్చటగా ముగ్గురు అని చెప్పి రెండు వేళ్లు చూపిoచినట్లు
–కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టి రూ.31వేల కోట్లు పంద్రాగస్టు కల్లా చేస్తానన్నాడు
–లెక్కలు తీస్తే సుమారు 25లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టిన ట్లు ప్రభుత్వ రికార్డులే చెబుతున్నా యి
–తన వందిమాగదులు కలిసి రుణ మాఫీ చేశామని చెప్పుకుంటూ చం కలు గుద్దుకుంటున్నరు
— సీఎం రేవంత్ రెడ్డి పై మచిలీ మంత్రి హరీష్ రావు ఫైర్

Revanth Reddy- Harish Rao:ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో రైతన్నకు రుణమాఫీ విషయం లో రాష్ట్ర ప్రభుత్వ తీరు దొంగే దొంగ అని బిగ్గరగా అరిచిన చందంగా ఉంది సర్కారు స క్కదనమని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో వ్యాఖ్య లు చేశారు. కుట్రపూరితంగా రుణ మాఫీ (Loan waiver) ఎగనామం పెట్టి లేనిపోని ఫో జులతో పెట్రెగిపోతున్నారని ధ్వజ మెత్తారు. పాక్షికంగా అమలు చేశారే తప్ప పూర్తిగా చేయనేలేదని, ఎన్క టికి ఎవడో పంచపాండవులు అంటే మంచం కోళ్లవలె ఉందని, ముచ్చట గా ముగ్గురు అని చెప్పి రెండు వేళ్లు చూపిoచినట్లుoదని ఎద్దేవా చేశా రు. రోడ్డు మీద కనిపించిన దేవుడి మీదల్లా ఒట్లు పెట్టి రూ.31వేల కో ట్లు పంద్రాగస్టు కల్లా రుణమాఫీ చేస్తానన్నాడని గుర్తు చేశారు.

అంత న్నాడు ఇంతన్నాడని చివరకు లెక్కలు తీస్తే సుమారు 25లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టినట్లు ప్రభుత్వ రికార్డులే (Government records)చెబుతున్నా యని విమర్శించారు. చేసిన తప్పు లకు క్షమాపణ చెప్పేది పోయితా నూ, తన వందిమాగదులు కలిసి రుణమాఫీ చేశామని చెప్పుకుంటూ చంకలు గుద్దుకుంటున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నిక లప్పుడు రూ.40 వేల కోట్లు చెప్పి తీరా చేసింది ఎంతంటే 17వేల కోట్లని, అంటే రూ. 23వేల కోట్లు కోత పెట్టిండని ఆరోపించారు.బడ్జెట్ డాక్యుమెంట్ లో రూ. 26వేల కోట్లు అని పెట్టారని, నేను అసెంబ్లీ సమా వేశాల్లోనే ప్రశ్నించానని, మొదట రూ. 40వేల కోట్లన్నావు, తర్వాత రూ. 31 వేల కోట్లన్నవు, బడ్జెట్ లోనేమో రూ. 26 వేల కోట్లు పెట్టా వని ప్రశ్నించాననీ,ఏ రైతులను తీసే స్తున్నవ్, ఎందుకు తీసేస్తున్నవ్ అని నిలదీశానని,రైతు రుణమాఫీ, రైతు భరోసా మీద చర్చ పెట్టాలని పట్టు పట్టానని, పెడతా అని చెప్పి ము ఖం చాటేసి పారిపోయిండని అన్నారు. మొన్న ఆగస్టు 15 స్వా తంత్ర్య దినోత్సవం (Independence Day) నాడు రుణమా ఫీ అయిపోయిందని సీఎం ప్రకటిం చిండని, సరే చేసిండేమో అనుకొని లెక్కలు చూస్తే కేవలం రూ. 17వేల కోట్లతో 22లక్షల మందికి చేసిండని లెక్క తేలిందని వివరించారు.

అ సెంబ్లీ ఎన్నికలప్పుడు 40వేల కోట్లు చెప్పి, తీరా చేసింది ఎంతంటే రూ. 17వేల కోట్లని, అంటే రూ. 23వేల కోట్లు కోత పెట్టిండని, క్యాబినెట్ మీ టింగ్ నాడు, పార్లమెంట్ ఎన్నికల నాడు చెప్పిన రూ. 31వేల కోట్లతో పోలిస్తే 14వేల కోట్లు కోత పెట్టిండు బడ్జెట్ (budget)కేటాయింపుల్లో చెప్పిన 26 వేల కోట్లతో పోలిస్తే రూ. 9వేల కో ట్లు కోత పెట్టిండని, పార్లమెంట్ ఎన్నికలపుడు రైతుల సంఖ్య రూ. 47లక్షలు అని చెప్పిండని, మొత్తం గా మూడు విడతలకు 22 లక్షల మంది రైతులకు చేసిండని, అంటే చెప్పిన సంఖ్యకు సగం కూడా చె య్యలేదని, లెక్కచేస్తే రూ. 46శా తం మంది రైతులకే చేసినట్లు తేలు తున్నదని, సుమారు 25లక్షల మంది రైతులకు ఎగనామం పెట్టి నట్లు తన రికార్డులే చెబుతు న్నా యని తెలిపారు. ఈ పాటి పోటు పనికి సిగ్గులేకుండా తను తన వంది మాగదులు కలిసి రుణమాఫీ (Loan waiver)చేసి నం అని చెప్పుకుంటూ చంకలు గుద్దుకుంటున్నరని ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డిది (Revanth Reddy) నోరా మోరా చెప్పె టోనికి చెవుడైనా వినేటోనికి వివేకం ఉంటది కదా అన్నారు. మొదటి దఫా మేము లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తేనే 36లక్షల మంది రైతులకు రూ. 17వేల కోట్ల ప్రయోజనం చేకూరిందని, మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తే రైతుల సంఖ్య పెరగాలె, డబ్బులు డబుల్ కావాలి కదా అని ప్రశ్నించారు. అటు వంటిది రైతుల సంఖ్య దా దాపు 14లక్షలు ఎట్ల తగ్గిందని, డబ్బు గదే రూ. 17వేల కోట్లకు అటు ఇటుగా ఉన్నదని, ఎవర్ని మభ్యపెడుతున్నరు, ఏమనుకుం టున్నరు, ఎవర్ని మోసం చేస్తున్న రని ప్రశ్నలు సంధించారు. పట్టప గలు నట్టనడిబజార్ లో నిట్టనిలు వున రైతులను ముంచి పారేసిన వని, నువ్వు నిజంగనే రైతు రుణ మాఫీ అయ్యిందనుకుంటున్నవా. రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేను మళ్లీ సవాల్ విసు రుతున్నారని, రైతులందరికి రుణ మాఫీ అయ్యిందని దమ్ముంటే నిరూపించమని డిమాండ్ చేశారు. ప్లేసు, డేటు, టైము నువ్వే చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ నియోజకవ ర్గానికి పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం. నీ నియోజకవర్గం లేదా నా నియోజ కవర్గం అయినా ఎక్కడికైనా పోదాం రేవంత్ అంటూ దుయ్యబట్టారు.

నేనంటన్నది కరెక్టో, నువ్వంటున్నది కరెక్టో ఖుల్లం ఖుల్లా తెలుస్తదని, నీ ప్రకటనల డొల్లతనం కూడా బయట పడుతదని, వస్తవా పోదాo రేవంత్ రెడ్డి అని నిలదీశారు. నేను నీలాగా మాట తప్పెటోడిని కాదని, కొడంగ ల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి పార్టీలు మా రి ముఖ్యమంత్రి అయిన చరిత్ర కాదు నాదని, తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినోడిని, ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం పదవులు లెక్కపెట్టకుండా రాజీనామాలు (Resignations) చేసినోడిని అంటూ గుర్తు చేశారు.నువ్వు చంద్రబాబు చంకల జొర్రి రైఫిల్ పట్టుకున్న నాడు నేను ప్రజల కొరకు రాజీనామా చేసినవాడిని, రుణమాఫీ చేసిన, రాజీనామా అని రంకెలేస్తున్నవ్ రేవంత్ రెడ్డి, నేను చాలా స్పష్టమైన సవాల్ విసిరిన అని ఆగస్టు 15లోపు రైతులందరికి 2లక్షల రుణమాఫీ చేసి, ఆరు గ్యా రెంటీల్లోని 13హామీలను సంపూ ర్ణంగా నెరవేరిస్తే నేను రాజీనామాకు సిద్ధమని ప్రకటించాననీ, ప్రజలకు నువ్వు ఇచ్చిన హామి నెరవేరితే చాలు పదవి ఉంటే ఎంత పోతే ఎంత అనుకున్నా కాని ఆరు గ్యా రెంటీల (Six guarantees)సంగతి పక్కన పెట్టు, కనీ సం రుణమాఫీ మాటను కూడా నెర వేర్చుకోలేకపోయావు, అడ్డంగా దొరి కిపోయావoటూ ధ్వజమెత్తారు.

నేను అనుకున్నట్లుగానే రుణమాఫీ పేరిట రైతుల నెత్తిన కాంగ్రెస్ టోపి పెట్టినావని, ఇది కవర్ చేసుకోవ డానికి ముఖ్యమంత్రి పదవి స్థాయి ని దిగజార్చుతూ రోత ప్రచారం మొ దలు పెట్టినావని, మభ్యపెట్టి మత లబు చేసి ఎక్కువ రోజులు అంద రిని నమ్మించలేవని, రైతన్నను దగా చేసిన నీ తీరును యావత్ ప్రజా నీకం గమనిస్తున్నదని హెచ్చరిం చారు. అధికారంలోకి వచ్చేది మేమే రూ. 2లక్షల రుణాలు తెచ్చుకొండి అని రెచ్చగొట్టినావని, తీరా అధికా రంలోకి వచ్చి 8 నెలల గడిచాక రుణమాఫీకి గండి కొట్టినావని, అధికారం దక్కించుకునేందుకు మోసావని, దక్కిన అధికారాన్ని నిలుపుకునేందుకు మరో మోసా వని, నీ 8 నెలల ప్రయాణ మంతా మోసాల చరిత్రనే రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదన్నరేండ్ల కాలంలో 70వేల కోట్లు రైతు బంధు కింద, రూ. 30వేల కోట్లు రుణమాఫీ కింద మొత్తం లక్ష కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసిందని, నువ్వు మాత్రం ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టి, అధికారంలోకి వచ్చాక ఉసూరుమ నిపించినవని, రైతులకు రైతు భరో సా అన్నవ్, రైతు కూలీలకు అన్న వు, కౌలు దారులకు అన్నవ్ అంద రికి ఎగనామం పెట్టినవ్ రైతు బంధు పైసలు ఎగ్గొట్టి, ఆ పైసలు ఇటు డైవ ర్ట్ చేసి తూతూ మంత్రంగా రుణమా ఫీ చేసి డప్పు కొట్టుకుంటున్నవ్, డబ్బా వాయిస్తున్నవ్ రైతు బంధు డబ్బులు డైవర్ట్ చేసినవని, ఆగస్టు 6న తెలంగాణ భవన్ లో రుణమా ఫీ కాల్ సెంటర్ (call center)ఏర్పాటు చేసినం. ఫోన్ కాల్స్, వాట్సప్ ద్వారా గడి చిన 10, 11 రోజుల్లో లక్ష 16 వేల ఫిర్యాదులు వచ్చినయ్. రుణమాఫీ కాలేదు న్యాయం చేయండని రైతు లు ఆవేదన చెందుతున్నరు.

ఊ ళ్లల్లకు పోతే రైతన్నలు కన్నీళ్లు పెట్టు కుంటున్నరు. రుణమాఫీ కోసం అగ్రి కల్చర్ ఆఫీస్, బ్యాంకుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నరని, అధికారుల కాళ్ల వేళ్ల మీద పడి వేడుకుంటున్నారని, ఓపిక నశించి బ్యాంకుల ముందు నిరసన తెలుపు తున్నారని, ఇదంతా అబద్దమా రే వంత్ రెడ్డి, రోజూ పత్రికల్లో, టీవీల్లో వస్తున్నవే కదా రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి ఎందుకు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు రైతు బంధు రాక, మరో వైపు మీరు రుణమాఫీ చెయ్యక రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగ మ్యగోచరంగా మారింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం కళ్లు, చెవులు, నోరు లేనట్లు వ్యవ హరి స్తున్నదని, దమ్ముంటే రుణ మాఫీ మీద శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ (demand) చేశారు.

రైతులు ఎందరు, అప్పు ఎవరికి ఉంది, ఎంత డబ్బు ఖాతాల్లో జమ అయ్యింది బయట పెట్టాలని అప్పిలు చేశారు. ఒక్క విషయంలో మాత్రం నిన్ను ఒప్పుకోవాలి రేవంత్ రెడ్డి (Revanth Reddy) పరిపాలనలో ఫ్లాప్ అయ్యా రని, తొండి చేయడంలో తోపు, భూతులు మాట్లాడంలో టాపు ఇందులో ఎవరికి అనుమానం లేదని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేయలేక చేతులెత్తేసినందుకు నువ్వు రాజీనామా చేయాల్సింది పోయి, సిగ్గులేక చోర్ ఉల్టా కొత్వాల్ కో డాంట అన్నట్లు నన్ను రాజీనా మా చెయ్యమంటున్నవు, రుణ మాఫీలో కోత మాటలేమో రోత, ఇది నీ వైఖరి, భుతులు తిడితే రుణమాఫీ అయిపోతుందాఖా తాల్లో డబ్బులు పడతాయాతొండి చేసుకుంట మొండిగ మాట్లా డుతున్నవ్ రంకెలేస్తే అంకెలు మారి పోవని, అబద్దాలు నిజమైపోవని, మమ్మల్ని తిట్లు తిడుతవ్ కావొచ్చు, కానీ దేవుడి మీద పెట్టిన ఒట్లు ఎట్ల మర్చిపోతవు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఏమన్న డు, ఎన్ని దేవాలయాల మీద ఒట్లు వేసిండు, యాదగిరి గుట్ట లక్ష్మిన ర్సింహా స్వామి సాక్షిగా రామప్ప దే వాలయం శివుడి సాక్షిగా, సమ్మక్క సారలమ్మ సాక్షిగా, వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా, జోగులాంబ సాక్షిగా, బాసర సరస్వతి మందిరం సాక్షిగా.

కొమురవెళ్లి మల్లన్న సాక్షిగా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ (Grandmother of Jubilee Hills) సాక్షిగా కురుమూర్తి సాక్షిగా సిద్దుల గుట్ట సాక్షిగా అనం తగిరి కొండల్లో ఉన్న పద్మనాభుడి సాక్షిగాపాలమూరు ప్రజల సాక్షిగా, జహంగీర్ పీర్ దర్గా సాక్షిగా.సేవాలాల్ సాక్షిగా, బావూజీ సాక్షిగామెదక్ చర్చ్ సాక్షిగా ఏడు పాయల దుర్గమ్మ సాక్షిగాఅంటూ గుడి, చర్చి, మసీద్ సాక్షిగా ఒట్లు వేసి రుణమా ఫీ అమలు చేస్తానని మాట తప్పిం డని దుయ్యబెట్టారు.హిందు, ము స్లిం, క్రిస్టియన్లు నమ్ముకున్న దేవుళ్ల ను కూడా రేవంత్ (Revanth Reddy)మోసం చేసిండు. రైతులనే కాదు, దైవ ద్రోహానికి పా ల్పడ్డారని, పాలకుడిగ నువ్వు పా పం మూటగట్టుకున్నవని చెప్పారు.

రాష్ట్రానికి ఎక్కడ లత్తగొడుతదో అని ప్రజలు భయపడుతున్నరని, రైతులకు తీరని ద్రోహం చేసినవ్, దేవుళ్లకు తీవ్రమైన అపచారం చేసి నవని, దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి మా ట తప్పిన పాపం ఊరికే పోదని, రా ష్ట్రానికి చుట్టుకుంటుందని, ఊర్లల్ల అదే భయపడుతున్నారని, దేవుళ్ళ మీద నిజమైన భక్తీ ఉన్న ప్రతి వ్యక్తీ నువ్వు చేసిన పాపం చూసి భయ పడుతున్నాడని తెలిపారు. నువ్వా ప్రాయశ్చిత్తం చేసుకోవు, నీ పాపం ప్రజలకు శాపం కావద్దని నేను తీర్థ యాత్రకు (Pilgrimage) బయలుదేరుతా, మా పార్టీ సీనియర్ నాయకులు కూడా వస్తారు.ముక్కోటి దేవతల్ని, అల్లా, జీసస్ లను వేడుకుంటా ఈ పాపా త్ముడు చేసిన తప్పుకు ప్రజలకు కీడు చేయొద్దని వెడుకుంటానని తెలిపారు. ప్రైమరీ స్కూల్ పిల్లలు కూడా రుణమాఫీ అయ్యిందా లేదా చెబుతారని, ఎంత మంది ఉండే, ఎంత మందికి వచ్చింది సింపుల్.అది చెప్పలేక, సిగ్గ్గులేదని, జాతి అని మాట్లాడుతారు.సీఎం(cm) ఇలా మాట్లడచ్చునా, మేము ఇంతకంటే ఎక్కువ మాట్లాడతామని, ప్రశ్నిస్తే చావాలని మాట్లాడుతున్నారు.నీ గాడ్ ఫాదర్స్ కి భయపడలేదు.

నీ తాటాకు చప్పుళ్లకు బయపడం మిస్టర్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), రుణమాఫీ విష యంలో మాట తప్పావ్ ఫెయిల్ అయ్యావoటూ రుణమాఫీ రైతు లందరికి చేసే దాకా, రైతు భరోసా (rythu barosa) ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పక్షాన పోరాటం చేస్తామని, మరో రైతాంగ ఉద్యమానికి శ్రీకారం చుడతామని, పార్టీ తరుపున త్వరలో కార్యాచర ణ ప్రకటిస్తామని వెల్లడించారు.

సిద్దిపేట ఆఫిస్ పై కాంగ్రెస్ దాడి గురించి హరీష్ రావు ఆగ్రహం..

పాక్షికంగా జరిగిన రుణమాఫీ మా పోరాటం వల్లే, మేము చేసిన సవాల్ వల్లే, రైతుల తరుపున రుణమాఫీ చెయ్యాలని ప్రశ్నిస్తే గుండాలతో దాడులకు పురమా యించారని హరీష్ రావు (harish rao)ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా దాడులు చేస్తే పెట్టుబడులు వస్తాయా అమెరికా పోయింది పెట్టుబడులకా లేక, దా డుల గురించి నేర్చుకోడానికా. అంటూ అంతా ప్రజలు గమనిస్తు న్నారని, దాడులు కొత్తకాదని,
దాడులకు బయపడం రైతుల తరుపున పోరాటం చేస్తం పదేళ్లు అధికారంలో ఉన్నాము ఇలా ఎప్పు డూ దాడులకు పాల్పడలేదని గుర్తు చేశారు. దాడిని తీవ్రంగా ఖండిస్తు న్నామని, ఇలాంటివి పునరావృత మైతే తీవ్ర పరిణామాలు ఉంటా యని హెచ్చరించారు.